Sunday, October 31, 2010

కొండ రహస్యం

భూమి, సూర్యుడు ఒకప్పుడు భార్యాభర్తలట.
కొన్ని లక్షల సంవత్సరాల పాటు వాళ్లిద్దరే కబుర్లాడుకుంటూ తాము సృష్టించిన లోకాన్ని కన్నుల పండుగగా చూసుకుంటూ ఎంతో ఆనందంగా బతికేసారట.
ఒకానొక అపురూప క్షణంలో వాళ్లు ఒక బిడ్డను కనాలనుకున్నారు. భూమి, సూర్యుడు తలచుకుంటే నెరవేరనిది ఉంటుందా? వెంటనే వాళ్లకు ఓ అందమైన అబ్బాయి పుట్టాడు. మిగతా సృష్టి బాధ్యతనంతా ఆ పిల్లవాడికి వదిలేసి వాళ్లిద్దరూ విశ్రాంత జీవితం గడపసాగారట.
ఆ పిల్లవాడు చెట్టూ చేమా పక్షీ పశువూ ... అలా ఒకటొకటీ సృష్టించుకుంటూ వాటి కోసం సముద్రం నుంచి కొంత కొంత భూమిని తీసుకుంటూ వచ్చాడట.
సముద్రం ఊరుకుంటుందా? అది ఆ అబ్బాయితో పెద్ద కొట్లాట పెట్టుకుందట. సముద్రానికీ పిల్లవాడికీ మధ్య జరిగిన యుద్ధంలో పిల్లవాడి కాలు విరిగిందట.
తల్లి మనస్సు చూస్తూ ఊరుకుంటుందా? వెంటనే నలుగురు మహాకాయుల్ని సృష్టించి తన పిల్లవాడి సృష్టికి నాలుగు దిక్కులా కాపలా పెట్టిందట.

అయినా సముద్రం ఆగలేదు. సముద్రానికి, ఆ మహాకాయులకు మధ్య అనేకసార్లు యుద్ధాలు జరిగాయి. సముద్రం ధాటికి తట్టుకోలేక అవి ఒక్కొక్కటీ మరణించాయి. అయితే మరణించే ముందు తమను కొండలుగా మార్చమని అవి భూమాతను కోరాయట. చచ్చిపోయినా సరే ఈ సృష్టిని కాపలా కాసే బాధ్యతను వదిలి పెట్టబోమనీ, అలా చిరకాలం బతికే వరం ఇవ్వమనీ అవి ఆమెను ప్రార్థించాయట. ఆమె ఒప్పుకుంది.
అప్పటికే ఖండఖండాలుగా నరకబడ్డ ఆ భారీకాయులు భూగోళమంతటా చిన్నా పెద్దా కొండలుగా అవతరించి అప్పటినుంచీ సృష్టిని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాయట.
కొండల పుట్టుక వెనుక ఆఫ్రికా వాళ్లు చెప్పుకునే కథ ఇది. మన పురాణాల్లోనూ వెతికితే ఇలాంటి కథలు బోలెడు దొరకొచ్చు కాని ఏం లాభం? వినేవాళ్లెవరు? నమ్మేవాళ్లెవరు? ఒక్క కరీంనగర్‌లోనే 560 గుట్టల్ని తవ్వి పడేస్తుంటే మాట్లాడేవాళ్లేరీ ... భూమాతతో సహా.

Wednesday, October 27, 2010

అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ .... యూఎఫ్‌ఓ


యు.ఎఫ్.ఓ...డిన్నర్ పళ్లెం
ఎగిరే పళ్లేలలో ఏలియన్లు వస్తున్నారు...మనతోపాటు మన ఇంట్లో డైనింగ్ టేబుల్‌పై డిన్నర్ చేసేందుకు!
అవును ఆ రోజులు ఎంతో దూరంలో లేవు! అమెరికన్లు వారి కోసం సిద్ధమవుతున్నారు... వారికి ఐక్యరాజ్యసమతి స్వాగత సన్నాహాలు చేస్తోంది. ఇక మనం కూడా డిన్నర్ పళ్లేలను ఫలహారాలతో నింపి స్వాగతిద్దామా...!


సరిగ్గా నెల క్రితం ఐక్యరాజ్యసమితి ఒక వింత ప్రకటన చేసింది. యాభై ఎనిమిదేళ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ మజ్లన్‌ఆథ్‌మన్ ఇక పై అంతరిక్షానికి దౌత్యవేత్తగా వ్యవహరిస్తారంటూ ఆ ప్రకటన సారాంశం. ‘అంతరిక్షానికి దౌత్యవేత్త ఏంటి?’ అన్న ప్రశ్నకు సమాధానంగా... ఒకవేళ గ్రహాంతరవాసులు గనుక భూమికి వస్తే ‘ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్’ (మొట్టమొదటగా కలవవలసిన మనిషి) మజ్లన్ ఆథ్‌మన్ అని తేల్చిచెప్పింది ఐక్యరాజ్యసమితి! ఈ వార్త ఎంతోమందిని విస్తుపోయేలా చేస్తే, ఇంకెంతోమందిని నవ్వుకునేలా చేసింది.
‘ఇది నిజంగా జరిగే పనేనా?! ఉన్నట్టుండి ఇంత అర్జెంట్‌గా ఇలాంటి ప్రకటన వెలువడడానికి కారణం ఏంటీ..?’ ఆలోచించాల్సిన విషయమే!!!

అక్టోబర్ 13, 2010 న్యూయార్క్ సిటీలోని చెల్సీ ప్రాంతవాసులు ఒక్కసారిగా రోడ్డు మీదకి పరుగుతీశారు. అది ఏ భూకంపం నుంచో తప్పించుకోవడానికి కాదు... ఆకాశంలో గుండ్రంగా తిరుగుతున్న సాసర్ల లాంటి వస్తువులు, తెల్లని కాంతిలో మెరిపోతూ కళ్లకు కనిపించేటంత దూరంలో తిరగాడుతుండటమే దానికి కారణం. అక్కడి టివీ ఛానల్ 7 కెమెరాలు ఈ వింతని బంధించటమే కాదు దీనిపై స్పందించమని ఎఫ్‌ఏఏ (ఫెడరల్ ఏవియేషన్ అసోసియేషన్) వారిని కోరింది. అయితే వీటివల్ల విమానాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని మాత్రమే ఎఫ్‌ఏఏ ప్రకటన విడుదల చేసింది. అంతకు మించి ఎటువంటి సమాచారాన్ని బయటకి పొక్కనివ్వలేదు. కాని ఆ రోజు అక్కడ జరిగింది ఓ ‘యుఎఫ్‌ఓ సైటింగ్.’ అంటే... ఆ రోజు ఆకాశంలో గుర్తుతెలియని ఎగిరే పళ్లేలను ప్రజలు చూశారు. అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్‌గా పేర్కొనే వాటికి సంక్షిప్తరూపమే ఈ... యూఎఫ్‌ఓ.

జులై 7, 2010 చైనాలోని ఝీజియాంగ్ ప్రాంతంలోని ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కుతున్న ప్రయాణికులను ఉన్నట్టుండి ఆపేశారు. అంతే కాదు ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను గంటపాటు నిలిపివేశారు. కారణాలు చెప్పలేదు. దీనికి కారణం ఆకాశంలో కనిపించిన గుర్తుతెలియని వస్తువని తర్వాత తెలిసింది. సుమారు గంటపాటు జరిగిన ఈ ప్రక్రియ అధికారులకు తెలిసే జరిగినా ప్రభుత్వం మాత్రం దీని తదనంతరం ఎటువంటి సంజాయిషీ ఇవ్వలేదు. ఇది జరగడానికి కొన్ని గంటల పూర్వం ఆకాశంలో మెరుస్తున్న పొడవాటి వస్తువుని చూశామని ఆ ప్రాంతవాసుల ప్రత్యక్ష కథనం.

ఇవి రెండూ ఈ ఏడాది ప్రపంచం రెండు వైపులా జరిగిన యుఎఫ్‌ఓ సైటింగ్స్. పైగా వీటికి ప్రత్యక్ష సాక్షులతో పాటు టీవీ కెమెరాల బంధించిన ఫుటేజ్ మరింత బలమైన సాక్ష్యం. దానికి తోడు అటు ప్రభుత్వం నుంచి కాని, ఇటు శాస్తవ్రేత్తల నుంచి కాని ఎటువంటి వివరణ లేకపోవటం ఈ సైటింగ్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీవీ కెమెరాలకు కూడా చిక్కిన ఈ అంతుపట్టని వస్తువుల వెనక రహస్యం ఏంటి? ఇవి కేవలం ట్రిక్ ఫొటోగ్రఫీ ద్వారా నిజంగా జరిగినట్టు భ్రమ కల్పిస్తున్నారా? మరప్పుడు ప్రత్యక్షసాక్షుల మాటేమిటి? ప్రభుత్వాలు ప్రజలకు తెలియకుండా ఏం దాస్తున్నాయి? ఒకవేళ ఆ సాసర్లు నిజంగా కనపడితే అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎవరు వీటిని పంపిస్తున్నారు? వీటిలో గ్రహాంతరవాసులు మన లోకాన్ని చూడడానికి వస్తున్నారా? ఒక వేళ అదే నిజమైతే అవి మనలని కలవడానికి ఎందుకు ప్రయత్నం చేయటంలేదు? లేదా మన ప్రపంచం మీదకి దాడికి సిద్ధపడుతూ రెక్కీ చేయటానికి వస్తున్నారా? లాంటి ప్రశ్నలకి జవాబు లేనందువల్లనేమో వీటి పట్ల మరింత ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

మొట్టమొదటి యుఎఫ్‌ఓ సైటింగ్.
యుఎఫ్‌ఓ సైటింగ్ ఈ మధ్యలో మొదలైన ప్రక్రియ కాదు. ఇలాంటిది మొట్టమొదట చూసిన దాఖలా ఆగస్టు 12, 1886 లో జరిగింది. బోనిల్లా అనే ఓ ప్రముఖ ఖగోళ శాశ్త్రవేత్త సూర్యుడిపై పరిశోధనలు జరుపుతున్న సమయంలో ఒక్కసారిగా దాదాపు 283 గుర్తు తెలియని గుండ్రని ఆకారాలను ఆకాశంలో తిరగాడుతూ ఉండటాన్ని గమనించాడు. వాటిని ఫొటోలు కూడా తీశాడు. వీటికి సంబంధించినంత వరకూ మొదటి ఫోటో ప్రూఫ్ ఇదే. అది మొదలు... నేటి వరకూ తరచూ వీటికి సంబంధించిన సమాచారం ‘అదిగో పులి అంటే, ఇదిగో తోక’ చందాన బైటకి వస్తూనే ఉంది.

చూడటం వరకూ ఓకే... కాని వీటివల్ల హాని కలగవచ్చనే భయం అక్టోబర్ 10, 1886లో మొదటిసారిగా కలిగింది. వెనిజులా దేశంలో మరకైబో నగరంలో జరిగిన వింతైన సంఘటన ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. తుఫాను సమయంలో ఆకాశాన ‘ఝుమ్‌మ్‌మ్‌మ్....’మంటూ శబ్దం చేస్తూ తిరుగాడుతున్న ప్రకాశవంతమైన వస్తువు ఓ గుడిసె వద్ద కనిపించింది. కొంతసేపు అక్కడే తచ్చాడిన ఆ వస్తువు తరవాత ఆకాశంలోకి అదృశ్యం అయిపోయింది. తరవాత ఆ గుడిసె చుట్టు కనిపించిన దృశ్యమే అందరినీ భయభ్రాంతులకి గురిచేసింది. గుడిసె చుట్టూ చెట్టూ చేమా పూర్తిగా కాలి బూడిదై కనిపించింది. అంతేకాదు ఆ గుడిసెలో నివసించే వారు రేడియేషన్ పాయిజనింగ్‌కి గురైనట్టు కూడా తరవాత జరిపిన పరీక్షల్లో తేలింది.

అది మొదలు వీటికి సంబధించినంతవరకూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఈ కథలన్నీ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వీటిని చూసిన ప్రత్యక్ష సాక్షుల కథనాలు కొట్టి పడేయడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఎక్కువగా ఎగిరే పళ్లేల ఆకారంలో ఇవి కనిపించినా వీటిని కోడిగుడ్డు ఆకృతిలో చూసిన వారూ ఉన్నారు. ఆకారం ఏదైనా కళ్లు చెదిరిపోయే తెల్లటి కాంతిని ప్రత్యక్షంగా చూసిన ప్రతీ ఒక్కరూ గమనించారు. కొంతమందికి ఇవి రంగుల లైట్లతో కూడా దర్శనమిచ్చాయి.

టార్గెట్ అమెరికా!
బాగా అభివృద్ధి చెందిన దేశమనో ఏంటో కాని అమెరికా దేశాన్ని సందర్శించే యూఎఫ్‌ఓల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా 1940-60 ప్రాంతంలో యుఎఫ్‌ఓ సైటింగ్స్ ఎక్కువగా అమెరికాలోనే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అమెరికాకు చెందిన సైనిక స్థావరాల పై ఇవి తిరుగాడుతున్నాయన్న విషయంపై ప్రభుత్వం ఒక అధికారిక పరిశోధన (ఇన్వెస్టిగేషన్) ప్రారంభించింది. 1948 జనవరి 7న ఫోర్ట్‌నాక్స్, కెంటకీ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. ఆకాశంలో ఏదో గుర్తుతెలియని వస్తువు తిరుగుతోందన్న వార్త తెలిసిన వెంటనే ఫైటర్ జెట్ దాన్ని వెంబండించటానికి నింగిలోకి ఎగిసింది. కాని ఈ జెట్ మళ్లీ తిరిగి రాలేదు. దానిలోని ఫైటర్ పెలైట్ మృత్యువాత పడ్డాడు. కారణాలు బైటకి రాలేదు. 1952 లో వరుసగా రాడార్‌పై కనిపించిన ఈ యుఎఫ్‌ఓలు అక్కడ దేశవ్యాప్తంగా మొదటిపేజీ ప్రధాన కథనంగా మారాయి. దాంతో ఈ విషయాలను దర్యాప్తు చేయాల్సిందిగా అక్కడి ప్రభుత్వం సిఐఏకు కేసు అప్పగించింది. అయితే ఈ సంగతులేవీ బైటకి పొక్కకుండా జాగ్రత్త పడింది.

మానవులతో కాంటాక్ట్
1957లో బ్రెజిల్ దేశానికి చెందిన ఆంటోనియో విల్లాస్ బోయాస్ అనే వ్యక్తి రాత్రి పూట పని పూర్తి చేసుకొని, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై కార్లో రేడియో వింటూ ఇంటికి వెళ్తున్నాడు. సడెన్‌గా రేడియో వింత వింత శబ్దాలు చేయటం మొదలు పెట్టింది. కారు ఉన్నట్టుండి ముందుకి వెళ్లనని మొరాయించింది. ‘ఏంటా?’ అని ఆలోచిస్తున్న ఆంటోనియో కళ్లు తిరిగిపోయే దృశ్యాన్ని చూశాడు. కారుకి ఎదురుగా పెద్ద శబ్దం చేస్తూ ఆకాశంలో వెలిగిపోతూ పళ్లెం ఆకారంలో స్పేస్‌షిప్‌ని పోలిన వస్తువొకటి కనపడింది. జరిగిన దాన్నుంచి తేరుకునేలోగానే ఎగిరే పళ్ళెం లాంటి వస్తువులో వచ్చిన ఏలియన్లను పోలిన వ్యక్తులు అతనని బంధించి తీసుకువెళ్ళారు.

