Showing posts with label Facebook. Show all posts
Showing posts with label Facebook. Show all posts

Monday, October 25, 2010

Dirty fun at mud festival

The Paleo is the largest Switzerland open-air music festival.Students and festival volunteers paid tribute to the 40th anniversary of the Woodstock music festival by spreading the fun of mud as it was done in 1969 in Upstate New York.According to the festival organization, the project is a “back to the earth” psychedelic inspiration and 100% recyclabledirty festival (6)


dirty festival (7)
Mud is also used in medical porpuse, the health benefits that users swear by are not scientifically proven, but you know what you feel. The mud treatment is said to help clear clogged pores. Toxins are removed from the body as well. Those who suffer from pain in their muscles and joints have found relief through mud baths
dirty festival (5)
dirty festival (4) dirty festival (3)
dirty festival (2)
dirty festival (1) dirty festival dirty festival (8)

So you can combine two usufull stuff in one, music festival and mud beauty and healthy treatment to heal and rejuvenate the entire body.

Wednesday, September 29, 2010

శ్రమైక జీవన సౌందర్యమే ‘ఆనందం’


ఆయన ఓ సర్పంచ్. అయితే ఏంటని అంటారా? ఓ వైపు ప్రజాసేవ చేస్తూ, మరో వైపు పాడి పశువులు పెంచుతూ, ఇంకో వైపు వ్యవసాయం సాగిస్తూ ‘ఆనందం’ పొందుతున్నారు. అన్ని బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. రాజకీయ నాయకులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాడి పశువుల ఆలనా పాలనా చూసుకుంటూ పాల వ్యాపారిగా అవతారం ఎత్తుతూ ... పొలం పనులు సాగిస్తూ... గ్రామ సర్పంచ్‌గా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ... ఇలా మూడు రంగాలలోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఆయనే కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన అయిల్నేని ఆనందరావు. శ్రమైక జీవన సౌందర్యంలోని మాధుర్యాన్ని రుచి చూస్తున్న ఆనందరావును ‘న్యూస్‌లైన్’ పలకరిస్తే ఎన్నో విషయాలు తెలిపారు. ఆ వివరాలు మీరూ తెలుసుకోండి మరి...

ఒక్క గేదెతో వ్యాపారం మొదలెట్టి...
ఇంటర్ వరకూ చదివిన ఆనందరావు స్వయంకృషిని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నారు. పశు పోషణను ఉపాధిగా ఎంచుకున్నారు. 1990లో ఒకే ఒక్క గేదెతో పాల వ్యాపారం మొదలెట్టారు. ఇప్పుడు వాటి సంఖ్య 12కు చేరింది. అంతే సంఖ్యలో చిన్న దూడలూ ఉన్నాయి. అప్పుడప్పుడూ పాడి గేదెల్ని కొంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరు. గేదెల్ని స్థానికంగానే కొనుగోలు చేస్తారు.

పాల వ్యాపారంలో మేటి
పాల అమ్మకం ద్వారా ప్రతి నెలా 12 వేల రూపాయలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు ఆనందరావు. లీటరుకు 15-20 రూపాయల వరకూ ధర పలుకుతోంది. రోజుకు కనీసం 60-70 లీటర్ల పాలను స్కూటర్‌పై తీసికెళ్లి సమీపంలోని జగిత్యాల పట్టణంలో విక్రయిస్తారు. తాను తిన్నా, తినకున్నా ప్రతి గేదెకు అయిదు కిలోల చొప్పున ఉదయం, సాయంత్రం తౌడు, అటుకుల పిండిని దాణాగా అందిస్తారు. తానే స్వయంగా ఎడ్ల బండి తోలుకుని పొలానికి వెళ్లి గడ్డి తెచ్చి పశువులకు మేపుతారు. వరి పైరు కోసిన తర్వాత వచ్చే ఎండు గడ్డిని ఓ పూట గేదెలకు వేస్తారు. దీంతో పశుగ్రాసం ఖర్చు కూడా తగ్గుతోంది. పశువులకు అవసరాన్ని బట్టి టీకాలు వేయించడంతో పాటు వాటికి ఎలాంటి వ్యాధులు వచ్చినా పశు వైద్యుల సలహాలు, సూచనలతో చికిత్సలు చేపడతారు.

పెద్దల నుండి వచ్చింది 30 గుంటలే...
సర్పంచ్ ఆనందరావుకు పెద్దల నుండి వచ్చిన వ్యవసాయ భూమి కేవలం 30 గుంటలే (ముప్పావు ఎకరం). దానినే అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు అయిదెకరాల ఆసామి అయ్యారు. ఇది పాడి పరిశ్రమ పుణ్యమేనని సగర్వంగా చెబుతారు ఆనందరావు. ఎందుకంటే పాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ఇద్దరు పిల్లల చదువులకు, వ్యవసాయ పెట్టుబడులకు, ఇంటి ఖర్చులకు సరిపోతుంది. పంటలు అమ్మగా వచ్చిన ఆదాయం మిగులుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏటా అన్ని ఖర్చులు పోను మూడు లక్షల రూపాయల నికరాదాయం పొందుతున్నారు. ప్రతి పనినీ తానే స్వయంగా చేసుకుంటారు. అవసరమైనప్పుడు ఒకరిద్దరు కూలీలను పెట్టుకుంటారు.