ఆంటోనియా కథనం ప్రకారం ఆ స్పేస్‌షిప్‌లో అత్యంత ఆధునాతన సైన్స్ లెబొరేటరీ ఉందని... అందులో ఉన్న ఏలియన్లు అతడిని బల్లమీద పడుకోబె ట్టి వింత వింత ఉపకరణాలతో అతనిపై రకరకాల పరీక్షలు జరిపారని తెలిపాడు. పరిశోధనల అనంతరం అతడిని తిరిగి భూమి పైన వదిలేసి వెళ్లిపోయారు. ఆంటోనియో మాటల్లో సత్యం ఉందనటానికి అతని శరీరంపై అంతకుముందులేని మచ్చలు హటాత్తుగా ప్రత్యక్షమవ్వటమే. ఇవి ఏలియన్లు అతనిపై పరిశోధనలు జరిపారనటానికి సాక్ష్యంగా నిలిచాయి. ఇది మొదలు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న వ్యక్తులు మరికొంతమంది ముందుకు వచ్చారు. వీటిని పరీక్షించిన డాక్టర్లు ఇవి ఎంతో అత్యాధునికమైన (సొఫెస్టికేటెడ్) పరికరాలతో, ఎంతో నైపుణ్యం ఉన్న డాక్టర్లు మాత్రమే చేయగలిగినవిగా గుర్తించారు.
- కె. ఎం

ప్రత్యక్ష సాక్షి


1969లో జార్జియా రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేస్తున్నప్పుడు లీరీ అనే పట్టణం దగ్గర్లో తాను యుఎఫ్‌ఓను చూశానని అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ చెప్పిన ఉదంతం ‘జిమ్మీ కార్టర్ యుఎఫ్‌ఓ ఇన్సిడెంట్’గా ప్రఖ్యాతి గాంచింది. ఈ విషయమై అతను 1973లో ఇంటర్నేషనల్ యుఎఫ్‌ఓ బ్యూరో అభ్యర్థన మేరకు ఒక రిపోర్ట్‌ను కూడ ఫైల్ చేశారు. తాను చూసిన వస్తువు తెల్లని కాంతితో మెరిసిపోతూ ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పోలి ఉందని ఆ రిపోర్ట్‌లో కార్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ రోజు అక్కడే కార్టర్‌తో ఉన్న మరో పదకొండు మంది వ్యక్తులు కూడా ధృవీకరించారు. దాదాపు 10 నిముషాల పాటు రంగుల కాంతులని చిందించిన ఆ వస్తువు తిరిగి ఆకాశంలో అదృశ్యం అయిపోయిందన్నది వీరి కథనం.

క్రాప్ సర్కిల్స్... పొలాల్లో యుఎఫ్‌ఓలు
అమెరికాలోని క్యాన్సెస్ రాష్ట్రంలో రైతులు ఓ కొత్త తరహాలో యుఎఫ్‌ఓల ఉనికిని గుర్తించారు. ఉదయం లేచేటప్పటికి పొలాల్లో ఎంతో నైపుణ్యంతో ఎవరో చేసినట్టు గుండ్రని వలయాలు దర్శనమిచ్చాయి. ఇదేం పెద్ద విషయం కాదనుకునే వారికి ఆ వలయాలు ఒక్కొక్కటి కొన్ని మీటర్ల పొడవుతో ఉండటమే కాదు అవి ఏర్పడిన చోటు గడ్డి మొత్తం కాలిపోయి ఉంది. అలాంటి ఒక వలయం చేయడానికి మనుషులకి కనీసం 9-10 గంటల సమయం పడుతుంది.

అది కూడా ఏదైనా మిషన్ సహాయంతో! కాని అక్కడ దర్శనమిచ్చినవి ఒకటి రెండు వలయాలు కాదు... దాదాపు 10 వరకు ఉన్నాయి. అంటే ఒకవేళ మానవమాత్రులు పూనుకుని వాటిని రూపొందించాలన్నా వాటిని తయారు చేయడానికి ఒక రాత్రి సరిపోదు! అంతేకాదు అక్కడి రైతులకి తమ పశువుల్లో కొన్ని గల్లంతవడం, మరికొన్నింటి అవయవాలు తీసేసి వాటి కళేబరాలు మాత్రం పడేయడం వారిలో ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించాయి. పరిశోధనల తరవాత తేలిన విషయం ఏంటంటే ఆ వలయాకృతులు మానవులు రూపొందిచలేరనీ... ఏవో చాలా బరువైన వేడి వస్తువులు అక్కడ వాలినందుకే అవి ఏర్పడ్డాయని తెలిసింది. కాని అవేమిటో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కలేదు.

అంతా ట్రాష్...

‘గ్రహాంతరజీవులా, ఫ్లయింగ్ సాసర్లా... అంతా ట్రాష్!’ అంటూ కొట్టి పడేసే వారూ ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వేరే దేశాల పైకి వేగుల్లాగా, గూఢచారిగా పనిచేయడానికి వాడే విమానాలకు ‘ఎగిరే పళ్లేలు’ అని పేరు పెట్టారన్నది వీరి వాదన. అందుకే వీటి వెనకాల అంత రహస్యం అంటారు. కాని ఈ యుఎఫ్‌ఓ లను చూసినవారిలో సామాన్య ప్రజలే కాదు, శాస్తవ్రేత్తలు, పోలీస్ అధికారులు, పెలైట్లు. సమాజంలో బాధ్యాతాయుతమైన వృత్తుల్లో ఉన్నవారు, అంతెందుకు అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ కూడా ఉన్నారంటే... ఇవి ఉన్నాయనే కదా అర్థం?!

పి.ఎస్: 2005, ఏప్రిల్7న అమెరికా ప్రెసిడెంట్ నివాసమైన వైట్ హౌస్‌ని యుఎఫ్‌ఓ సైటింగ్ కారణంగా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2007, మార్చి 7న లో మన దేశ ప్రధాని నివాసం దగ్గర రెండు యుఎఫ్‌లో దర్శనమిచ్చాయి.

Monday, October 25, 2010

Dirty fun at mud festival

The Paleo is the largest Switzerland open-air music festival.Students and festival volunteers paid tribute to the 40th anniversary of the Woodstock music festival by spreading the fun of mud as it was done in 1969 in Upstate New York.According to the festival organization, the project is a “back to the earth” psychedelic inspiration and 100% recyclabledirty festival (6)


dirty festival (7)
Mud is also used in medical porpuse, the health benefits that users swear by are not scientifically proven, but you know what you feel. The mud treatment is said to help clear clogged pores. Toxins are removed from the body as well. Those who suffer from pain in their muscles and joints have found relief through mud baths
dirty festival (5)
dirty festival (4) dirty festival (3)
dirty festival (2)
dirty festival (1) dirty festival dirty festival (8)

So you can combine two usufull stuff in one, music festival and mud beauty and healthy treatment to heal and rejuvenate the entire body.

ముగాబే భార్య ప్రేమాయణం * రిజర్వ్‌బ్యాంకు అధిపతితో ఐదేళ్లుగా కొనసాగిన వ్యవహారం

పాణభయంతో ముగాబే భార్య ప్రియుడు
మాజీ ప్రియుల్లో ఒకరి అనుమానాస్పద మృతి, మరొకరి పరారీ



జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే భార్య గ్రేస్ ముగాబే ఒక బ్యాంకర్‌తో నడిపిన ప్రేమాయణం తాజాగా వెలుగులోకి వచ్చింది. రాబర్ట్ ముగాబేకు సన్నిహితుడైన జింబాబ్వే రిజర్వ్ బ్యాంకు అధిపతి గిడియన్ గోనోతో దాదాపు ఐదేళ్లు గ్రేస్ వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు బ్రిటిష్ దినపత్రిక ‘డెయిలీ మెయిల్’ వెల్లడించింది. ఈ వ్యవహారం బయటపడటంతో గోనో ప్రాణభయంతో వణికిపోతున్నాడని తెలిపింది. ఈ కథనం ప్రకారం... రాబర్ట్ ముగాబే (86) కంటే గ్రేస్ వయసులో 41 సంవత్సరాలు చిన్న. ముగాబేకు సన్నిహితుడైన గోనోతో ఆమె పరిచయం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ తరచు రహస్యంగా కలుసుకునే వారు. గ్రేస్‌కు చెందిన డెయిరీ ఫాంలోను, హోటళ్లలోను నెలకు కనీసం మూడుసార్లయినా కలుసుకునే వారు. ఐదేళ్లకు పైగా సాగిన ఈ వ్యవహారం ముగాబేకు మాత్రం ఈ ఏడాది జూలైలోనే ఆయన సోదరి సబీనా ద్వారా తెలిసింది.

సబీనా మరణశయ్యపై ఉన్న సమయంలో గ్రేస్ రహస్య కార్యకలాపాల వివరాలను తన సోదరుడు ముగాబేకు చెప్పింది. ముగాబేను 1996లో వివాహమాడినప్పటి నుంచి గ్రేస్‌కు గోనోతో పరిచయం ఏర్పడింది. జింబాబ్వే రిజర్వ్ బ్యాంకు అధిపతిగా కొనసాగుతున్న గోనో భాగస్వామ్యంతో ఆమె పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గోనో హయాంలోనే జింబాబ్వేలో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుని, కరెన్సీకి విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం అతడు 47 పడక గదులు, ఈతకొలను తదితర వసతులు గల విలాస సౌధంలో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. గోనో, ముగాబే భార్య గ్రేస్ ప్రేమికులని గోనో కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. ముగాబే మరణించాక కలసి జీవించాలని కూడా వారు నిర్ణయించుకున్నారని తెలిపారు. గ్రేస్‌కు ఇదొక్కటే వ్యవహారం కాదు, ఇదివరకు పీటర్ పామైర్, జేమ్స్ మకాంబా అనే వారితోనూ ప్రేమాయణాలు ఉన్నాయి. పీటర్ ఒక అనుమానాస్పద కారు దుర్ఘటనలో మరణించగా, జేమ్స్ దేశాన్ని విడిచి పారిపోయాడు. తాజా వ్యవహారం బయటపడటంతో గోనో ప్రాణభయంతో భీతిల్లుతున్నాడని జింబాబ్వే ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వెల్లడించారు.

Sunday, October 24, 2010

కాంగోలో జీవితం తుపాకీ మీద సామే!

నిత్యం తుపాకీ మోతలు.. ఏ బాంబు ఎటు నుంచి వచ్చిపడుతుందో తెలియని పరిస్థితి.. దారికాచి దోచుకునే దొంగలు... ఇంటి నుంచి బయటికిపోయి మళ్లీ ఇంటికి వచ్చేదాకా ప్రాణం మీద నమ్మకం లేని జీవితం గడపడమంటే ఎట్లా ఉంటుంది? ఊహిస్తేనే అమ్మో అనిపిస్తోంది కదూ.

కానీ అలవాటు పడితే అవన్నీ జీవితంలో భాగమవుతాయి అంటారు పరుపాటి శ్రీనివాసరెడ్డి. దేశం కానీ దేశంలో.. తన భాషరాని మనుషుల మధ్య ఆరేళ్లుగా జీవితాన్ని తుపాకీ మీద సాములాగా సాహసంతో నెట్టుకువస్తున్నాడీయన. కాంగో దేశంలోని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఓ) పీస్ కీపింగ్ మిషన్‌లో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తోన్న ఆయన అనుభవాలు నిన్న యుఎన్ఓ డే సందర్భంగా...

"నా పేరు పరుపాటి శ్రీనివాసరెడ్డి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్దకొర్పోలు మా గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. నలుగురు అన్నదమ్ములు. ముగ్గురు అక్కచెల్లెళ్లు. డిగ్రీ నర్సంపేటలో చేశాను. ఎంకాం ఉస్మానియా యూనివర్సిటీలో, ఐసీడబ్ల్యూఏ ఇంటర్ విజయవాడలో చేశాను. మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలని అనుకునేవాణ్ని. అందుకోసం కంప్యూటర్ తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. కంప్యూటర్ (సాఫ్ట్‌వేర్) నేర్చుకునే దగ్గరే టర్న్ అయింది జీవితం.

అప్పట్లో సాఫ్ట్‌వేర్ బూమ్ బాగా ఉంది. నేను మొదటి నుంచి బ్రిలియంట్‌నేం కాదు. బిలో యావరేజ్ స్టూడెంట్‌ను. నేను టెన్త్ థర్డ్‌క్లాస్‌లో పాసయ్యాను. అటువంటిది నెమ్మది నెమ్మదిగా ఒక్కోమెట్టు ఎక్కుతూ సాఫ్ట్‌వేర్ దగ్గరకొచ్చేసరికి యావరేజ్ అయ్యాను. ఇంటర్‌నెట్ చూడటం, ఛాటింగ్ చేయడం అప్పట్లో హాబీగా ఉండేది. ఆన్‌లైన్లో ఈ ఉద్యోగం సంపాదించుకున్నాక ఒక సంవత్సరం కొసావో (యుగోస్లావియా)లో పనిచేశాను.

ఆ తరువాత పూర్తిస్థాయిలో యుఎన్ లోటస్ నోస్ డెవలపర్‌లో ప్రోగ్రామర్‌గా 2004, సెప్టెంబర్ 4 నుంచి కాంగోలో పనిచేస్తున్నాను. శాంతి పరిరక్షణ కోసం, ప్రజల భద్రత, వనరుల భద్రత కోసం యుఎన్ఓ ఎన్నో దేశాల్లో పీస్ కీపింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. మేం చేయాల్సిందల్లా యుఎన్‌కు సంబంధించిన విధానాలను అమలు చేయడమే. వివిధ దేశాల నుంచి ఎంతో మంది శాంతిపరిరక్షణ కోసం ఈ మిషన్‌లో భాగం పంచుకుంటున్నారు.

కాంగోలో ఇండియన్ కాంట్రిబ్యూషనే ఎక్కువగా ఉంటుంది. మిలిటరీ పరంగా కానీ, ఇతరత్రా సహాయ సహకారాల పరంగాగానీ. మేం చేయాల్సింది ఆయా సందర్భాల్లో ట్రూప్స్‌కు ప్రోగ్రామ్స్‌ను (సాఫ్ట్‌వేర్ పరంగా) డెవలప్ చేయడం, వాటిలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే పరిష్కరించడం అంతే.