సేంద్రియ వ్యవసాయంపై మక్కువ
ఆ ప్రాంతంలోని రైతులందరూ వ్యవసాయ భూములకు పశువులు లేదా కోడి ఎరువు, చెరువు మట్టిని ఉపయోగిస్తుంటారు. అయితే పశువుల ఎరువు సరిగా లభ్యం కాకపోవడం, ధర అధికంగా ఉండటంతో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ మన ఆనందరావు మాత్రం తన పాడి గేదెల పేడనే వరి, మొక్కజొన్న, పసుపు పంటలకు ఎరువుగా వాడుతున్నారు. చాలా వరకూ సేంద్రియ ఎరువునే వినియోగిస్తుండడంతో పైర్లకు ఎలాంటి చీడపీడలు సోకడం లేదని అంటారాయన. అంతే కాకుండా ఇతర రైతుల కంటే దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి. ఎలాంటి భేషజం లేకుండా ఓ వైపు పాడి గేదెల పాలు విక్రయిస్తూ మరో వైపు గ్రామ ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తూ అందరి మెప్పూ పొందుతున్నారు. ఆనందరావును ఆదర్శంగా తీసుకుని తోటి రైతులు కూడా ఇప్పుడు పాడి పశువుల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఆనందరావు నుండి సలహాలు పొందుతున్నారు.


4.30 గంటలకే దినచర్య మొదలు
ప్రతి రోజూ ఉదయం 4.30 గంటలకే ఆనందరావు దినచర్య మొదలవుతుంది. ముందుగా అన్ని గేదెల పాలు పిండి, పశువుల వద్ద పేడ తీసి దాణా వేస్తారు. ఆ తర్వాత పాలను జగిత్యాల తీసికెళ్లి రోజువారీ వినియోగదారులకు విక్రయిస్తారు. ఈ పనంతా తెల్లారే సరికే పూర్తవుతుంది. ఉదయం 7-8 గంటల లోపే పంచాయతీ కార్యాలయానికి చేరుకొని సర్పంచ్ విధుల్లో నిమగ్నమవుతారు. 11 గంటల తర్వాత వరి పొలాలు, పసుపు తోటల్లో పనులు చూసుకుంటారు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పచ్చి మేత తీసుకొస్తారు. మధ్యాహ్న సమయంలో పశువుల్ని మేపుకు రావడానికి ఒక మనిషిని నియమించారు. సాయంత్రం పాడి గేదెలు ఇంటికి రాగానే వాటికి మేత వేస్తారు. రాత్రి కాగానే దాణా పెట్టి పాలు పితుకుతారు. పాలు పిండిన తర్వాత మేత వేస్తారు. అప్పటితో ఆయన దినచర్య పూర్తవుతుంది. ఆనందరావు ఎప్పుడూ ఊర్లోనే గడుపుతారు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లినా చీకటి పడేసరికే ఇంటికి చేరుకుంటారు. గ్రామాభివృద్ధికి సంబంధించి ఏదైనా పని మీద మండల కేంద్రానికి వెళితే సాయంత్రానికే తిరిగి వచ్చేస్తారు.
పాల వ్యాపారాన్ని వదలను
ఏ స్థాయిలో ఉన్నా పాడి గేదెల పెంపకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టను. మరి న్ని పాడి గేదెలు కొనుగోలు చేయాలని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ఉత్సాహంగా ఉంది.

ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్న వారు చాలా మంది తమ పాత వృత్తిని కొనసాగించేందుకు నామోషీగా ఫీలవుతారు. కానీ నేను అలా భేషజాలకు పోను. ఈ వ్యాపారాన్ని వదలను.

అందరికీ అందుబాటులో...
పాల వ్యాపారంతో పాటు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే ఆనందరావు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు.
అందరితో కలుపుగోలుగా ఉండే ఆనందరావు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ వారి ముందు వాలిపోతారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ చేనుకు వెళ్లడం మాత్రం మరచిపోరు. అన్ని పనులకు సమ న్యాయం చేసే క్రమంలో కొంత ఒత్తిడికి గురవుతున్నప్పటికీ ఎప్పుడూ ఆహ్లాదంగా కనబడుతుంటారు.

Tuesday, September 28, 2010

ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్ * ప్రైవేటు టీచర్.కామ్

గూగుల్ కూడా గుర్తించలేని ఒక మారుమూల తండాలో పుట్టాడు సోమేశ్వర్ వంశీ నాయక్. అయితే ఇప్పుడు గూగుల్‌లో అతని గురించి ఒక్కసారి వెతికి చూడండి.. మీకు కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. అసలు వంశీ గురించి మేమెందుకు తెలుసుకోవాలి అంటారా? ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు మరెవరికీ ఎదురుకాకూడదని ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ని రూపొందించాడు. దాని గురించే ఈ కథనం.

మీరు టీచర్‌గా పనిచేస్తున్నారా? లేదంటే పనిచేయాలన్న ఆలోచన ఉందా? ఇప్పుడున్న పాఠశాలలో కాకుండా మరో మంచిస్కూల్ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఒకే దగ్గర దొరుకుతుంది. అదే ఎడ్యునెస్ట్ (www.edunest.org). కేవలం టీచర్ల కోసమే రూపొందించిన వెబ్ పోర ్టల్ ఇది. దీన్ని డిజైన్ చేసింది పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదు, నిన్న మొన్ననే ఎంఏ పూర్తి చేసిన ఒక సాధారణ టీచర్. అసలు అతనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో చదవండి.