ఎప్పుడూ గొడవలే...
మా అవసరం ఎక్కడుంటే అక్కడికి రోజూ వెళ్లాల్సి ఉంటుంది. మామూలుగా డ్యూటీ టైమింగ్స్ అంటే ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 దాకా ఉంటుంది. శనివారం ఒక పూటే. అయితే డ్యూటీ ప్లేస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం ఏ మూడో నాలుగో అవుతుంది. ఆదివారం సెలవు తప్పనిసరేం కాదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. జీవితం క్షణం క్షణం రిస్క్‌గానే ఉంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే లైఫ్ ఎప్పుడూ గొడవలు, కొట్లాటల మధ్యే సాగుతూ ఉంటుంది. రాళ్లు విసురుకోవడాలూ కాల్పులూ తరచుగా ఉంటాయి. మొదట్లో భయం వేసేది. ఇప్పుడు అలవాటైంది (నవ్వుతూ). మొదట చాలా కాలం అక్కడి భాషరాక ఇబ్బంది పడ్డాను. కాంగోలో ఎక్కువగా స్వాహిలీ భాష మాట్లాడతారు. దాంతో పాటు ఫ్రెంచ్, ఇంగ్లీష్‌లు కూడా మాట్లాడతారు.

అయితే ప్రజలతో సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి మాకు. ఇంగ్లీష్ ఎలాగూ వచ్చు. ఇప్పుడు స్వాహిలీ, ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నాను. పనిచేయడానికి భాష పెద్దగా అడ్డుకాదు. అక్కడి ప్రజలు చాలా మంచివారు. నల్లగా, పొట్టిగా ఉంటారు. వాళ్లకున్నన్ని సహజవనరులు ఎక్కడా లేవనిపిస్తుంది నాకు. బంగారం, రాగి, బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి.

వనరుల ఆధిపత్యం కోసమే కాంగో ప్రభుత్వానికీ, తిరుగుబాటు దార్లకూ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. రెబల్ గ్రూప్స్‌కి ్రపైవేట్ ఆర్మీ పెద్ద సంఖ్యలో ఉంటుంది. దాడుల సమయంలో రాళ్లు విసురుకోవడం, గ్రూపుల మధ్య కాల్పులు జరగడం సర్వసాధారణ దృశ్యాలు. కిన్సాసా, గోమా, కిగాలి లాంటి ప్రాంతాల్లో గొడవలు ఎక్కువ. మేము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లలేం.

కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే మాకు పూర్తి భద్రత ఉంటుంది. యుఎన్ వాహనాల్లో మాత్రమే వెళతాం. అప్పుడప్పుడు మేం ప్రయాణించే వాహనంపైనా దుండగులు రాళ్లు విసురుతారు. ఒక్కోసారి రెండు రోజులపాటు ఇంటికి తిరిగి రాలేము.

మా ఆవిడ బోరున ఏడ్చింది...
నాకు 2006లో మమతతో పెళ్లి అయింది. వాళ్లది నర్సంపేట. పెళ్లికి ముందే నా డ్యూటీ గురించి, జీవితం గురించి వివరంగా చెప్పాను. కొంతకాలం ఇక్కడే ఉంది. ఆ తరువాత 'నేనూ వస్తాను' అని పట్టుబట్టింది. ఆమెను అక్కడికి తీసుకెళ్లాలంటే యుఎన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని ఎలాగోలా అక్కడికి తీసుకెళ్లాను. ఇప్పుడు ఆమె నాతోనే ఉంటుందక్కడ. మొదట్లో మేం కిన్సాసాలో ఉండేవాళ్లం. ఇప్పుడు గోమాలో ఉంటున్నాం. మేం ఉండేది పైఅంతస్తులో.

మా కింది పోర్షన్‌లో శ్రీలంక ఫ్యామిలీ ఉండేది. అనుకోకుండా పెద్ద గొడవ జరిగి అది కాల్పుల దాకా వెళ్లింది. శ్రీలంకకు చెందిన ఒకావిడ, పేరు గుర్తుకురావడం లేదు, మా మిషన్‌లో పనిచేసే వ్యక్తి భార్య పెద్దపెట్టున అరుపులు, పెడబొబ్బలు పెడుతోంటే ఈమే (మమత) కాల్పులు జరుగుతున్నా సరే ధైర్యంతో కిందికి దిగి ఆమెను మా పోర్షన్‌లోకి తీసుకొచ్చింది.

ఆ సమయంలో నేను డ్యూటీలో ఉన్నాను. రెండు రోజులు పరిస్థితులు అనుకూలించక అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తరువాత మీదపడి బోరున ఏడ్చింది. నాకూ కన్నీళ్లు ఆగలేదు. ఆ సంఘటన గుర్తుచేసుకుంటే ఇప్పటికీ గగుర్పాటే.

వీకెండ్స్ కొంచెం హ్యాపీ
మా మిషన్ పనితీరును పర్యవేక్షించేందుకు, సమీక్షించేందుకు ఐరాస దేశాల ప్రతినిధులు తరచూ వస్తుంటారు. కోఫీ అన్నన్ (యుఎన్ఒ మాజీ సెక్రటరీ జనరల్), హిల్లరీ క్లింటన్ ఇతర ప్రముఖులు కూడా తరచూ వచ్చి మాకు సలహాలు ఇస్తుంటారు. అటువంటివాళ్లను దగ్గరగా చూడటం సంతోషంగా ఉంటుంది. ఇటువంటి జీవితానికి వీకెండ్స్ కొంచెం హ్యాపీనిస్తాయి.

వీకెండ్స్‌కు ఇండియన్ ఫ్యామిలీస్ అంతా ఒక్కచోట చేరుతాం. ఎక్కువగా కాంగో సరిహద్దు దేశాల్లో గడిపేందుకు ఇష్టపడతాం. ఉగాండా, రువాండ, అంగోలా, టాంజానియా, బురుండీ, జాంబియా దేశాలకు అప్పుడప్పుడూ వెళతాం. మేముంటున్న గోమా రువాండాకు దగ్గర. దాని రాజధాని కిగాలి భలే బాగుంటుంది. అందుకే అక్కడికి ఎక్కువసార్లు వెళతాం.

అక్కడి లోకల్ తిండి తినలేం. వాళ్లు మాంసాహారులు. బీఫ్, బ్రెడ్ ఎక్కువగా తీసుకుంటారు. మాకు అవి పడవు. కనుక ఇండియన్ ఫుడ్‌నే తీసుకుంటాం. రైస్ ఎంత కాస్ట్ అయినా సరే కొంటాం (5కిలోల బియ్యం ధర అక్కడ రూ. 700. అంటే కిలో బియ్యం రూ.140 అన్నమాట). గోధుమ పిండిని చపాతీ పౌడర్ అంటారు దాన్ని ఎంత దూరంలో ఉన్నా సరే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాం.

కూరగాయలు బాగా దొరుకుతాయి. కాఫీతోటలు విస్తారంగా ఉంటాయి కనుక ధర కొంచెం తక్కువగా ఉంటుంది. బతకడానికి పోయాం కానీ తినేందుకు కాదు కదా అనిపిస్తుంది. లంచ్‌బాక్స్ ఇంటి నుంచే తప్పనిసరి తీసుకెళతాను. హ్యాపీనెస్ అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండదు. చేసే పనే హ్యాపీ అనుకోవాలి. ఆ మిషన్‌లో పనిచేసే అవకాశం దొరకడమే గ్రేట్‌గా ఫీలవుతాను.

కంప్యూటర్‌తోనే కాలక్షేపం - మమత
ఆయన డ్యూటీకి వెళ్లాక కంప్యూటర్‌తోనే ఎక్కువ సేపు ఉంటాను. పెళ్లికి ముందు ఆయన చేసే జాబ్ గురించి చెబితే 'అంత రిస్క్ ఉంటుందా?' అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్లి చూశాక చచ్చేంత భయం వేసింది. అయినా సరే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ రోజు ఆమెను మా రూంకి తీసుకొచ్చాను. ఆయన తిరిగొచ్చే దాకా భయమే.

కొద్దిరోజులు బాగా భయపడ్డాను కాని తరువాత అలవాటైపోయింది. ఎక్కడ చూసినా పచ్చదనం, కొండలూ లోయలూ బావుంటుందక్కడ. మా వాళ్లను తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని చూపించాలనిపిస్తుంది. వీకెండ్స్‌లో ఇండియన్ ఫ్యామిలీస్ కలిసినపుడు చాలా సరదాగా ఉంటుంది. ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. నాకు హిందీ వచ్చు. ఇంగ్లీష్ ఓ మాదిరిగా నేర్చుకున్నాను.

మా ఇంట్లో పనమ్మాయితో కొంత టైమ్‌పాసవుతోంది. ఆమె స్వాహిలీ మాట్లాడుతుంది. నేనూ ఆ భాష నేర్చుకొన్నాను. ఇంటర్‌నెట్‌లో సినిమాలు చూస్తుంటాను. మా తమ్ముడితో, అక్కయ్యలతో అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడతాను. మా ఇళ్లలో జరిగే ఫంక్షన్స్‌కు రాలేక పోతున్నామని బాధగా ఉంటుంది. అయినా అక్కడ ఎంతకాలం ఉంటాం? ఇంకో నాలుగైదేళ్లున్న తరువాత ఇండియాకే వచ్చి ఇక్కడే సెటిల్ అవుతాం.

పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిరాభివృద్ధి

ఉపాధికి 'పచ్చ' దిక్కు


వాతావరణం కలుషితమవుతోంది.. ఓజోన్ పొర క్షీణిస్తోంది... భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి..అని గగ్గోలు పెట్టిన ప్రపంచం ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించే పనిలో పడింది. 'రీయూజ్, రెడ్యూస్,రీసైకిల్', వెల్త్ ఆవుట్ ఆఫ్ వేస్ట్, గ్రీన్ కన్‌స్ట్రక్షన్స్ , గ్రీన్ టెక్నాలజీ, ఎకో ఫ్రెండ్లీ, గో గ్రీన్...సేవ్ గ్లోబ్...అంటూ పదేపదే వల్లెవేస్తోంది. అందుకే 'ఎకో ఫ్రెండ్లీ' అంటేనే ఓ బ్రాండ్ అయిపోయింది. ఈ పరిణామం ప్రధానలక్ష్యం పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిరాభివృద్ధి కూడా. అంటే ఒక హాని ఆరోగ్యకరమైన కొత్త అభివృద్ధికి నాంది పలుకుతోందన్నమాట. ఇదే ఇప్పుడు ఉపాధి అవకాశాల వెల్లువను సృష్టిస్తోంది. వీటి గురించి ఉస్మానియా యూనివర్శిటిలో పనిచేసి రిటైరై 'సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెనబుల్ డెవలప్‌మెంట్'కి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త కె. పురుషోత్తమ్‌రెడ్డి చెప్పిన 
విశేషా లు. 

ఎన్నడూ లేంది మూడు నెలల కిందట... మాస్కోలో భయంకరమైన క్షామం తాండవించింది. మొన్నటికిమొన్న చైనా, పాకిస్థాన్‌లను భీభత్సమైన వరదలు ముంచెత్తాయి. మన దేశానికి వస్తే... ఎప్పుడూ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో మగ్గే జైసల్మేర్‌లో చిరపుంజిని మించిన వర్షపాతం నమోదైంది. మైనస్ 45 డిగ్రీల టెంపరేచర్‌తో గడగడా వణికే దేశాలు సైతం ఎండతో మండిపోతున్నాయి. వింటే విచిత్రంగా అనిపిస్తోంది కదూ... ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ మరి. భూవాతావరణం వేడెక్కడం, రుతువులు గతితప్పడం ఫలితంగా ఎండైనా, వానైనా, చలైనా ఎక్కువగా ఉండడం. ఇలా వాతావరణం ఎఫెక్టవడమే కాదు దానికి సంబంధించి గొలుసు కట్టులా ఉన్న చాలా విషయాల్లో నష్టం జరుగుతోంది, జరగబోతోంది కూడా. ఇప్పటివరకు దుష్ప్రభావం చూపిస్తున్నవాటిపట్ల మనమేం చేయలేకపోయినా ఇకముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడానికి మాత్రం చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ, ఎకో ఫ్రెండ్లీ, గో గ్రీన్,సేవ్ గ్లోబ్ వంటివి ఈ నేపధ్యంలో నుంచి పుట్టినవే. ఎనలేని ఉద్యోగాల వనరులుగా ఉన్నవి కూడా ఇవే. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ తరం భవిష్యత్తంతా 'పచ్చ'దనమే. ఇదంతా ఎలా మొదలయిందంటే...

ఆక్సిజన్ పుట్టడం వల్లే...

పరిశ్రమలు విడుదల చేసే క్లోరోఫ్లోరో కార్బన్‌లను ఓజోన్‌కు హాని కలిగించే వాయువులుగా మొట్టమొదట గుర్తించారు. అయితే తర్వాత జరిగిన పరిశోధనల్లో ఇంకా అనేక వాయువులు బయటపడ్డాయి. వీటన్నిటినీ కలిపి ఓడిఎస్- ఓజోన్ డిఫ్లిటెటీవ్ సబ్‌స్టాన్సెస్ అంటున్నారు. గాల్లో పైకెళ్లి ఓజోన్‌ను చేరుకున్నాక ఇందులోని క్లోరిన్ తనకుండే సహజ గుణమైన ఆక్సిజన్‌ను పుట్టించడమనే పనిని దిగ్విజయంగా సాగిస్తుంది. కాని ఓజోన్‌పొర ఉన్న చోట మనకు ఆక్సిజన్ అవసరం లేదు. అయితే క్లోరిన్‌కు ఈ విషయం తెలియదు కదా.. అందుకే అది తన పని తాను చేసుకుపోతుంది. ఓజోన్‌పొర క్షీణిస్తోంది.

కొత్త అభివృద్ధి మొదలు

వనరులను విచ్చలవిడిగా వాడుకోవడం, ఆ దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడం వంటివి కూడా ఓజోన్ పొర క్షీణించడం లాంటి దుష్ఫలితాలనిచ్చాయి. ఇదొక్కటే కాదు మనం చేసిన చాలా చర్యలు భూమ్మీదే కాకుండా జల సంపద మీదా తీవ్ర దుష్ప్రభావాన్ని చూపాయి. ఒకొక్కటీ బయట పడుతుంటే ప్రపంచం ఉలిక్కిపడింది. అగ్రరాజ్యాలు వణికిపోయాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఐక్యరాజ్యసమితి 1987 సెప్టెంబరు 16న కెనడాలోని మాంట్రియల్‌లో ఓ అంతర్జాతీయ సదస్సును ఏర్పాటుచేసింది. ఆ సమావేశంలో ఓజోన్ పొరను రక్షించుకోవడం అత్యవసరమని భావించాయి. అందుకు దాదాపు అన్ని దేశాలు సమ్మతిని తెలుపుతూ ఓ డాక్యుమెంట్ మీద సంతకాలు చేశాయి. దీన్నే మాంట్రియల్ ప్రొటోకాల్ అంటున్నారు.

మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం ఓజోన్‌కు హాని చేసే సిఎఫ్‌సి (క్లోరోఫ్లోరో కార్బన్స్) వాయువుల ఉత్పత్తి, వాడకాలను నిషేధించాలి. అయితే ఎసి, ఫ్రిజ్‌లు, కోల్డ్‌స్టోరేజ్‌లాంటివి ఒకప్పుడు విలాసాలుగా ఉన్నా తర్వాత అత్యవసరాలుగా మారాయి కాబట్టి వాటి వాడకాన్ని తగ్గించుకునే వీలు లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? సిఎఫ్‌సికి ప్రత్యామ్నాయంగా, పర్యావరణానికి హాని కలిగించని కొత్త మూలకాలను వెతుక్కోవాలి. అలాంటి మూలకాల మీద దృష్టిపెట్టారు పరిశోధకులు. ఎన్నో పరిశోధనల ఫలితంగా సిఎఫ్‌సి ప్రత్యామ్నాయ మూలకాలు వెలుగుచూశాయి. ఈ ప్రాసెస్ అంతా సంబంధిత రంగాల్లో ఉద్యోగవకాశాలను కల్పించింది. ఒక్క ఓజోన్ విషయంలోనే కాదు పర్యావరణానికి హాని చేస్తున్న అనేక విషయాల్లో ప్రత్యామ్నాయాల కోసం జరుగుతున్న అధ్యయనాలు, పరిశీలనలు, పరిశోధనలు, ఫలితాలే ఒక్కొక్క రంగంలో అనేక అవకాశాలను అందిస్తున్నాయి. అలాగే ఇప్పుడు చర్చల్లో ఉన్న గ్లోబల్ వార్మింగ్ నివారణా ప్రయత్నాలు కూడా ఇలాంటి కొత్త అవకాశాలను చూపించబోతోంది.

సేఫ్ అండ్ క్లీన్...

ఇప్పటిదాకా విచ్చలవిడిగా వాడుతూ ఎన్నో దుష్పరిణామాలకు కారణమైన ఎనర్జీని అదుపు చేయాలని నిర్ణయించాం బాగానే ఉంది. కాని శక్తి లేందే ఏ పనీ జరగదు కదా...మరెలా? అప్పుడే మన కళ్లకు సూర్యుడు కనిపించాడు. మిరుమిట్లు గొలిపే ఆ కాంతి ఎంత వాడినా తరగని శక్తి. ఇంకేముంది సోలార్ ఎనర్జీని ఉపయోగించుకునే యత్నాలు మొదలయ్యాయి. కరెంటు, పెట్రోలియం ఉత్పత్తులన్నింటికీ సౌరశక్తే ప్రత్యామ్నాయం కాబట్టే ఈ రంగంలో అవకాశాలుు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు శక్తికి ప్రకృతిలో వీచే గాలి కూడా మరో ప్రత్యామ్నాయంగా తోచింది. ఫలితంగా గాలిమరలు నిలిచాయి. ఇలా శక్తి వినియోగాన్ని అదుపు చేసే విషయంలో జరిగిన ఎన్నో పరిశోధనల్లో జియోథర్మల్ ఎనర్జీ, బయోగ్యాస్, థైడల్ ఎనర్జీ (సముద్ర అలల నుంచి శక్తిని తీయడం) హానిలేని శక్తివనరులుగా తేలాయి. అలాగే హైడ్రోజన్‌ని కూడా పర్యావరణానికి హాని చేయని శక్తి వనరుగా భావిస్తున్నారు కాబట్టి దీనికీ బ్రహ్మాండమైన భవిష్యత్తుంది. ప్రస్తుతం లోకమంతటినీ ఆకర్షిస్తోన్న అతిముఖ్యమైన శక్తి వనరు జియోథర్మల్.

హాట్‌స్పాట్ ఎనర్జీ

గ్లోబల్ వార్మింగ్‌కి ప్రధాన కారణం బొగ్గే కనక ఇకముందు థర్మల్ పవర్ మూతపడనుంది. దానికి బదులుగా వృద్ధి చెందుతున్న అనేక ప్రత్యామ్నాయాల్లో ఒకటే ఈ జియోథర్మల్. భూమిలోపలున్న వేడి ప్రదేశాల నుంచి కరెంటును ఉత్పత్తి చేయడమే జియో థర్మల్. వీటినే హాట్ స్పాట్స్ అంటున్నారు. మన దేశంలో జమ్ముకాశ్మీర్, రాష్ట్రంలో రెంటచింతల అనే ప్రాంతాల్లో హాట్‌స్పాట్స్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇంకా అనేకప్రాంతాల్లో సర్వేలు జరుగుతున్నాయి. దీన్నెలా ఉత్పత్తి చేస్తారంటే... ముందు హాట్‌స్పాట్స్‌ను గుర్తిస్తారు. నేల స్వభావాన్నిబట్టి ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోతు వరకు పక్కపక్కనే రెండు బోర్లను వేస్తారు. అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భంలో ఈ రెండింటినీ కలుపుతారు. లోపల 250 డిగ్రీల నుంచి 300 డిగ్రీల టెంపరేచర్ ఉన్న చోట ఒక పైపు నుంచి నీళ్లను పంపిస్తారు. ఆ వేడికి నీళ్ల నుంచి ఆవిరి పుడుతుంది. ఆవిరితో పక్కనే ఉన్న టర్బైన్స్ తిరుగుతాయి. టర్బైన్ తిరుగుతుంటే కరెంట్ పుడుతుంది. ఇది బొగ్గును మండించి తీసే విద్యుత్‌చ్ఛక్తి కన్నా కొన్ని రెట్లు సురక్షితమైనది. ఎలాంటి కాలుష్యం ఉండదు. అందుకే ప్రస్తుతం ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధి కొన్ని వేల ఉద్యోగాలను అందిస్తోంది.

అవకాశాలు కల్పించడంలో బయోగ్యాస్ పాత్రా తక్కువేమీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో దీనికున్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. కొందరు రైతులైతే తమ పైర్లకు బయోగ్యాస్ కరెంటుతో నడిచే మోటార్లతోనే నీళ్లు పడుతున్నారు. బయోగ్యాస్ కూడా ఆ రంగంలో కొత్త అన్వేషణలకు మార్గం చూపెడుతోంది. ఇవేకాదు వ్యర్థాల నుంచి కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సాలిడ్ వేస్ట్‌ను మండించి కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రంగంలో కూడా వేల సంఖ్యలో ఉపాధి మార్గాలు పుట్టుకొస్తున్నాయి.

నిర్మాణ రంగంలో...

పర్యావరణాన్ని కాపాడే దిశగా నిర్మాణ రంగంలో వచ్చిన మార్పులూ ఉపాధి మార్గాలను చూపెడుతున్నాయి. ఎకోఫ్రెండ్లీ కట్టడాలు వచ్చేశాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు ఎదిగిన ప్రత్యామ్నాయ రంగం, సేంద్రీయ వ్యవసాయం... ఒక్కటేమిటి, పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా రూపుదిద్దుకోనున్న ప్రతి రంగం కొత్త అవకాశాలను లక్షల్లో పుట్టిస్తోంది. ప్రతి పౌరుడు పొల్యూట్ కాని లైఫ్ స్టయిల్‌ని కోరుకుంటున్నాడు కాబట్టి 'గ్రీన్' అనేది అన్ని చర్యల్లో అంతర్భాగమైంది. ఈ చైతన్యం ఉన్న వినియోగదారులు మార్కెట్‌ను నిర్దేశించే స్థాయిలో ఉన్నారు కాబట్టి గ్రీన్ మార్కెట్‌నే డిమాండు చేస్తున్నారు. అందుకే కృత్రిమ రసాయనాలు లేని, కలుషితం కాని వస్తువులను వాళ్లు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ బిజినెస్ అంతా గ్రీన్ బిజినెస్‌గా మారుతోంది. కార్పొరేట్ కంపెనీల మీదా ఈ దిశగా విపరీతమైన ఒత్తిడి పడుతోంది. దీంతో అవీ తమ పంథాను పర్యావరణానికి అనుకూలంగా మార్చుకోక తప్పడం లేదు. సామాజిక బాధ్యతల దృష్ట్యా కూడా తమ కంపెనీలను ఎకోఫ్రెండ్లీగా మార్చుకుంటున్నాయి. కనుక కార్పొరేట్ ఉద్యోగాలూ ఈ రంగాల్లోనే ఉండబోతున్నాయి. అంటే వ్యాపారం కూడా క్లీన్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కిందకు మారుతోందన్నమాట.

రిస్క్, డిజాస్టర్, క్రైసిస్...

సంపదను దాచుకున్న సముద్రంలా అవకాశాలను పొదువుకున్న పర్యావరణం మీద జరిగిన అధ్యయనాలు కొత్త కొత్త రంగాలను వెలుగులోకి తెస్తే... వాటిని అభివృద్ధి చేయడంలో మరిన్ని అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఉదాహారణకు ఎకో ఫ్రెండ్లీగా ఉండే ఓ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టామనుకుందాం... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు ఏవైనా ప్రమాదాలు సంభవించవచ్చు. వాటిని నిభాయించి, సరిదిద్దగల సామర్థ్యం కూడా వాటి యాజమాన్యాలకు ఉండాలి. ఆ నిర్వహణే రిస్క్, డిజాస్టర్, క్రైసిస్ మేనేజ్‌మెంట్లు. బృహత్తర అవకాశాలనిస్తున్నాయివి. వీటితోపాటు రీయూజ్, రీసైకిల్డ్ అండ్ వేస్ట్ మేనేజ్‌మెంట్లు కూడా ప్రధాన ఉపాధి రంగాల్లా మారాయి ఇప్పుడు.

అక్షయపాత్రలా...

పర్యావరణాన్ని కాపాడుకుంటూ సుస్థిరాభివృద్ధికి నాంది పలకాలి. ఈ అవగాహన, పరిశోధనల పుణ్యమాని ఇదే భవిష్యత్తుగా, గ్రీన్ (పర్యావరణం, ప్రకృతి) అనేది అత్యంత శక్తిమంతమైన రంగంగా మారింది. ఇంతకుముందు వాడిన కృత్రిమాలన్నిటికీ బదులుగా సహజసిద్ధంగా లభించేవేమున్నాయనే శోధన మొదలవడంతో పర్యావరణానికి చెందిన ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించడం, పరిశోధించడంతో ఇదో పెద్ద శాస్త్రంగానే కాదు లక్షల ఉద్యోగాలు పుట్టిస్తున్న అక్షయపాత్రగా మారింది. ఈ డిమాండుననుసరించి పర్యావరణం అనేది చదువులో కూడా భాగమైంది. పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయిదాకా దీన్నో సబ్జెక్టుగా చేరింది. ఆర్ట్, సైన్స్, లా, పాలిటిక్స్, ఎకనమిక్స్, మేనేజ్‌మెంట్ చదువుల్లో, ఇంజనీరింగ్‌లలో కూడా పర్యావరణ శాస్త్రం పాఠ్యాంశంగా మొదలైంది. ఇందులో స్పెషలైజేషన్ కోర్సులూ ప్రారంభమయ్యాయి. పర్యావరణ బయోటెక్నాలజీలో కూడా చాలా అవకాశాలున్నాయి.

స్మార్ట్ అండ్ గ్రీన్ లివింగ్

పర్యావరణశాస్త్ర పురోగతి కొత్త తలపులను తెరిచి లోకాన్ని పచ్చగా మారుస్తోంది. ఇది ఒక ఎత్తయితే... ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉన్న వనరులను పొదుపుగా వాడుకుంటూ తెలివిగా జీవించడం ఇంకో ఎత్తు. ఈ రెంటిని కలిపి స్మార్ట్ అండ్ గ్రీన్ లివింగ్ అంటున్నారు. స్మార్ట్‌గా ఆలోచించి కనిపెట్టే స్మార్ట్ థింగ్స్‌లో కూడా బ్రహ్మాండమైన ఉపాధి ఉందన్నట్టే కదా. ఎలాగంటే... చైనా, అమెరికా లాంటి దేశాల్లో కొత్తరకమైన కరెంటు బల్బులు వెలుగుతున్నాయి. ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్లగానే మనం విడిచి వెళ్లిన గదిలో లైట్ ఆరిపోయి అడుగుపెట్టిన గదిలో వెలుగుతుంది. అంటే విద్యుత్ వృధా అయ్యే అవకాశం లేకుండా అన్నమాట. అలాగే నీటి వృధా అరికట్టడానికీ ఇలాంటి కిటుకులు కనిపెట్టారు. వాష్ బేసిన్, సింకుల్లాంటి చోట్ల కుళాయి కింద చేయి పెడితేనే నీళ్లొస్తాయి. చేయి తీయగానే నీళ్లు రావడం ఆగిపోతాయి. ఇలాంటివి కనుక్కొనే టెక్నాలజీ ఒకటి ఉందీ అంటే అందులో బోలెడు అవకాశాలు ఉన్నట్లే కదా.

మహాత్మా గాంధీ చెప్పినట్టు ప్రకృతికి ప్రజలందరి అవసరాలను తీర్చే స్తోమత ఉంది కాని కొందరి అత్యాశలను తీర్చే శక్తి లేదు. అందుకే ప్రకృతి సంపదను కాపాడుకోవాలి. దానికే ఎసరు పెట్టే కార్యక్రమాలను మానుకోవాలి. అప్పుడే అది మనల్ని కాపాడుతుంది. మొత్తం భూమండలాన్నే ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మనదే. పర్యావరణం అందించే అవకాశాల గురించి అవగాహన, విజ్ఞానాన్ని పెంచుకుని వాటిని అందుకుంటే ప్రపంచంలోనే మనవాళ్లు గ్రీన్ లీడర్స్‌గా ఎదిగే బంగారం లాంటి చాన్స్ ఇది.

ఆ నవలే...

1965లో... పర్యావరణ కాలుష్యం వల్ల జరగబోయే నష్టాల నేపథ్యంగా రేచెల్ కార్సన్ రాసిన 'ది సైలెంట్ స్ప్రింగ్ ' అనే నవల ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మేధావుల నుంచి ఐరాస దాకా విస్తృతమైన చర్చకు తెరలేపింది. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ కోసం 1972లో స్టాక్‌హోంలో గ్లోబల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇలాంటి చర్చలు, సమావేశాలు, అధ్యయనాలు, పరిశోధనలు అనేకం1985 వరకు సాగాయి. అందుకే ఈ కాలాన్ని పీరియడ్ ఆఫ్ ఇంటెన్సివ్ రీసెర్చ్ అంటారు. ఈ రకంగా 'ది సైలెంట్ స్ప్రింగ్' ఇంటలెక్చువల్ రివల్యూషన్‌కి కారణమైంది. అప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ఏ దేశానికి ఆ దేశమే నడుం కట్టింది. కొన్ని వందల చట్టాలను తయారు చేసుకున్నాయి. మన దేశంలోనూ సుమారు రెండు వందల చట్టాలున్నాయి. వాటి ప్రకారం ప్రకృతిని తమ చర్యల ద్వారా ఎవరూ కలుషితం చేయడానికి వీలులేదు. ఒకవేళ చేస్తే ఆ కాలుష్యాన్ని నివారించే పనిని కూడా వాళ్లే చేయాలి.

మా సంస్థ ఏం చేస్తుందంటే...