ఓ దసరా పండగ మధ్యాహ్నం.. ట్యాంక్‌బండ్‌పై ఒంటరిగా బెంచీ మీద కూర్చుని ఇలా డైరీ రాసుకుంటున్నాడు వంశీ నాయక్. "అందరూ కొత్తబట్టలు వేసుకుని, పండగ జరుపుకుంటూ సంతోషంగా ఉన్నారు. కానీ నా పరిస్థితేంటి ఇలా ఉంది? ఆకలిగా ఉంది. జేబులో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలి? చచ్చిపోవాలనిపిస్తోంది. ఛీ... నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? లేదు. పిరికివాడిలా చావకూడదు. ఎలాగైనా చదువుకోవాలి. ఏదైనా సాధించాలి'' అనుకున్నాడు.

తండాలో పుట్టి...
నిజానికి వంశీకి అమ్మానాన్నా, ఇద్దరు అక్కలూ ఉన్నారు. అతనిది మహబూబ్‌నగర్ జిల్లాలోని బుద్ధారం ధర్మ తండా. చాలా పేద కుటుంబం. కుటుంబంలో అందరూ ఏదో ఒక పనిచేస్తేనే కడుపునిండేది. అలాంటి పరిస్థితుల్లో వంశీని చదివించడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయింది. వంశీ అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో అక్కలతో కలిసి కూలీ పనికి వెళ్లేవాడు. రోజుకు పది రూపాయలు వచ్చేవి.

అలా కూడబెట్టుకున్న డబ్బులు, అక్కావాళ్లు ఇచ్చిన ఇంకొన్ని డబ్బులు మూటకట్టుకుని ఇంట్లోంచి పారిపోయాడు. వనపర్తిలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోసాగాడు. వాళ్ల అమ్మనాన్న కూడా 'పోనీ చదువుకోనీలే' అని వదిలేశారు. సెలవుల్లో ఇంటికి వెళ్లి వస్తుండేవాడు కానీ ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలా రెండు మూడేళ్లు గడిచింది.

పేపర్ బాయ్‌గా..
ఏడో తరగతి చదువుతున్నప్పుడు సాయంత్రం పూట వంశీ ఒక ఎస్టీడీ బూత్‌లో పనిచేసేవాడు. నెలకు వంద రూపాయలు వచ్చేవి. అవి కూడా సరిపోయేవి కావు. 'ఇంకా ఏదైౖనా పని ఉంటే చెప్పండి' అని ఎస్టీడీ యజమానిని అడిగితే 'పేపర్ బాయ్‌గా చేస్తావా? 150 రూపాయలిస్తాను' అన్నాడు.

వంశీ పేపర్ వేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ పని చేయాలంటే సైకిల్ ఉండాలి. ఆ యజమాని సైకిల్ తానే ఇస్తానన్నాడు కానీ దానికి అద్దె నెలకు 75 రూపాయలు. అలా ఉదయం, సాయంత్రం కష్టపడితే వచ్చే 175 రూపాయలతో వంశీ చదువుకునేవాడు.

ఆలోచన పుట్టిందిలా..
ఇంటర్ అయిపోయాక వేసవి సెలవుల్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'మళ్లీ బడి' కార్యక్రమంలో చేరాడు. పాటలు పాడుతూ, పాఠాలు చెబుతూ గ్రామాల్లో తిరిగేవాడు. ఆ సందర్భంలోనే ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి కలిగింది. తర్వాత వనపర్తిలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్‌లోని జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుండేవాడు.

ప్రయివేటు ట్యూషన్లు చెబుతూ ఎంఏ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు వనపర్తిలోని బ్రిలియంట్ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు, సహోద్యోగులు ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టిన ఆలోచనే ఎడ్యునెస్ట్.

ఎడ్యునెస్ట్ గురించి...
ఈ రోజుల్లో ఒక వెబ్‌సైట్ రూపొందించడం పెద్ద కష్టం ఏం కాదు. చాలా తక్కువ ఖర్చులో కూడా తయారుచేయొచ్చు. కానీ వంశీ తయారు చేసుకున్న కాన్సెప్ట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం చాలా జిబి స్పేస్ కావాలి. ఒకరు మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారనుకుందాం.

వేరే స్కూల్లో అదే పోస్ట్, ఎక్కువ జీతంతో ఖాళీ ఉందనుకుందాం. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే అవి వెంటనే ఆ టీచర్‌కు ఎస్ఎమ్ఎస్ రూపంలో వెళ్తాయి. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారాన్ని కేవలం ఇ-మెయిల్స్ ద్వారానే అందిస్తున్నాయి మిగతా వెబ్‌సైట్లు. అందరూ ప్రతిరోజూ ఇంటర్‌నెట్ చూసే అవకాశం ఉండదు కాబట్టే ఈ ఎస్ఎమ్ఎస్ పద్ధతిని ఎంచుకున్నానంటాడు వంశీ.

ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు అతనికి 50 వేల రూపాయలు ఖర్చు అయింది. ఈ మొత్తాన్ని తనకు నెల నెల వచ్చే జీతం నుంచి వాయిదాల పద్ధతిలో కడుతున్నాడు వంశీ. అధికారికంగా వెబ్‌సైట్‌ని ప్రారంభించేందుకు గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 
జూ బీరెడ్డి నగేష్ రెడ్డి