కె. పురుషోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలోని 'సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెనబుల్ డెవలప్‌మెంట్' సంస్థ గ్రీన్ డెవలప్‌మెంట్ (హరితాభివృద్ధి)కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించే అకడమిక్ రీసెర్చ్ సెంటర్‌గా పనిచేస్తోంది. ఈ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగకారిగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశగా జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయడం, దీని ఆధారంగా స్థానిక సమస్యలకు పరిష్కారాలు అందించడం, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం వంటి పనులనూ చేపడుతోంది.

ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీగా వచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేయడమేకాక దాని ఆవశ్యకతను వివరిస్తుంది. అంతేకాదు వాతావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించిన విషయాలపై ప్రజలను చైతన్య పరుస్తూ ఆ మార్పులను నివారించే మార్గాలను వెదకడం... అవి ఆలస్యమైనప్పుడు ఆ మార్పులకెలా సర్దుకుపోవాలో శిక్షణనిస్తుంది ఈ సంస్థ. ఇవీ కాక ఈ అంశం మీద పనిచేస్తున్న అన్నిరకాల సంస్థలతో అనుసంధానమేర్పర్చుకుని ఓ బలమైన శక్తిగా మారేందుకు కృషిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో మన దేశం నాయకత్వం వహించేలా... స్థూలంగా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ప్రపంచంలోనే గుర్తింపు పొందిన సంస్థలా ఎదగడం దీని ప్రధాన లక్ష్యం.
* సరస్వతి రమ

Thursday, October 21, 2010

Beach In Every House

                                                                                                                                                                                 cid:_2_0581ED400581EAEC0047F30A65257632 
cid:_2_0581F1A40581EAEC0047F30A65257632 
cid:_2_0581F1A40581EAEC0047F30A65257632 
cid:_2_0581F3EC0581EAEC0047F30A65257632 
cid:_2_0581F6340581EAEC0047F30A65257632 
cid:_2_0581F87C0581EAEC0047F30A65257632 
cid:_2_0581FAC40581EAEC0047F30A65257632 
cid:_2_0581FD0C0581EAEC0047F30A65257632 
cid:_2_0581FF540581EAEC0047F30A65257632 
 
 
 
 
 
 
Now see this.
This is taken from world's tallest building 'Burj Dubai' @ 2,620 ft / 801m!!!
 
What do you think?
 
cid:_2_058203440581EAEC0047F30A65257632 
 
 
Really amazing
 
Look at the edge (uppermost right corner) of the picture, you can almost see the turn of the earth
 
cid:_2_058206680581EAEC0047F30A65257632 
The persons who are working on the upper most Girders can see the 'ROTATION OF EARTH'
So terrifying..

Sunday, October 17, 2010

Get your home ready for fall with these decorating ideas:

Get your home ready for fall with these decorating ideas:







Wednesday, October 13, 2010

ముకేష్ అంబానీ కొత్త ఇల్లు.. అంబానీ ఆకాశ హర్మ్యం అదిగో..

ambnai-home
అపర కుబేరుడు, పారిశ్రామిక సంపన్నుడు, రిలయన్స్‌ పరిశ్రమల అధిపతి వర్ధమాన భారతంలో అడుగడుగునా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్న ముకేష్‌ అంబానీ నిర్మిస్తున్న ఆకాశహర్మ్యం ‘‘అంటీలియా’’ తుది మెరుగులు దిద్దుకుని ప్రారంభానికి ముస్తాబవుతోంది. 173 మీటర్ల ఎత్తుతో, 27 అంతస్తులతో, 2,00,000 చదరపు అడుగుల వైశాల్యంలో సర్వాంగ సుందరంగా నిర్మించిన అంటీలియా ప్రపంచంలో అతి పెద్ద నివాస గృహంగా రికార్డులకు ఎక్కింది. ఈ ఇంటిని చూసుకోవడానికి, నిర్వహించడానికి 600 మంది సిబ్బంది అవసరమవుతారు. అట్లాంటిక్‌ మహా సముద్రంలో మునిగిపోయిన పురాణ ప్రసిద్ధ దీవి అంటీలియా పేరునే తన ఇంటికి పెట్టుకున్నారు ముఖేష్‌.

చికాగోకు చెందిన అర్కిటెక్టులు పెర్కిన్స్‌ అండ్‌ విల్‌, మెల్‌బోర్న్‌కు చెందిన నిర్మాణ కంపెనీ లైటన్‌ హోల్డింగ్స్‌ ఈ భవన నిర్మాణాన్ని తొలుత చేపట్టి కొంతవరకు పూర్తి చేశాయి. తరువాత మరొక కంపెనీ మొత్తం భవనాన్ని నిర్మించింది. త్వరలో శుభ ముహూర్తం చూసుకుని అంబానీ దంపతులు, తల్లి కోకిలాబెన్‌, వారి ముగ్గురు పిల్లలు ఆకాష్‌, అనంత్‌, ఈషాలతో అంటీలియాలో గృహ ప్రవేశం చేయనున్నారు. దక్షిణ ముంబాయి టెక్ట్స్‌ఆల్టామౌంట్‌ రోడ్డులోని ప్రసిద్ధ కుంబల్లా హిల్స్‌పై 4,532 చ.మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఆంటీలియా సర్వ సుఖాలకు, అత్యాధునిక వసతులకు, అంతర్జాతీయ ప్రమాణాలను తలదన్నే రీతిలో నిర్మితమైంది. అన్నట్లు ఇక్కడ చదరపు మీటర్‌ భూమి ఖరీదెంతో తెలుసా 10,000 డాలర్లు మాత్రమే. ఏంటి నోరు వెళ్ళబెట్టారా! అవును ఇది పచ్చి నిజం.

అంటీలియాలోని ఆరు అంతస్తులలో ఒకేసారి 160 కార్లను పార్క్‌ చేయవచ్చు. ఒక ఫ్లోర్‌ను పూర్తిగా వాహనాల నిర్వహణకు కేటాయించారు. లాబీలో 9 ఎలివేటర్లు ఉన్నాయి. రిక్టర్‌ స్కేల్‌పై ఎనిమిది పాయింట్ల స్థాయిలో భూ ప్రకంపనలు నమోదైనా చెక్కు చెదరని నాణ్యతలో దీనిని నిర్మించారు. భవనం టెర్రస్‌పై మూడు హెలిప్యాడ్లతో సహా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కేంద్రం కూడా నిర్మించారు. ఎనిమిదవ అంతస్తులో 50 సీట్లతో కూడిన థియేటర్‌, హెల్త్‌ స్పా నిర్మించారు. బహు విధాలుగా సోయగాలు పోతూ నిర్మించిన పలు ఈత కొలనులు అంటీలియాకు ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పవచ్చు. మూడు అంతస్తులలో వేలాది పుష్ప జాతులు, క్రోటన్లతో కూడిన కృత్రిమ వనాలను ఏర్పాటు చేశారు. ఇక స్నోరూంలు, బాల్‌ రూముల సౌందర్య నగిషీలను ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు.

ముకేష్‌ అంబానీ ఇక్కడ భవంతిని నిర్మిస్తున్నారన్న వార్తలు రాగానే చుట్టుపక్కల ప్రాంతాలలో భూమి ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. దాదాపు రూ.9,000 కోట్ల ఖర్చుతో అంటీలియా గర్వంగా పైకి లేచింది. 2007లో ఇక్కడ ముకేష్‌ భూమి కొన్నప్పుడు వివాదం చెలరేగింది. ఈ స్థలాన్ని అమ్మిన వక్ఫ్‌బోర్డుకు యాజమాన్య హక్కులు లేవని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. చివరకు ముకేష్‌ రూ.16 లక్షలు చెల్లించి నిరభ్యంతర పత్రాన్ని పొందగలిగారు. ముంబాయి భవంతులపై హెలిప్యాడ్ల నిర్మాణానికి నావికా దళం అభ్యంతరం పెట్టింది.

శబ్దకాలుష్యం పెరుగుతుందని పర్యావరణ శాఖ కూడా కొర్రీలు వేసింది. ఈ ఆకాశహర్మ్యం పూర్తి కావడానికి మూడు సంవత్సరాల కాలం పట్టింది. అంబానీ టవర్‌ ఎంపోరియస్‌ అనే ముద్దుపేరు కూడా ఈ బహుళ అంతస్తుల భవనానికి ఉంది. దీని నంబర్‌ 301023. వెరె్సైలెస్‌ ప్యాలెస్‌ కంటే గొప్ప ఫ్లోరింగ్‌ను అలంకరించారు. అతిధుల కోసం ప్రత్యేకంగా రెండు అంతస్తులను కేటాయించారు. ఈ భవంతి ఏ ఒక్క గది ఇంకోదానిలా కనిపించకపోవడం విశేషం.కాగా ఈ భవనం ఎక్కిచూస్తే ముంబాయి నగర సౌందర్యం కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.

ఇటీవలే ఎంపిక చేసిన అతి కొద్ది మంది సన్నిహితులను, వివిఐపిలను ముకేష్‌ తన ఇంటికి ఆహ్వానించి చూపించారు. ముకేష్‌ పొరుగునే కుమార్‌ మంగళం బిర్లా ఉంటున్నారు. ఆయన ఆంటీలియా గురించి చెబుతూ తాను ప్రపంచంలో అనేక గొప్ప భవనాలను, నివాస గృహాలను చూశానని, చివరకు లండన్‌లోని లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ గృహాన్ని కూడా సందర్శించానని, వీటన్నింటింలో ఈ భవంతి గొప్పగా ఉందని బిర్లా కితాబునిచ్చారు. ఇక బాల్‌ రూమును చూస్తే నిర్ఘాంతపోవలసిందేనని వ్యాఖ్యానించారు. ముకేష్‌ తమ్ముడు అనిల్‌ అంబానీ దక్షిణ ముంబాయిలోని విలాసవంతమైన ప్రాంతం కుఫీ పెరేడ్‌లో నివసిస్తున్నారు.
ఆకాశహర్మ్యం పేరు : ఆంటీలియా, 
ముద్దుపేరు  : అంబానీ టవర్‌ ఎంపోరియస్‌
చిరునామా : టెక్ట్స్‌ఆల్టామౌంట్‌ రోడ్డు, నంబర్‌-301023 
  కుంబల్లా హిల్స్‌, దక్షిణ ముంబాయి-400 026
అంతస్తులు : 27
ఎత్తు : 173 మీటర్లు
నిర్మాణ వైశాల్యం : 4 లక్షల చదరపు అడుగులు
స్థల విస్తీర్ణం : 48,780 చదరపు అడుగులు
పార్కింగ్‌ లాట్‌ : 600 కార్లకు ఆరు అంతస్తులు
ఎలివేటర్లు : 9
నిర్వహాణ సిబ్బంది : 600 మంది
కృత్రిమ వనాలు : మూడు అంతస్తులు
హెలిప్యాడ్లు : మూడు ప్లస్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెంటర్‌
నిర్మాణ వ్యయం : రూ.9,000 కోట్లు
నిర్మాణ కాలం : మూడు సంవత్సరాలు
ఆర్కిటెక్టులు : పెర్కిన్స్‌ అండ్‌ విల్‌ (చికాగో), లెహ్‌టన్‌ హోల్డింగ్స్‌ (మెల్‌బోర్న్‌) 
                మరికొన్ని  

ముకేష్ గృహప్రవేశం!

దేశంలోనే అతి ధనవంతుడైన ముకేష్ అంబానీ కొత్త ఇల్లు పూర్తయింది. ఈ ఇంటి గృహా ప్రవేశం ఈ నెల 28వ తేదీన జరిగే అవకాశం ఉంది.

ఆ రోజు కొందరు ప్రముఖులను ముకేష్ తన కొత్త ఇంటికి ఆహ్వానించారు. 570 అడుగుల ఎత్తు..27 ఫ్లోర్లతో నిర్మించిన ఈ భవంతికి 'యాంటిలా' అని పేరు పెట్టారు (యాంటిలా అట్లాంటిక్ సముద్రంలో ఒక ద్వీపం).
మన దేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో- అంతర్జాతీయ సంస్థలు హిర్ష్ బెడ్‌నర్ అసోసియేట్స్, పెర్కిన్స్ విల్స్- ఈ భవంతిని డిజైన్ చేశాయి.

ఈ భవంతిలో మొదటి ఆరు అంతస్థులు కేవలం పార్కింగ్ కోసం వదిలేసారు. దీనిలో మొత్తం 160 కార్లను పార్క్ చేసుకోవచ్చు. ఏడో అంతస్థులో ఉన్న లాబీల నుంచి అసలు ఇంటిలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎనిమిదో అంతస్థు నుంచి 27వ అంతస్థు దాకా బాల్‌రూమ్‌లు, పౌడర్ రూమ్‌లు, లాంజ్‌లు, ఒక మిని థియేటర్ ఉంటాయి. 27వ అంతస్థును మాత్రం ముకేష్, ఆయన భార్య నీతా అంబానీ, పిల్లలు ఆకాష్, అనంత్, ఇషాల కోసం ప్రత్యేకంగా నిర్మించారు.

ఆ పైన హెలిపాడ్‌లు నిర్మించారు. దీని మీద మూడు హెలికాప్టర్లు దిగటానికి వీలు ఉంటుంది. ఈ భవంతిలో ఒక గదిని పోలి మరొక గది ఉండదు. "నేను లక్ష్మీ మిట్టల్ ఇంటితో సహా అనేక భవంతులు చూశాను. అయితే ముకేష్ ఇంటికి ఇవేమి సాటిరావు. ఈ ఇంటిలో ఒక పికాసో పెయింటింగ్ కూడా ఉన్నట్లు జ్ఞాపకం..'' అని ముకేష్‌కు సన్నిహితుడైన టెలికం కంపెనీ సీఈఓ ఒకరు వెల్లడించారు.

ఈ భవంతిని నిర్మించటానికి ఏడేళ్లు పట్టింది. ఎంత ఖర్చు అయిందనే విషయం ఇంకా కచ్చితంగా తెలియదు. భవంతి నిర్మాణాన్ని ముకేష్ సతీమణి నీతా దగ్గరుండి పర్యవేక్షించారు. ఇప్పటి దాకా ముకేష్- దక్షిణ ముంబాయిలో- సీవిండ్ అనే బంగ్లాలో నివాసం ఉంటున్నారు.

కష్టే సాహస ఫలి

ఇద్దరు సోదరులు.. ఒక కల.. ఏమిటా కల ? ఎంతో అసాధ్యమైన కల !

మనిషికి రెక్కలు పొదిగి ఆకాశంలో ఎగిరేలా చేయాలని. పక్షులు ఎగురగలుగుతున్నప్పుడు మనిషి మాత్రం ఎందుకు ఎగరలేడు ?

పోనీ మనిషి కాకపోతే. ఏదైనా యంత్రం ఎగరొచ్చు కదా !! దాంతో పాటు మనిషి కూడా ఎగరొచ్చు కదా !

ఇది ఆ సోదరుల కల. రైట్ సోదరుల కల.

మనకు రెక్కలనిచ్చి గగన యాత్ర అనుభవాన్ని అందించిన మహాశయులు రైట్ సోదరులు.

బెంగళూర్‌లో బ్రేక్‌ఫాస్ట్, లండన్‌లో లంచ్, డిన్నర్ ఢిల్లీలో నేడు మనం చేయగలుగుతున్నామంటే అది రైట్ సోదరుల కలలు, ప్రజ్ఞాపాటవాల వల్లనే మనకు అందుబాటులోకి వచ్చాయి. కలలు, గమ్యాలు, ఆ కలల సాకారానికి వినియోగపడే పద్ధతులు- అన్నీ ఏకమైతేనే వాటికో రూపం వచ్చి అవి నిజాలయ్యేవి. లేకుంటే పగటి కలలుగా నిల్చిపోతాయి.

పగటి కలల గురించి తెల్సిందే కదా మనకు. పగటి కలలు అనగానే చప్పున నా మదిలో మెదుల్తుంది ముల్లా నసీరుద్దీన్ గారి పగటి కలలు. ముల్లా నసీరుద్దీన్ హాస్యానికి, కొంటె పనులకు మారుపేరు. మన తెనాలి రామకృష్ణుడిలాగా. ముల్లా నసీరుద్దీన్ గురించి పలు కథలు, అనేక భాషల్లో ప్రచారంలో ఉన్నాయి. ఒకరోజున ముల్లా నసీరుద్దీన్ తన గాడిద మీద ప్రయాణం చేస్తూ తన పగటి కలల ప్రపంచంలోనికి అడుగుపెట్టాడు... పంచరంగుల కలలు.

తను వ్యాపారవేత్తనవుతానని, నాలుగు దుకాణాలు కొని, వాటిల్లో చెప్పుల షాపు, కుండల షాపు, టైలర్ షాపు, జంతువుల స్వారీకి ఉపయోగించబడే సీట్లు కుట్టే షాపును పెడదామనుకున్నాడు. ప్రతి షాపులో ఇద్దరు పనివాళ్లను పెట్టి వ్యాపారాభివృద్ధి చేసి హాయిగా రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరు భార్యలతో, నలుగురు అబ్బాయిలతో జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చుకుని ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు అందమైన అమ్మాయిల్ని తెచ్చి పెళ్లిళ్లు చేయాలనుకొన్నాడు.

కలలంటూ మొదలయ్యాక అవి అనంతంగా అల్లుకుపోతూనే ఉంటాయి కదా. అదే జరిగింది. మన ముల్లా నసీరుద్దీన్‌కు కూడా. కలలు అల్లుకుంటూ పోతున్నాడు. మనవలు, మనవరాళ్లు. తనను పట్టించుకోకుండా తన కలల లోకంలో విహరిస్తున్న ముల్లాను చూచింది ఆయన స్వారీ చేస్తున్న గాడిద. 'చిన్న గమ్మత్తు చేస్తేనో' అనుకుంది.

ఎదురుగా చిన్న గుంట, దాన్ని దాటటానికి ఒక చిన్న వంతెన కనబడ్డాయి.. వంతెనను వదిలి ఒక్కసారి ఆ గుంట మీద నుంచి అమాంతం దూకితే ఎంత గమ్మత్తుగా ఉంటుందో కదా అనుకుని వెంటనే దూకేసింది. గాడిద గుర్రం కాదు కదా. పగటి కలలు నిజాలు కావు కదా.

అంతే గుంటలో పడిపోయింది గాడిద, దాంతో పాటు అనంతంగా పగటి కలలు కంటున్న మన ముల్లా నసీరుద్దీన్ గారు.

నడ్డి విరిగిందని వేరే చెప్పాలా !? పగటి కలల ప్రయోజనం ఇంతేనని మనకు ముల్లా చెబుతున్న నీతి కథ.

మన రైట్ బ్రదర్స్ కలలు పగటి కలలు కావు. చిన్నతనం నుంచి వారితో పెరిగిన ఒక గాఢమైన కోరిక. నడిచే మనిషిని విమానంలో కూర్చొపెట్టి ఎగురవేయాలనే తపన.

ఆర్‌విల్ రైట్ , విల్బర్ రైట్ .
విల్బర్ 1867లో ఆర్‌విల్ 1871లో పుట్టారు. వీరు కాక మరో ఐదుగురు సంతానం వారి తల్లిదండ్రులకి. అతి సామాన్యమైన కుటుంబం. తండ్రి మిల్టన్ రైట్ చర్చిలో బిషప్‌గా పనిచేస్తుండేవాడు. అందరిలోకి ఆర్‌విల్ చాలా అల్లరివాడు. చేస్తున్న అల్లరి పనులకు ప్రతిఫలంగా ఒకసారి స్కూల్లోంచి తీసేయబడ్డాడు కూడా.

అయితే అన్నదమ్ములిద్దరికి ఎగిరే పక్షులన్నా, అవి ఆకాశంలో ఎగురుతూ చేసే అద్భుతాలన్నా, విన్యాసాలన్నా ఎంతో మక్కువ. గంటల తరబడి రకరకాల పక్షుల ఆకాశయానాన్ని అలా కన్నార్పకుండా చూస్తూ ఉండేవారు. ఏ ప్రక్రియ వల్ల పక్షులు నేల మీద నుంచి ఆకాశంలోకి ఎగురగలుగుతున్నాయి, ఎలా తమ రెక్కల ఉపయోగం ద్వారా దిశలు మార్చగలుగుతున్నాయో సునిశితంగా పరీక్షించేవారు. అవి ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాయో పరీక్షించేవారు. ఆకాశయానంలో ఎగురుతున్న పక్షులకు గాని యంత్రాలకు గాని వాటి బ్యాలెన్స్, క ంట్రోల్ ఎంతో ముఖ్యమని గమనించారు.

1878లో విల్బర్, ఆర్‌విల్ సోదరులకు వారి తండ్రి ఒక బొమ్మ హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది ప్రతి చోట సర్వసాధారణంగా లభ్యమయ్యే బొమ్మ హెలికాప్టర్. రబ్బరు బెండు, పేపర్, వెదురు ముక్కలతో చేసిన హెలికాప్టర్. ఒక అడుగు పొడుగు మాత్రమే.

విహంగ యానం మీద ఎంతో మక్కువ పెంచుకున్న రైట్ సోదరులకు తండ్రి ఇచ్చిన ఈ సామాన్య బహుమతి వాళ్ల సృజనాత్మకను మేలుకొలిపింది. వారి కలలకు ఒక రూపం ఒక గమ్యం ఏర్పడినాయి. సైకిల్ షాపు తెరిచారు. ఆ రోజుల్లో అమెరికాలో సైకిళ్లంటే విపరీతమైన మోజు ఉండేది. సైకిళ్లను అమ్మటమే కాదు రిపేర్లు చేసే కూడా చేసేవాళ్లు. 1896లో తామే సైకిళ్లను తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టారు. ఇదంతా డబ్బు సంపాదించాలనే తపనతో కాదు, తమ కల ఏరోప్లేన్‌ను కనుగొనే కలను సాకారం చేసుకోవటానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోవటానికై. ఇంతేకాదు, సైకిల్‌కు ఎగిరే విమానానికి ఎన్ని పోలికలున్నాయో గ్రహించారు రైట్ సోదరులు. సైకిల్ నడపాలంటే కంట్రోల్ ఎంతో అవసరం కదా.

అలాగే విమానానికి ఎంతో అవసరం ఈ కంట్రోల్. పైగా సైకిళ్ల ఉత్పాదనలో, వాటి మరమ్మత్తులలో, యంత్రాల నిర్మాణం వాటికి అవసరమైన నేర్పును నేర్చుకున్నారు. తర్వాత కాలంలో వారు తమ గ్లైడర్సును విమానాలను తయారు చేస్తున్నప్పుడు ఈ సైకిళ్ల తయారీ అనుభవం ఎంతో మేలు చేసింది వారికి. 14 మే 1908న రైట్ బ్రదర్స్ ఎంతో కాలంగా శ్రమించిన విమానం ప్రయాణికులతో ఎగరటానికి సిద్దమైంది.

అయితే 17 సెప్టెంబర్‌న ఓ విమాన ప్రమాదం జరిగింది. ఆర్‌విల్ రైట్ ఆ ప్లేనుకి పైలట్. ఆ విమానంలో ఒక ప్రయాణికుడు సిగ్నల్ కార్ప్స్ లెఫ్టినెంట్ థామస్ సెల్ఫ్‌రిడ్జ్ ఉన్నారు. విమానం కూలిపోయింది. ఆర్‌విల్ బతికి బట్టకట్టాడు. థామస్ సెల్ఫ్‌రిట్జ్ మరణించాడు.

ఈ దుర్ఘటన వారిలోని పట్టుదలను ధృడపరిచింది . మరెంతో శ్రమించారు.
1909లో అమెరికా ప్రభుత్వం తమ మొదటి విమానాన్ని కొనుగోలు చేసింది. అది రైట్ బ్రదర్స్ తయారు చేసిన విమానం. ఆ రోజుల్లో ఆ విమానం ధర 25 వేల డాలర్లు.

ఇక అక్కణ్ణుంచి అన్నీ విజయాలే.
1911లో ఖండాంతర ప్రయాణం చేయగలిగిన విమాన సృష్టి. అమెరికాని దాటటానికి ఆ విమానానికి 84 రోజులు పట్టింది. 70 సార్లు ఆగింది.

1912లో మెషిన్‌గన్‌ను అమర్చిన ప్లేన్‌ను ఆవిష్కారం.
1914లో ఆర్మీలో ఒక చిన్న ఎయిర్‌ఫోర్సు విభాగం ఏర్పాటు జరిగింది.
ఒక్కసారి ఆలోచించండి...
ఎక్కడి ఆటబొమ్మ హెలికాప్టర్ !!
ఎక్కడి ఎయిర్‌ఫోర్స్ విభాగం !!
కేవలం 30 ఏళ్లలో మనిషి ఎగ రటం మాత్రమే నేర్చుకోలేదు. తాను ఎగిరే విమానాన్ని ఒక ఆయుధంగా మార్చుకోగలిగాడు. జయహో రైట్ సోదరులారా ! ప్రపంచానికి ఒక కొత్త వేగాన్ని ఒకే జీవిత కాలంలో ఎన్నో జీవితాల అనుభవాన్ని పొందుపరుచుకునే శక్తిని మానవ జాతికి ఇచ్చారు రైట్ సోదరులు.

కలలు కనటమే కాదు... ఆ కలల సాకారానికై స్ఫూర్తి, శ్రమే కాకుండా డబ్బు కావాలి. దీన్ని రైట్ సోదరులకి వారి సైకిళ్ల వ్యాపారం చేకూర్చింది. కలలు కనే ప్రతి వారికి వాటి సాకారానికై కొన్ని సూత్రాలు పద్ధతులు ఎంతో అవసరం. గత వారాల్లో నిర్మా కర్సన్ భాయ్, సర్ సివి రామన్, ధీరూభాయ్, ముద్రా గురించి ముచ్చటించుకొన్నాం. వీరి విజయాలు, ఇతరుల విజయాలను పరిశీలించగా, వీరందరూ క్రింద పొందుపర్చిన అన్ని పద్ధతులను కాని లేక వాటిలో కొన్నింటినైనా గాని అమలు పరచి వారివారి కలలను సాధించగలిగారు.

పెద్దపెద్ద కలలు కనటం
ఎంచుకున్న రంగాల్లో నిష్ణాతులుగా మారటం
పాజిటివ్ థృక్పధం అలవరుచుకోవటం
అసాధ్యాలంటూ ఏదీ ఉండవనే నమ్మకం పెంచుకోవటం
పేరు ప్రతిష్ఠల ఫలితమే డబ్బు అనే ధృడ విశ్వాసం
కలలను, గమ్యాలను విడనాడక పోవటం
సహచరులపై ధృడమైన నమ్మకం, విశ్వాసాలను పెంచుకోవటం
సవాళ్లను ఆహ్వానించటం
సర్వేజనా సుఖినోభవంతుపై నమ్మకం
ఇది ఒకే జీవితం, ఒకే అవకాశం అనే థృక్పధం
-ఎజి కృష్ణమూర్తి

Sunday, October 3, 2010

సంద్రం చూడని సముద్రయానం

సముద్రంలోపల సబ్‌మెరైన్లలో పనిచేసేవాళ్లకు రంగురంగుల చేపలు, రకరకాల జీవులు, తిమింగలాలు కనిపిస్తాయనుకుంటాం. నీళ్లలో ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేయగల ఉద్యోగమనుకుంటాం.

కానీ అలాంటి అనుభూతులేవీ ఉండవంటున్నారు సబ్‌మెరైన్‌లో 20 ఏళ్లపాటు పనిచేసిన ఈ కెప్టెన్. కూర్చునే కుర్చీ దగ్గర నుంచి తిండితినే టేబుల్ వరకు అన్నీ ఇరుకిరుకేనట. సముద్రం లోపల వెళుతూ, సముద్రాన్ని తిలకించలేని ఆ జీవితం గురించి కెప్టెన్ నగిర్‌రెడ్డి పంచుకున్న అనుభవాలు...


అది 1982 అనుకుంటా. సముద్రంలో 50 మీటర్ల లోతులో మా సబ్‌మెరైన్ వెళుతోంది. నాతోపాటు వందమంది నేవీ సిబ్బంది అందులో ఉన్నారు. మేమంతా రష్యా వెళుతున్నాం. అప్పుడు సముద్రంలో భయంకరమైన చలిగాలులు వీస్తున్నాయి. హాంకాంగ్ సమీపానికి చేరుకున్నాం. సముద్రం మంచుతో గడ్డకట్టుకుపోయి ఉంది. మేమంతా సబ్‌మెరైన్‌లోనే చిక్కుకుపోయాం.

ఒడ్డుకు వద్దామనుకుంటే రాతిపలకల్లాంటి మంచు. వెంటనే హార్బర్‌లోని ఇండియన్ నేవీ అ«ధికారులకు మెసేజ్ పంపించాం. వాళ్లు హాంకాంగ్ నేవీ వాళ్లకు కబురు పెట్టారు. వెంటనే హాంకాంగ్ నేవీ వాళ్లు మంచును తొలగించే నౌకను తీసుకొచ్చారు. కట్టర్ల సాయంతో సముద్రం మీద గడ్డకట్టిన మంచును ముక్కలు చేశారు. అప్పటి వరకు మేం సముద్రంలోపలే సబ్‌మెరైన్‌లోనే ఉన్నాం.

అందరి మనసుల్లో ఆందోళన. కాసేపటి తరువాత మంచు విడిపోయిందని మెసేజ్ వచ్చింది. అప్పుడు బయటపడ్డాం. సబ్‌మెరైన్లలో పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి అనుభవాలు ఎన్నో. ఒక్కసారి లోపలికి వెళ్లాక మళ్లీ బయటికి వచ్చే వరకు ఎప్పుడు, ఏం జరుగుతుందో ఊహించలేం. ఇదొక ఛాలెంజింగ్ జాబ్.