Thursday, September 9, 2010

ప్రపంచం మీ గుప్పిట్లో

గ్రీక్‌ తత్వవేత్త అరిస్టాటిల్‌ సెల్ఫ్‌ డెవలప్‌మెంట్‌ని బాగా వెలుగులోని తెచ్చిన వ్యక్తి. చాలా మంది గొప్పవారు కూడా వీటికి సంబంధించి ఎన్నో గొప్ప రచనలు కూడా చేశారు. వారిలో ప్రసిద్ధ సైకాలజిస్ట్‌‌స ఆల్‌ఫ్రెడ్‌ ఆడ్లర్‌, కార్ల్‌యంగ్‌ సైకాలజీకి, స్వయం అభివృద్ధికీ అవినాభావ సంబంధం ఉందన్నారు. స్వయం అభివృద్ధికి పాటుపడే ముందు వాటికి కావలసిన విషయాలను కూలంకషంగా పరీక్షించుకోవల్సిన అవసరం ఎంతెైనా ఉంది అంటున్నారు.
worldస్వయం పరిజ్ఞానం.. అంటే మీరేమిటి అన్నది.. మీ ఫీలింగ్స్‌, ఆలోచనలు, దౌర్బల్యాలు, బలాలు, అన్నీ ఇందులోకి వస్తాయి. రూపురేఖల్ని ప్లాస్టిక్‌ సర్జరీ సహకారం లేకుండా ఎంత మాత్రం మార్చలేరుగానీ, ప్రవర్తనని మార్చుకోవడం ద్వారా పబ్లిక్‌ సోషల్‌ ఇమేజ్‌ని మార్చుకోగలరు. బాగా ఏమేమి చెయ్యగలరు? ఎన్ని స్కిల్స్‌ వచ్చు? పదిమందితో ఈజీగా మనగలిగితే మార్కెటింగ్‌, మంచి బుద్ధికుశలత వాక్చాతుర్యం ఉంటే లాయర్లు, ట్రైనర్స్‌, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ లాంటి ఫెైనార్ట్‌‌స బాగా వచ్చే వారెైతే ఒక డిజెైనర్‌ స్టోర్‌ బొటీక్‌ లేదా ట్రైనింగ్‌ సెంటర్‌ ఇలా ఆలోచిస్తూ పోతే మీ టాలెంట్‌కి తగ ్గప్రొఫెషన్‌ని ఎంచుకోగల్గుతారు. అలా మీరు ఏమేం చెయ్యగలరు? మీ సామర్థ్యం ఏ లెవల్లో ఉంది? అన్నవి తరచి చూసుకుంటే, ఈ పెైన ఇంేమేమి నేర్చుకోవాలో అర్థమవుతుంది. దానికి తగ్గ కోర్స్‌లు చేయవచ్చు. ట్రైనింగ్‌ తీసుకోవచ్చు.

workingచదువు వల్ల, అనుభవజ్ఞానం వల్ల వచ్చిన విజ్ఞానాన్ని సానపట్టేవి సాఫ్ట్‌ స్కిల్స్‌, తద్వారా మన పర్సనాలిటీని వెలికి తెచ్చి చూపించే ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌కి మరింత పదునుపెట్టి, జీవితంలో అంచెలంచెలుగా పెైకెడుతూ, దినదిన ప్రవర్థమానమవ్వడానికి చేసే ప్రయత్నాన్నే స్వయం అభివృద్ధి అంటారు. తద్వారా విద్యా, ధన సంపదలు అభివృద్ధి చెందడమేకాదు, మన ఆశయాలని, కలలని నిజం చేసుకోగల సమర్థత, చాకచక్యం వస్తాయి. ఆత్మవిశ్వాసం విజయాలకి దారి తీస్తుంది. అందువల్ల దాన్ని పొందించుకోవాల్సిన ఆవశ్యకత వుంది. సాఫ్ట్‌ స్కిల్స్‌ అన్నీ ఒకే దండలోని పూవుల్లా అమరి వుంటాయి. ఒకదానితో మరొకటి అనుసంధానం అయి వుంటాయి. కాబట్టి ఒకదాన్ని నేర్చుకోవాలంటే మరొకటి తప్పకుండా నేర్చుకోవాలి.

ఆత్మవిశ్వాసం..
ఆత్మ గౌరవం ఎంత అవసరమో, ఎలా వాటని పెంపొందించుకోవాలో తద్వారా ఎలా ఆత్మవిశ్వాసం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆత్మవిశ్వాసం వల్ల సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ చేసుకునే స్థైర్యం వస్తుంది. విజయాన్ని ఎదురుచూసేలా చేస్తుంది. చెయ్యలేనేమో, నష్టపోతానేమో లాంటి భయాల్ని దరిదాపుల్లోకి రానివ్వదు. పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకుని వాటికి తగ్గ నిర్ణయాలు తీసుకునే ధెైర్యాన్ని ఇస్తుంది. ఓడిపోయినా, నష్టపోయినా భీరువుని చెయ్యదు. పడ్డా మళ్లీ లేచేందుకు చేయూతనిస్తుంది. ఓటమివల్ల వచ్చే బాధనీ దు:ఖాన్నీ వాటిల్లోంచి జనింగచే భయాన్నీ ఇమోషన్స్‌నీ తట్టుకునే శక్తినిస్తుంది.

సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌...

ఎవరికి వాళ్ల మనోవికాసానికి దోహదపడేలా తమని తాము పరీక్షించి చూసుకుని, బాధ్యత వహించడం. ఏం చేయాలంటే అనుక్షణం తమని తాము నిన్నటి కంటే ఈ రోజుకి ఎంత ఇంప్రూవ్‌ అయ్యాను కొత్తవి ఏం నేర్చుకున్నాను? వీటి వల్ల ఉద్యోగవకాశాలు ఎంత వరకు మెరుగు పరుచుకున్నాను? ఎంత అర్హత వచ్చింది? అని అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటి రోజుల్లో నల్గురితో ఏం మాట్లాడాలో తెలియక తికమకపడి టెన్షన్‌లో ఏదేదో వాగి ఉన్న మంచి పేరు కూడా చెడగొట్టుకునే వాళ్లే కోకొల్లలు. ఈ కోవలోకొచ్చేవారికి సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌గా వాక్చాతుర్యం ఆచితూచి సందర్భోచితంగా మాట్లాడటం మొట్టమొదటి ఛాలెంజ్‌ అవుతుంది.

అన్నిటినీ అధిగమించాలంటే..
అభివృద్ధి చెందాంటే అది నూటికి నూరు శాతం ఎవరికి వారిదే బాధ్యత. దీని కోసం ఎవ్వరూ దీనికి ఏమీ చెయ్యలేరు. గడిచిపోయిన కాలం గురించి వగస్తూ కూర్చుంటే వున్న కాలం కూడా వృథా అయిపోతుంది.
సమస్యలు వస్తే చిరాకు పడటం, హడలి పోవడం రెండూ వద్దు. వాటిని సొల్యూషన్‌ వెతకడం ద్వారా సానబట్టిన వజ్రంలా మీరు తయారవ్వడం మొదలవుతుంది. కష్టాలకు ఎదురీదడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక్కొక్క భయాన్నీ, సందేహాన్నీ జయిస్తున్నప్పుడల్లా మీ భుజం మీరు తట్టుకుని ప్రోత్సహించుకోవాలి. స్ఫూర్తి, ఉత్సాహం రెట్టింపవుతాయి. ఏదెైనా చేయడం కష్టం అనిపించినప్పుడు చాలా మంది వదిలేస్తారు.

jumpఅది పలాయనవాదం పఠించేవారికి, లూజర్సకి, సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ మీద దృష్టి పెట్టిన వాళ్ళు చేసే పని కాదు. కొత్తగా ఏమి నేర్చుకున్నా కూడా దాన్ని గుర్తించి, గ్రహించి అర్థం చేసుకుని వ్యక్తీకరించుకుని, ఒక కొత్త ముఖ్యమూన పాఠ్యాంశంగా బురల్రో ముద్రవేసి, జ్ఞాపకంలో ఉంచుకుని, అవసరం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. పరిజ్ఞానంలో, బిహేవియర్‌లో మీ కన్నా ఒక మెట్టు పెైన ఉన్నవారితో సమయాన్ని వెచ్చించాలి. వారి నుండి తెలుసుకోవాల్సిన విషయాలను గుర్తించాలి. అవసరమైన వాటిని నేర్చుకోవాలి. మంచి సాహిత్యం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వ్యక్తిత్వానికి సానబెడుతుంది. అందులోనూ ఇంగ్లీష్‌లో చదివితే మరీ మంచిది. వీటివల్ల ఒకాబ్యులరీ పెరగడమే కాకుండా, ఇంగ్లీషు భాష బాగా ఇంప్రూవ్‌ అవుతుంది. బద్ధశత్రువులు అయిన వాళ్లు కూడా మిత్రులవుతారు. బాబోయ్‌ అనుకున్న కష్టాలు కూడా వెనక్కి వెళతాయి.. వీటన్నిటికీ ఆత్మవిశ్వాసం.. నమ్మకం.. ముఖ్యం.

Sunday, September 5, 2010

Facebook * ఫేస్‌బుక్

చౌరస్తాలో నిలబడ్డట్టే



కన్నతల్లికోసం ముప్పయ్యేళ్లు ఎదురు చూసిన ఒకామెకి ఆ తల్లిని ఒకే ఒకరోజులో వెతికి పెట్టింది.
చెయ్యని నేరానికి జైలు కెళ్లిన ఓ యువకుణ్ణి నిర్దోషిగా నిరూపించింది.
ఒంట్లో బాగోలేదని సాకులు చెప్పి పని ఎగ్గొట్టిన ఒక ఉద్యోగి గుట్టు బయటపెట్టింది.
డిప్రెషన్‌లో ఉన్నానంటూ హెల్త్ ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేసుకుని ఆ సమయమంతా పార్టీల్లో ఎంజాయ్ చేసిన ఒకామెకి ఆ డబ్బు రాకుండా చేసింది.
లాగ్ అవుట్ చెయ్యని పాపానికి ఒకాయన చేసిన దొంగతనాలన్నీ బయటపెట్టింది.
మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరిచినందుకు మరొకరి ఉద్యోగమే పోగొట్టింది.
ఈ 'మంచి చెడు'లన్నీ చేస్తున్నది ఏ నిఘా సంస్థో కాదు. వికీలీక్స్ అంతకన్నా కాదు. అదో ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్క్. ఇంటర్నెట్ వాడే వాళ్లందరికీ చిరపరిచితమైన ఫేస్‌బుక్.


ఆన్‌లైన్లో అమ్మ దొరికింది

డానా లారీకి ఇప్పుడు 41 ఏళ్లు. కాలిఫోర్నియాలోని రోజ్‌విల్లెలో నర్స్‌గా పని చేస్తున్న ఆమెకి తనని పసితనంలోనే దత్తత తీసుకొన్నారని తెలుసు. ఆ ఒక్కముక్క తప్ప తన అసలు తల్లిదండ్రులెవరో, వాళ్లు ఎక్కడుంటారో తెలీదు. వాళ్ల గురించి తెలుసుకోవడానికి లారీ చేయని ప్రయత్నం లేదు. పిల్లల్ని దత్తత ఇచ్చే ఎన్నో సంస్థల్ని సంప్రదించింది. వాళ్ల రికార్డులన్నీ తిరగేసింది. 'ఎడాప్షన్ ఏజెన్సీలు' ఆన్‌లైన్లో పొందు పరిచిన జాబితాలన్నీ జల్లెడ పట్టింది. ఇలా కొన్నాళ్లపాటు వెతికినా ఎలాంటి ఆధారాలుగానీ, కనీసం వారి ఆనవాళ్లు గానీ ఏమీ దొరకలేదు ఆమెకి.