నీళ్లలో కాపలా...
భూభాగంలో గస్తీ తిరిగే సైన్యంలాగే, సముద్రంలోపల కూడా నిఘా తప్పనిసరి. నీళ్లలో ఆ పని చేసేది సబ్‌మెరైన్లే! మన దేశ సముద్ర తీరం ఏడువేల కిలోమీటర్లకుపైనే ఉంది. భూభాగం మీద అయితే అనుమతి లేకుండా సరిహద్దులు దాటే వాళ్లను సైన్యం అడ్డుకుంటుంది. అదే, సముద్రం లోపల్నించి వచ్చే వాళ్లను ఎలా గుర్తుపడతారు? ఏ సమయంలోనైనా శత్రువు రహస్యంగా మన దేశంలోకి రావచ్చు

. అందుకే సముద్రజలాల్లో కూడా నిఘాపెడుతుంది నావికాదళం. సబ్‌మెరైన్‌లు ఒక్కోసారి రెండు నెలలపాటు నీటిలోపలే ఉండిపోవాల్సి వస్తుంది. బయటి నుంచి చూస్తే సబ్‌మెరైన్లు చాలా పెద్ద ఆకారంలో కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం చాలా ఇరుగ్గా ఉంటాయి. అందులోనే వందమందికిపైగా సిబ్బంది ఉంటారు.

పెద్ద ఇనుప పెట్టెలాంటి క్యాబిన్లు, ఒక మనిషి పడుకుంటే మరొక మనిషి వచ్చేందుకు వీలులేని పడగ్గదులు. తిండీతిప్పలకు అంతంత మాత్రమే జాగా ఉంటుంది. హార్బర్‌లతో తప్ప బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఇలాంటి సబ్‌మెరైన్‌లోనే ఇరవై ఏళ్లు పనిచేశాను నేను. ప్రస్తుతం మర్చంట్ నావీ కెప్టెన్‌గా పనిచేస్తున్నాను.

సబ్‌మెరైన్‌లోనే...
మాది తూర్పుగోదావరి జిల్లాలోని పెనుగొండ ప్రాంతం. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. వర్ధమాన సినీనటి కలర్స్ స్వాతి నా కూతురే. నా గురించి చెప్పాలంటే.. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో సీటొచ్చింది నాకు. ఆ తర్వాత పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాను. అక్కడి నుంచి నేరుగా ఇండియన్ నేవీలోకి ప్రవేశించాను.

1977 నుంచి సబ్‌మెరైన్‌లోనే ఉద్యోగం. ఇరవై ఏళ్లలో కమాండర్, కెప్టెన్‌గా దేశమంతా తిరిగే భాగ్యం కలిగింది. విశాఖపట్టణం సముద్ర తీరంలో సందర్శనార్థం ఉంచిన 'కుర్‌సురా' సబ్‌మైరెన్‌కు అయిదేళ్లు కెప్టెన్‌గా పనిచేశాను. అప్పట్లో భారత్‌కు అది రెండో సబ్‌మెరైన్. రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. 1969లో దాన్ని సముద్రంలో ప్రవేశపెట్టారు. నాకు తెలిసి 31 సంవత్సరాలు సేవలు అందించింది 'కుర్‌సురా'. వైజాగ్‌లో దాన్ని చూసినప్పుడల్లా అందులో ఉద్యోగం చేసిన రోజులే గుర్తొస్తుంటాయి.

- సముద్రంలో 50 మీటర్ల లోతులో ప్రయాణిస్తున్నా, బయట ఏమీ కనిపించదు.
- రెండ్రోజులకు ఒకసారి డిస్పోజబుల్ డ్రెస్సులు మారుస్తుంటాం.
- ఆహ్లాదం కోసం సబ్‌మెరైన్‌లలో టీవీ, సినిమాలు చూడొచ్చు.
- మందు, సిగరెట్లు పూర్తిగా నిషేధం. ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటారు.
మన సముద్రజలాల్లో నావికాదళం గస్తీ తిరిగినట్లే, ఇతర దేశాల వాళ్లూ సముద్రంలో గస్తీ నిర్వహిస్తుంటారు. ఒకసారి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నప్పుడు మాకు మరికొంత దూరంలో ఒక సబ్‌మెరైన్ వస్తున్నట్లు సంకేతాలొచ్చాయి. ఉద్యోగులందరూ అలర్ట్ అయ్యారు. కొంతసేపటికి ఆ సబ్‌మెరైన్ దూరం వెళ్లిపోయింది. ఆ రోజు ఏమీ జరగలేదు.
యుద్ధాల్లో కీలకపాత్ర.
మన దేశంలోని ప్రధాన నౌకా కేంద్రాలలో సబ్‌మెరైన్లను నిలుపుతుంటారు. అక్కడి నుంచి ప్రతి రోజూ నేవీ అధికారులు నిర్దేశించిన దూరం వరకు సముద్రంలోకి వెళ్లి వస్తాయి. ఒక్కో సబ్‌మెరైన్ సామర్థ్యాన్ని బట్టి కొన్నేసి రోజులు నీళ్లలో ఉంటాయి. రీఛార్జి కోసం సముద్ర పైభాగానికి వచ్చి కావాల్సినంత ఆక్సిజన్‌ను నింపుకొని మళ్లీ లోపలికి వెళతాయి. దీన్ని 'స్నాటింగ్' అంటారు.

సాధారణ సమయాల్లో గస్తీకి ఉపయోగించే ఈ సబ్‌మెరైన్లను యుద్ధాలు వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి వాడుకుంటారు. ఇన్నేళ్ల నా ఉద్యోగ జీవితంలో యుద్ధాలు మాత్రం జరగలేదు. వెనకటి రోజుల్లో ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు వైజాగ్‌లోనే ఒక సంఘటన జరిగింది. ఇండియాకు చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ అనే సబ్‌మెరైన్‌ను ముంచేయాలని పాకిస్తాన్ వ్యూహం పన్నింది. నిజానికి విక్రాంత్ అప్పుడు వైజాగ్‌లో లేదు.

అక్కడే ఉందనుకొని పొరబడిన పాకిస్తాన్ సబ్‌మెరైన్ ఘాజీ నీళ్లలోపలే రహస్యంగా వైజాగ్ చేరుకుంది. నిఘా పెట్టిన ఇండియన్ నేవీ నీటి లోపలే ఘాజీని పేల్చేసింది. మన దేశంలో సబ్‌మెరైన్లకు సంబంధించి ఇదే తొలి సంఘటన.

రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ కూడా సబ్‌మెరైన్స్‌ను బాగా ఉపయోగించాడు. ఫాక్‌లాండ్ కోసం ఇంగ్లండ్, అర్జెంటీనాల నడుమ యుద్ధం జరిగినప్పుడు అర్జెంటీనాకు చెందిన రెండే రెండు సబ్‌మెరైన్లు ఇంగ్లండ్ నావికాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టాయి. ఆఖరికి ఆ యుద్ధంలో ఎంతో నష్టపోయాకగానీ ఇంగ్లండ్ గెలవలేదు. అదీ సబ్‌మెరైన్లకున్న పవర్.

అన్నీ ఇరుగ్గానే...
నిత్యం నీళ్లలోపల ఉండే సబ్‌మెరైన్ ఉద్యోగులు ఏం తింటారు..? ఎప్పుడు పడుకుంటారు..? స్నానాలు గట్రా ఎలా? ఇలాంటి ప్రశ్నలే చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని. అచ్చు మనం ఇంట్లో వండుకుని తినే ఆహారమే సబ్‌మెరైన్‌లోనూ వండుతారు. ప్రత్యేకంగా వంటమనిషి ఉంటాడు. అన్నం, పప్పు, రోటీ, కూరలు అన్నీ వేడిగా వండిపెడతారు.

చిన్న క్యాంటీన్‌లో డైనింగ్‌హాల్ మీదే అందరం భోంచేస్తాం. ఒక్క భోజన సమయంలో తప్పిస్తే సరదా సంభాషణలు ఎప్పుడూ వినిపించవు. షిప్టుల్లో పనిచేస్తాం. నిద్ర నాలుగైదు గంటలే ఉంటుంది. మిగతా సమయంలో కొందరు పుస్తకాలు చదువుకుంటుంటారు. సబ్‌మెరైన్ లోపల ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉండదు. ఒక్కసారి సముద్రంలోకి దిగాక, ట్రాన్స్‌మిటర్స్ ద్వారా నేవీ హెడ్‌క్వార్టర్స్‌కు మెసేజ్‌లు వెళుతుంటాయి.

మేం ఎక్కడున్నాం..? ఎంత లోతులో ఉన్నాం..? భూభాగానికి ఎంత దూరంలో వెళుతున్నాం..? సురక్షితంగా ఉన్నామా, లేక ప్రమాదంలో ఉన్నామా..? అనే విషయాలన్నీ మెసేజ్‌ల రూపంలో ఎప్పటికప్పుడు పంపిస్తుంటాం. మెసేజ్‌లు వెళ్లకపోతే సబ్‌మెరైన్ ప్రమాదంలో ఉన్నట్లేనని నేవీ హెడ్‌క్వార్టర్స్ వెంటనే అలర్ట్ అవుతుంది. వెంటనే 'ఫలానా సబ్‌మెరైన్ మిస్సింగ్' అంటూ అన్ని హార్బర్లకు సమాచారం పంపిస్తుంది

దాంతో వెంటనే నావికాదళానికి చెందిన నౌకలు వెతకడం ప్రారంభిస్తాయి. ఇలాంటి సంఘటన ఒకటి మా సబ్‌మెరైన్‌లో కూడా జరిగింది. అప్పుడు మేం విశాఖకు దగ్గర్లోనే సముద్రం లోపల ఉన్నాం. నేవీ హెడ్ క్వార్టర్స్‌కు మెసేజ్ ఇవ్వడం ఆలస్యమైంది. దీంతో వాళ్లు అలర్ట్ అయ్యారు. అసలు అంత చురుగ్గా స్పందిస్తారని మేం ఊహించలేదు. వెంటనే 'సబ్‌మెరైన్ సేఫ్' అంటూ మెసేజ్ పంపించాం.
అప్పుడు ఊపిరిపీల్చుకున్నారు వాళ్లు. ఇలాంటి అనుభవాలు సబ్‌మెరైన్లలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎదురవుతుంటాయి. అందరి జీవితాలు మట్టిమీద నడుస్తుంటే, మా జీవితాలు మాత్రం నీళ్లలో నడుస్తుంటాయి..'' అంటూ ముగించారు నగిర్‌రెడ్డి.  
జూ ఆది మల్లెంపూటి
ఫొటోలు : రజనీకాంత్

ఎర్త్ ఫ్రెండ్లీ * 'సన్‌పవర్' టెక్నాలజి

 
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే మనిషి సౌరశక్తి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. తప్పదు మరి. పత్ర హరితం నుంచి విద్యుచ్ఛక్తి వరకు భాస్కరుడి ప్రమేయం లేకుండా బయటకు రాదుగా! ఎక్కడి 'టెక్నాలజీ' అయినా పరోక్షంగా సూర్యుడి మీద ఆధారపడాల్సిందే కదా. ఇప్పటిదాకా అధికశాతం సౌరశక్తిని పరోక్షంగా ఉపయోగించుకుంటున్నా, ఇక ముందు నేరుగా ఉపయోగించుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణలు... నిత్య జీవితంలో అత్యంత అవసరమైన వస్తువులైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏటీఎమ్‌లు, వాటర్‌హీటర్ వంటివన్నీ సోలార్‌పవర్‌తో తయారుకానుండడమే.

ఇటీవలే చెన్నై ఐఐటీ వాళ్లు సోలార్ ఏటీఎమ్‌లు తయారు చేసి, ఉపయోగంలోకి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా మూడు వేల ఐదువందల సోలార్ ఏటీఎంలు స్థాపించాలనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. చెన్నై ఐఐటీ వాళ్లు ఇప్పుడు ఆ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఈ ఏటీఎమ్‌ల వల్ల పర్యావరణానికే కాదు బ్యాంకు వాళ్లకు కూడా లాభమే. ఏడాదికి 20,000 రూపాయలు కరెంటు బిల్లులు మిగులుతాయని వారి అంచనా. మిగతా అన్ని రంగాల్లోనూ ఇలాంటి మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే వాచీలు, వాటర్ హీటర్‌లు, కుకర్‌లు, ఇప్పుడిప్పుడే కంప్యూటర్‌లు, సెల్‌ఫోన్‌లు, ఏటీఎమ్‌లు... ఇలా ప్రతీది సోలార్ బాట పడుతున్నాయి. అలాంటి ఉత్పత్తుల తయారీకి పెద్ద కంపెనీలు సైతం సిద్ధమవుతున్నాయి. మొట్టమొదట 1970లో రోగర్ రిచెల్ అనే అమెరికన్ సోలార్ పవర్ రిస్ట్‌వాచ్‌ను తయారు చేశాడు. వాటిని తయారు చేయని ఒక్క వాచీ కంపెనీ కూడా లేదిప్పుడు. సోలార్ పవర్డ్ ల్యాప్‌ట్యాప్‌ను మొదట తయారు చేసింది ఒక స్పానిష్ కంపెనీ. దాని సామర్థ్యం 64 జీబీ. ఇప్పుడు సామ్‌సంగ్ కంపెనీ కూడా సోలార్‌పవర్ ల్యాప్‌ట్యాపుల్ని తయారు చేస్తోంది. ఇక మొబైల్స్ విషయానికొస్తే సోలార్ మొబైల్స్ గతేడాది జూన్ నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రెండ్‌ను ప్రారంభించింది కూడా సామ్‌సంగ్ కంపెనీయే. 'సోలార్ గురు' పేరుతో వాటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా సోలార్ మొబైల్ ఫోన్లను తయారుచేసే యోచనలో ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఐదేళ్ల క్రితం గుజరాత్‌లోని ఒక సోలార్ కంపెనీ తయారు చేసిన సోలార్‌కుకర్ బాగా ప్రచారం పొందింది. అది సైనికుల కోసం తయారు చేసింది. ఆ సోలార్‌కుకర్‌లో ఒకేసారి 500 మందికి సరిపోయే ఆహారాన్ని వండవచ్చు. అదే కంపెనీ గత ఏడాది (2009) తయారు చేసిన మరో సోలార్ కుకర్‌లో 20,000 మందికి సరిపోను ఆహారం వండొచ్చు. ఈ కుకర్‌ను షిర్డీలోని 'శ్రీసాయిబాబా సంస్థాన ట్రస్టు' కోసం తయారు చేశారు. 2009లో ముంబయిలో జరిగిన 'వెస్ట్రన్ ఇండియా సైన్స్‌ఫేర్'లో మొదటి బహుమతి అందుకున్న విద్యార్థి తయారు చేసింది కూడా 'సోలార్‌వాటర్ హీటర్'నే.
మనరాష్ట్రంలోని బైసానివారిపల్లె గ్రామం దేశంలోనే మొదటి 'సోలార్ విలేజ్'గా ఖ్యాతి పొందింది. ఆ ఊళ్లో అందరూ సోలార్ కుకర్లే ఉపయోగిస్తారు. అంతేకాదు స్మోక్ ఫ్రీ విలేజ్‌గా కూడా ఆ గ్రామానికి పేరుంది.