ఈ సంవత్సరం జనవరి 10న ఫేస్‌బుక్‌లో చేరి తన తల్లికోసం వెతుకుతున్నట్లు చెప్పుకుంది. ఫేస్‌బుక్ ద్వారా ఈ వార్త లక్షల మందికి చేరింది. వారిలో కొందరు 'అమ్మ'ను వెతకడానికి పూనుకున్నారు. ఆ నోటా ఈ నోటా పాకి అది చివరకు వాళ్లమ్మను చేరింది. దీనంతటికీ పట్టింది 24 గంటలే. అంటే కొన్నేళ్లుగా తాను వెతుకుతున్న అమ్మని ఆమె ఫేస్‌బుక్‌లో 24 గంటల్లోనే వెతుక్కోగలిగింది. అంతేకాదు జనవరి 15 కల్లా తన తండ్రిని కూడా కలుసుకోగలిగింది.

ఇన్నేళ్లుగా తనకీ ఆలోచన ఎందుకు రాలేదు అనుకుని ఆశ్చర్యపోతోంది లారీ. ఇంటర్నెట్‌లేని రోజుల్లో దత్తత తీసుకోబడిన చాలామందికి వారి అసలు తల్లిదండ్రులెవరో తెలుసుకోవడం కొంచెం..కాదు కాదు చాలా కష్టం. అయితే లారీ తన తల్లిదండ్రుల్ని కనుగొనడంతో ఇప్పుడు చాలామంది ఇదే బాట పడుతున్నారు. అయితే వాళ్లని దత్తత తీసుకున్న పేరెంట్స్‌కి ఇది పెద్ద సమస్య అవుతోంది. వాళ్లు అసలు తల్లిదండ్రులకే దగ్గరైపోతారేమోనని దత్తత తీసుకున్న వాళ్లు ఆందోళన చెందుతుంటే, తమ పిల్లల్ని ఆన్‌లైన్లో చూసి వారి గురించి తెలుసుకుని పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని పశ్చాత్తాపం చెందుతున్నారు అసలు తల్లిదండ్రులు.

రెండేళ్లు వెనక్కి వెళితే- లారీయే 19 ఏళ్ల క్రితం దత్తత ఇచ్చిన తన కొడుకుని 'మై స్పేస్' అనే మరో సోషల్ నెట్‌వర్క్ ద్వారా కలుసుకోగలిగింది. ఇప్పుడు లారీ తన కొడుకు, అమ్మ, నాన్న... అందరినీ కలవగలిగింది. ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడూ కలుసుకుంటారు. ఫేస్‌బుక్ ఉంది కాబట్టి ఎవరెక్కడుంటున్నారో తెలుసుకోవడం సులభమవుతోంది అంటున్నారు.

మెసేజ్ సేవ్ చేసింది...

న్యూయార్క్‌కి చెందిన 19 ఏళ్ల రోడ్నీ ఫేస్‌బుక్ సహకారంతో జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. అలా తప్పించుకున్న మొట్టమొదటి వ్యక్తి అతనే అని అక్కడి న్యాయవాదులు అంటున్నారు. 2009 అక్టోబర్‌లో ఓ మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తుల్ని గన్‌తో బెదిరించి ఎవరో దోచుకున్నారు. అయితే అంతకుముందు ఓ దొంగతనం కేసులో రోడ్నీ హస్తం ఉండడంతో ఇది కూడా తనే చేశాడని పోలీసులు భావించి అతన్ని జైల్లో పెట్టారు. దొంగతనాన్ని చూసిన వాళ్లు కూడా అది చేసింది రోడ్నీయే అని సాక్ష్యం చెప్పడంతో అతనికి శిక్ష ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే రోడ్నీకి తెలుసు నిజమేమిటో. కానీ అదెలా నిరూపించాలో తెలియలేదు.

చివరికి ఫేస్‌బుక్‌తో అది సాధ్యమైంది. ఆ దొంగతనం జరిగినప్పుడు రోడ్నీ మాన్‌హాటన్‌లోని తన తండ్రి అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు. ఆయన కంప్యూటర్ నుండి రోడ్నీ తన గర్ల్‌ఫ్రెండ్‌కి ఫేస్‌బుక్‌లో మెసేజ్ పంపించాడు. ఆ మెసేజ్‌ను రోడ్నీ తండ్రి కోర్టుకు సమర్పించాడు. జడ్జి కూడా ఫేస్‌బుక్ ఓపెన్ చేసి ఆ మెసేజ్ ఏ టైమ్‌కి వెళ్లిందో, ఏ 'ఐపి' అడ్రస్ నుంచి వెళ్లిందో పరిశీలించి రోడ్నీ తండ్రి ఐపి అడ్రస్ నుంచే వెళ్లిందని నిర్ధారించుకున్నాడు. ఒకే వ్యక్తి రెండు చోట్లా ఎలా ఉంటాడు అని అడిగి కేసు కొట్టి వేశాడు. మొత్తం మీద రోడ్నీని ఫేస్‌బుక్ అలా రక్షించింది. ఇంటర్నెట్‌లో మనం మెసేజ్‌లు పంపించినా, చాటింగ్ చేసినా, మెయిల్ చేసినా ఆ సమయం రికార్డు అవుతుంది. దాన్ని ట్యాంపర్ చెయ్యడం ఎవరి వల్లా కాదు. అందుకే ఇప్పుడది 'అథెంటిక్ ప్రూఫ్' అని న్యూయార్క్ పోలీసులు అంటున్నారు.

వైట్‌హౌస్ 'సెక్యూరిటీ'ని
బయట పెట్టింది...


మిచెల్లె, తరిక్ సలాహిలు వాషింగ్టన్ వాసులు. ఆ నగరంలోని 'బ్రేవో' అనే టెలివిజన్ చానల్ నిర్వహించే 'ది రియల్ హౌజ్‌వైవ్స్ ఆఫ్ డి.సి.' అనే రియాలిటీ షోలో ఎలాగైనా పాల్గొనాలని నిశ్చయించుకున్నారు ఈ జంట. అయితే ఆ షోలో పాల్గొనే అవకాశం రావడం అంత తేలిక కాదు. రాత్రికి రాత్రే ఇన్‌స్టంట్‌గా పాపులర్ అయిన వ్యక్తులకి మాత్రమే దాంట్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ. ఏదో ఒక వింత పనో కొంటె పనో చేస్తే తప్ప అప్పటికప్పుడే అంత పాపులారిటీ ఎలా వస్తుంది చెప్పండి? అందుకే అలాంటి పని ఒకటి చేయాలనుకున్నారు ఆ జంట. మన దేశ ప్రధాని గత ఏడాది నవంబర్‌లో అమెరికా సందర్శించినపుడు ఆయన గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు నవంబర్ 24 సాయంత్రం విందు ఇచ్చారు. ఆ విందుకి ఆహ్వానం కొద్దిమంది ప్రముఖులకి తప్ప మరెవరికీ ఉండదు.

అయినా దానిలోకి ఆహ్వానం లేకుండా చొరబడాలనుకున్నారు. అనుకోవడమే కాదు, అంత పని చేసి చూపించారు కూడా. అమెరికా అధ్యక్ష భవనం సెక్యూరిటీని కూడా దాటుకుని ఎలాగైతేనేం లోపలికెళ్లారు. బరక్ ఒబామాతోటి, ఇతర ప్రముఖులతోటి కరచాలనాలు, పలకరింపులు లాంటివి జరిగాయి. అందరు నాయకులతోటి ఫోటోలు కూడా దిగారు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోలన్నీ మిచెల్లె ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది. వైట్‌హౌస్ సెక్యూరిటీ ఎంతబాగా పనిచేస్తోందో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోవడమే కాకుండా మిచెల్లె, తరిక్ సలాహీలు సెలబ్రిటీలయిపోయారు. ఫేస్‌బుక్‌లో వాళ్లకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అనుకున్నట్టుగానే వాళ్లు ఆ రియాలిటీ షోలో పాల్గొనడానికి ఎంపికయ్యారు.

అంత ఆసక్తి పనికి రాదు...

హాలిడేస్‌లో మనం ఎక్కడెక్కడ తిరిగామో, ఏయే ప్రదేశాలు సందర్శించామో... ఎంత ఎంజాయ్ చేశామో... ఆ వింతలూ విశేషాలూ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌తో అప్పటికప్పుడే పంచుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చెయ్యొచ్చు, వాటి గురించి రాయొచ్చు. అందరిలాగే అదే పని చేశాడు మ్యాక్సి సోపో. ఆ విశేషాలే ఆయన్ని జైలు పాలు చేశాయి. అమెరికాలోని సీటిల్‌కి చెందిన 26 ఏళ్ల సోపో ఓ బ్యాంకు నుండి రెండులక్షల డాలర్లు కాజేసి మెక్సికో పారిపోయాడు. తన వద్ద ఉన్న డబ్బుతో అక్కడ తెగ ఎంజాయ్ చేశాడు. చేస్తే చేశాడు కాని ఆ విశేషాలన్నీ ఎవరికీ చెప్పకుండా ఉంటే బాగుండేది. కాని సోపో మాత్రం 'నేను స్వర్గంలో ఉన్నాన'ంటూ ఫేస్‌బుక్‌లో తన విహార యాత్ర విశేషాలన్నీ రాశాడు. అంతటితో ఆగకుండా ఆ విశేషాల్ని సాధ్యమైనంత ఎక్కువమందితో పంచుకోవాలనుకుని ఫేస్‌బుక్‌లో ఎవరిని పడితే వారిని ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేర్చుకుని ఆ విశేషాలన్నీ తెలిపాడు. ఐతే సోపో అమెరికా న్యాయశాఖ అధికారి ఒకాయన్ని కూడా ఫ్రెండ్స్ లిస్ట్‌లో చేర్చుకోవడంతో ఆయన సోపో గురించి ఆరాతీశాడు. చివరికి సోపోని మెక్సికోలో అరెస్టు చేసి అమెరికా తీసుకొచ్చారు.

గ్రూప్ తెచ్చిన కష్టాలు....

ఒక దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగేంత కెపాసిటీ ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌కి ఉందో లేదో కాని క్రొయేషియా ప్రధాని మాత్రం ఆ గ్రూప్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. ఆ దేశ ప్రధాని ఇవో శానాడర్‌ను 'ఇష్టపడని వాళ్లని కనీసం 5000 మందినన్నా కూడగడతాను' అనే పేరుతో ఓ ఫేస్‌బుక్ గ్రూప్‌ను 22 ఏళ్ల నిక్సా క్లెకాక్ అనే యువకుడు ప్రారంభించాడు. ఆ విషయం ప్రభుత్వాధికారులకి తెలిసి ఆయన్ని అరెస్టు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రభుత్వం హరించి వేస్తున్నదని జనం ఆ అరెస్టుని నిరసించారు.