జర్మనీలో సోలార్ పవర్‌తో నడిచే ఒక పెద్ద షిప్పు ఉంది. 30 మీటర్ల వెడల్పు, 15.2 మీటర్లు వెడల్పుతో ఉండే ఆ షిప్పు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరో ఆసక్తి కలిగించే సోలార్ వార్త.... ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియాలో 'వరల్డ్ సోలార్ చాలెంజ్' పేరుతో కార్‌రేస్ పోటీలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి కార్లు పోటీలకు వస్తాయి. ఇందులో సోలార్ పవర్‌తో నడిచే కార్లనే ఉపయోగించాలి. ఈ సోలార్ కార్ రేస్ ట్రాక్ డార్విన్ నుంచి ఎడిలైడ్ మధ్య 3000 కిలోమీటర్లు ఉంటుంది. 2009 నుంచి 'వరల్డ్ గ్రీన్ చాలెంజ్'గా దీని పేరు మార్చారు.
వాంగార్డ్ 1.. ఇది అమెరికాలో తయారైన సోలార్ పవర్డ్ శాటిలైట్. 17 మార్చి 1958లో ప్రయోగించారు. అయితే 1964 తర్వాత దీని నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయింది. ఫలితం ఆశించిన విధంగా లేకపోయినా ప్రయత్నానికి మంచి పేరు వచ్చింది. ఒక మంచి ప్రయత్నం మంచి ఫలితానికి దారి లాంటిదే. అది వెంటనే రావచ్చు... కాస్త సమయమూ పట్టవచ్చు.

టెక్నాలజీ కారణంగా గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న సమయంలో అధునాతన టెక్నాలజీకి సౌరశక్తిని అనుసంధానిస్తుండడం ఎంతైనా అభినందనీయం. విద్యుత్‌తో పనిచేసే వస్తువుల హవా కొనసాగుతోంది కాబట్టి ప్రజల నుంచి భారీ స్పందన వస్తే గానీ మనిషి జీవితంలో భాగమైపోయిన సెల్‌పోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఏటీఎంలు 'ఎర్త్ ఫ్రెండ్లీ'గా మారే అవకాశం లేదు.

మట్టిలో మెరిసిన ఐడియాలు ..... మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం తట్టని ఎకోఫ్రెండ్లీ ఐడియా!

మట్టీ నేషనల్ కంపెనీ 'మిట్టీకూల్'

ఫ్రిజ్‌లొచ్చాక కుండలు పోయాయి. కుక్కర్లొచ్చాక మట్టిపాత్రలు కనిపించనే కనిపించడం లేదు. ఇక, వీటిని తయారుచేసే కుమ్మర్లు కనుమరుగవ్వక మరేమవుతారు..? ఆ మాటేదో కుమ్మరి కుటుంబానికే చెందిన మన్‌సుక్‌బాయ్‌కి చెప్పండి. అరికాలి మీద లేచొస్తాడు. ఐడియా తట్టాలేకానీ, మట్టి కలిపే చేతులతోనే మల్టీ నేషనల్ కంపెనీలను కొట్టొచ్చంటాడు.

ఆ కంపెనీలకన్నా భిన్నంగా ఆలోచిస్తే, పాత వృత్తులన్నీ మళ్లీ బట్టకడతాయని కుండబద్దలుకొట్టి మరీ చెబుతాడు. 'మిట్టీకూల్' కంపెనీ పెట్టి ఆ పనే చేశాడీయన. మట్టి ఫ్రిజ్, మట్టి కుక్కర్, మట్టి వాటర్ ఫిల్టర్‌లను తయారుచేస్తూ పెద్ద పెద్ద కంపెనీలకే ముచ్చెమటలు పట్టిస్తున్న మన్‌సుక్‌బాయ్‌ది... గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా మోర్బి..

"నువ్వయ్యా, అసలైన శాస్త్రవేత్తవంటే..!'' అబ్దుల్ కలాం అంతటాయన భుజంతట్టి మరీ చెప్పాడు.
"నీ ఆలోచన వల్ల ఎంతోమంది ఆరోగ్యంగా ఉంటారు..'' రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సైతం మెచ్చుకున్నారు.

పదో తరగతే గట్టెక్కలేని మన్‌సుక్‌బాయ్ ఇంతకూ ఏమంత గొప్ప పని చేశాడు..? ఆయన చేసిందల్లా ఒట్టి మట్టిపని. మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం తట్టని ఎకోఫ్రెండ్లీ ఐడియా! నిజంగానే ఆ ఐడియా మన్‌సుక్‌బాయ్ జీవితాన్నే మార్చేసింది.

ఆయన గురించి తెలుసుకున్నాక ఈ మాటను మనం సులువుగా అనేయవచ్చు. కానీ, మన్‌సుక్‌బాయ్ మాత్రం అంత ఈజీగా ఒప్పుకోడు. 'మట్టి ఐడియా' వెనుక తను ఎన్ని తిప్పలు పడిందీ తెలుసుకోవాలంటాడు. అప్పుడే- ఐడియా తన జీవితాన్ని మార్చిందా..? లేక తన పేదరికమే తనకు ఆ ఐడియాను ఇచ్చిందా..? అర్థమవుతుందంటాడు.

గాడి తప్పిన చదువు...
"ఏందిరా వెధవా, పదోతరగతి ఫెయిలయ్యావు. చదువు బొత్తిగా రాదు. ఇంకేం పని చేస్తావ్..? ఎట్ల బతుకుతావ్...?'' ఏ తల్లిదండ్రులైనా ఇంతకంటే ఇంకేమంటారు. ఫెయిలైనందుకు కాదు. అందరూ ఎత్తిపొడుస్తుంటే మన్‌సుక్‌బాయ్ మనసు చివుక్కుమంది.

'ఇప్పుడు ఏం చేయాలి' చిట్టి బుర్ర చేయని ఆలోచన లేదు. కొన్నాళ్లకు ఇంట్లోవాళ్లు కూడా పట్టించుకోవడం మానేశారు. ముందు నుంచి కుమ్మరి వృత్తిని నమ్ముకొని బతికే కుటుంబం వాళ్లది. సంప్రదాయబద్ధంగా కుండలు, కూజాలు, ప్రమిదలు చేసి అమ్ముకొనేవారు. వచ్చిన కాసింత డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు.

మన్‌సుక్‌బాయ్ కూడా మట్టి తవ్వుకురావడం, సారెతిప్పి కుండలు చేయడం, ఎండిన కుండలను కాల్చడం..అన్ని పనుల్నీ అవలీలగా చేసేవాడు. దేశంలో కొన్ని ప్రాంతాలలోనే దొరికే ఒక రకం ఎర్రమట్టి గుజరాత్‌లో కూడా దొరుకుతుంది. ఆ మట్టితో కుండచేస్తే ఉక్కుబిందెలాంటి గట్టిదనం వస్తుంది. ఇవన్నీ కుండలు చేసిన అనుభవంతోనే గమనించాడు మన్‌సుక్‌బాయ్. ఆయన తల్లిదండ్రులు మాత్రం 'ఒరే, కొన్ని తరాలుగా కుండలు చేస్తున్నా మన కుటుంబాలు బాగుపడింది ఏమీ లేదు.

నువ్వు ఈ వృత్తిని నమ్ముకోకు. ఎక్కడన్నా చిన్న ప్రైవేటు ఉద్యోగమేదైనా చూసుకొని బతుకు'' అనేవాళ్లు. ఇంట్లోవాళ్ల మాట కాదనలేక ఇటుకల బట్టీల్లో పని చేశాడు. భవననిర్మాణాల్లో రాళ్లు ఎత్తాడు. బండచాకిరీ చేస్తున్నా పైసా మిగల్లేదు. అందుకే- ఓ రోజున 'ఇది కాదు నా జీవితం... ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలి..' అనుకొని సొంతూరు తిరిగొచ్చాడు మన్‌సుక్‌బాయ్.

మట్టిలో మెరిసిన ఐడియాలు...
మారుతున్న కాలానికి తగ్గట్టు కుమ్మరి వృత్తికూడా ఎందుకు మారడం లేదు..? తనలోతాను పరి విధాలుగా ఆలోచించాడు. చాలామంది పేదోళ్లు వాటర్‌ఫిల్టర్‌లు కొనలేరు. ఫ్రిజ్‌లు కొనలేరు. కుక్కర్లు కొనలేరు. పాన్‌లు కూడా కొనలేరు. ఇప్పటికే ఫ్రిజ్‌లు ఉన్నవాళ్లకు కరెంటు బిల్లులు భారమై కూర్చుంటున్నాయి. ఫ్రిజ్‌లో పెట్టిన కూరగాయలు వండుకు తింటుంటే రుచీపచి లేదంటున్నారు మరికొందరు.

సరిగ్గా ఇక్కడే ఐడియా పండింది. ఆ ఐడియాను మట్టిలో ముంచితీశాడు మన్‌సుక్‌బాయ్. మట్టి వాటర్ ఫిల్టర్ కనిపించింది. మట్టి ఫ్రిజ్ మెరిసింది. మట్టి కుక్కరు, మట్టి పాన్ అదరహో అనిపించాయి. ఇంకేముంది..? కుమ్మరి చేతుల్లో మట్టిపడితే ఏ రూపమైనా ప్రాణం పోసుకోదూ..! అదే జరిగింది. ఎర్రమట్టితో వాటర్ ఫిల్టర్ తయారుచేశాడు. అదే మట్టితో అచ్చుగుద్దినట్లు ఫ్రిజ్ చేశాడు.

ఆయన వాలకం చూసి 'నీకేమన్నా పిచ్చారా భయ్, ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీల ఫ్రిజ్‌లు మార్కెట్‌లో తక్కువరేటుకే దొరుకుతుంటే, బోడి నీ మట్టిఫ్రిజ్ ఎవ్వడు కొంటాడు..' అన్నారు ఇరుగుపొరుగు వాళ్లు. అవేమీ పట్టించుకోలేదు అతను. చేస్తున్న పని కొనసాగిస్తూ.. మట్టితో కుక్కర్, పాన్ చేశాడు. అంతాబాగుంది కానీ, మార్కెట్ ఎలా చేయాలో అర్థం కాలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. బ్యాంకోళ్లను బతిమాలి బామాలి రూ.30 వేలు లోన్ తీసుకున్నాడు. చిన్న ఫ్యాక్టరీ 'మిట్టీకూల్' బోర్డు పెట్టాక మన్‌సుక్‌బాయ్ కళ్లు వెలిగిపోయాయి.

తొలి విజయం...
మట్టి ఫ్రిజ్‌లో కూరగాయలు, పండ్లు, నీళ్లు ఎనిమిది రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇవన్నీ సహజత్వాన్ని ఏమాత్రం కోల్పోవు. రుచి కూడా తగ్గదు. అందులోనూ కరెంటు అవసరమే లేదు. మట్టి వాటర్ ఫిల్టర్ కూడా అంతే. అందులో పోసిన నీళ్లు శుభ్రంగా, చల్లగా ఉంటాయి. మట్టికుక్కరు, మట్టిపాన్ మీద వంట చేయమని భార్యకు చెప్పాడు మన్‌సుక్‌బాయ్.

ఎంతో సౌకర్యంగా ఉందని చెప్పింది ఆవిడ. అంతటితో ఊరుకోకుండా ముంబయిలోని 'టాటా కెమికల్స్' వాళ్ల చేత పరీక్ష చేయించాడు. వాళ్లు ఓకే అన్నారు. అంతలో ఓ రోజు నైరోబి దేశస్థుడు మిట్టీకూల్‌ను సందర్శించి, అక్కడికక్కడే 500 మట్టి వాటర్‌ఫిల్టర్లు కావాలని ఆర్డర్ ఇచ్చేశాడు. అదే మన్‌సుక్‌బాయ్‌కి తొలి విజయం. తనమీద తనకు విశ్వాసం కలిగించిన అమ్మకం. ఒక్కో ఫిల్టర్ రూ.400 చొప్పున అమ్మేశాడు.

ఆ వార్త గుజరాత్ పత్రికల్లో పడింది. మిట్టీకూల్‌కు పెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్‌నే తెచ్చిపెట్టింది. దాన్ని చూసి ముంబయి, పాట్నా, పూణెల నుంచి కుప్పలుతెప్పలు ఆర్డర్లు వచ్చాయి. డిమాండ్ ఎంత వరకూ వెళ్లిందంటే 50 వేల మట్టిపాన్‌లు అమ్మే వరకూ వెళ్లింది. మట్టిఫ్రిజ్ రూ.2,500 ధరపెట్టినా చాలామంది ఉత్సాహంగా కొనుక్కెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్‌లు చేసి తెప్పించుకున్నారు. మిట్టీకూల్ మన్‌సుక్‌బాయ్ పేరు గుజరాత్ అంతటా మార్మోగింది.

నడిచొచ్చిన సంస్థలు..
ఎల క్ట్రానిక్, ప్లాస్టిక్ వస్తువులతో పర్యావరణానికి హాని పెరుగుతున్న ఈ రోజుల్లో 'ఎకో ఫ్రెండ్లీ' వస్తువులను తయారుచేయడం మన్‌సుక్‌బాయ్‌కి కలిసొచ్చింది. పెద్ద పెద్ద సంస్థలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. 'గుజరాత్ గ్రాస్‌రూట్ ఇన్నొవేషన్ నెట్‌వర్క్', 'నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్' మన్‌సుక్‌బాయ్ కనిపెట్టిన వస్తువులకు పేటెంట్ ఇప్పించాయి.

అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ప్రొఫెసర్లు కార్పొరేట్ మార్కెటింగ్, ప్యాకింగ్, టెస్టింగ్‌లలో సలహాలు ఇచ్చారు. గుజరాత్ ఎగ్జిబిషన్, న్యూఢిల్లీలో జరిగిన 'ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్' వాళ్ల నుంచి ఆహ్వానాలు అందాయి. మిట్టీకూల్ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శనకు పెట్టి అంతర్జాతీయ శాస్త్రవేత్తలను సైతం ఆకర్షించాడు మన్‌సుక్‌బాయ్. అంతర్జాతీయ సంస్థలైన బోస్, సీమెన్స్‌లాంటి కంపెనీలు ఆసక్తి చూపాయి.

'సెంటర్ ఫర్ ఇండియా అండ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్', యూకేలోని 'యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్' కాన్ఫరెన్సులకు కూడా పిలిచారు. అక్కడ తన ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తుల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు మన్‌సుక్‌బాయ్. ఇప్పుడు మిట్టీకూల్ గుజరాత్ గల్లీ కంపెనీ కాదు. ఇంటర్నేషనల్ లోకల్ కంపెనీ. మన్‌సుక్‌బాయ్ యానికి ముచ్చటపడిన మల్లికా సారాబాయ్ మిట్టీకూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేస్తానంది.

ఇంత చేసింది పదోతరగతి ఫెయిలైన మన్‌సుక్‌బాయ్. తనకు ఎలాగూ చదువుకొనే అదృష్టం లేదు. అందుకే కొడుకును సిరామిక్ ఇంజినీరింగ్ చదివిస్తున్నాడు. హ్యాట్సాఫ్ మన్‌సుక్‌బాయ్.