అయితే అరెస్టుకి కారణం క్లెకాక్ ఆ గ్రూప్‌ని మొదలుపెట్టడం కాదని, ఆ గ్రూప్‌లో ఉంచిన ప్రధాని ఫోటో గురించి అని చెప్పారు. నాజీ యూనిఫార్మ్‌లో ఆయన ఫోటో పెట్టాడు. కాబట్టి ప్రధానిని ఆ డ్రస్‌లో చూపడం నేరమని అన్నారు. చివరికి తేలిందేమిటంటే ఆ గ్రూప్‌లో చేరిన వాళ్లలో ఎవరో ఆ ఫోటోని పెట్టారని, క్లెకాక్‌కి దానితో ఏ సంబంధం లేదని. అయితే అప్పటికే ఆ యువకుడు జైలుకెళ్లాల్సి వచ్చింది.

ఆఫీస్‌కి డుమ్మా కొడితే....

21 ఏళ్ల కైల్ డాయిల్ 2008 అక్టోబర్‌లో ఓ రోజు ఫేస్‌బుక్ ఓపెన్ చేసి తన స్టేటస్ మెసేజ్‌లో 'ఫుల్‌గా తాగాను...అందుకే ఆఫీసుకి పోవట్లేదు' అని రాసుకున్నాడు. ఆస్ట్రేలియాకి చెందిన డాయిల్ ఒక కాల్ సెంటర్ ఉద్యోగి. మీ సీక్రెట్‌లు ఇతరులకి తెలిస్తే దానికి మేం బాధ్యులం కాదు అని ఫేస్‌బుక్ పదేపదే పేర్కొంటున్నా డాయిల్ లాంటి చాలామంది తామేం చేసినా ఫేస్‌బుక్‌లో రాసుకుంటున్నారు. ఒంట్లో బాగోలేదని ఆఫీస్‌కి సెలవు పెట్టిన డాయిల్ ఫేస్‌బుక్ పేజ్‌ని ఆఫీస్‌లో వాళ్లు చూశారు.
అనారోగ్యం సాకుతో శెలవు తీసుకున్నాడని గ్రహించి జీతంలో కోత విధించారు. అయితే ఫేస్‌బుక్‌లో తాను అలా రాసినందువల్లే జీతంలో కోత పడిందని డాయిల్‌కి తెలీదు. అకారణంగా తన జీతంలో కోత విధించారని, తాను అనారోగ్యం వల్లనే ఆఫీస్‌కి రాలేదని బుకాయించాడు. అప్పుడు తాను ఫేస్‌బుక్‌లో రాసిన దాన్ని తీసి ఆయనకే మెయిల్ చేశారు. జీతంలో కోత పడినా డాయిల్‌కు మాత్రం కొందరు ఫాన్స్ దొరికారు. ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఫేస్‌బుక్ గ్రూపులు కూడా మొదలు పెట్టారు.

లాగవుట్ చెయ్యకపోతే
అంతే మరి...


ఫేస్‌బుక్‌కి ఎంతగా బానిస అయిపోయినా దొంగతనానికి వెళ్లినపుడు ఆ పనేదో చూసుకోవాలి కాని కంప్యూటర్ కనపడిందని ఫేస్‌బుక్‌లోకి ఎంటరైపోకూడదు. రోమ్‌లో జొనాథన్ పార్కర్ అనే దొంగ ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. కంప్యూటర్ కనిపించడంతో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. అయితే దొంగతనం చేయాలనే హడావిడిలో లాగ్అవుట్ చెయ్యడం మర్చిపోయి వెళ్లిపోయాడు. తర్వాత సీన్‌లోకి ఎంటరైన పోలీసులు ఆ ఫేస్‌బుక్ ఎకౌంట్ ఓపెన్ చేసి ఉండడం చూసి ఆయనే దొంగ అని నిర్థారించుకుని దాంట్లో ఉన్న వివరాల ద్వారా ఎలాగైతేనేం ఆయన్ని పట్టుకున్నారు.

పార్టీలకెళ్తే...హెల్త్ ఇన్సూరెన్స్
ఎలా వస్తుంది?


ఉద్యోగులు, ఉద్యోగార్థులు తమ ఆన్‌లైన్ ఇమేజ్‌ని కాపాడుకోవాలని, తమకి సంబం«ధించినంత వరకు ఎలాంటి నెగటివ్ విషయాలు ఎక్కడా రాకుండా ఉండాలని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా ఇరుక్కుపోతారు. అలాగే దొరికిపోయింది నటాలీ బ్లెంకార్డ్ అనే కెనడాలోని క్యుబెక్ వాసి. పని వత్తిడి వల్ల డిప్రెషన్‌కి లోనయ్యానని, అందుకు గాను తనకు రావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని అప్లయ్ చేసుకొంది. అయితే ఆమె ఆ శెలవు రోజుల్లో పార్టీలకి, ఫంక్షన్లకి తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఆ ఫోటోలని ఫేస్‌బుక్‌లో పెట్టింది. ఆ ఫొటోలని చూసిన ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె ఇప్పుడు కోర్టుకెక్కింది. మరి కోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.

'మా మంచి అమ్మ'గా ఉంటే అంతే

అమెరికాలోని ఒహయోలోని ఓ స్కూల్లో పార్ట్ టైం టీచర్‌గా పనిచేసే మేరీ ఎలెన్ హౌస్ మంచి అమ్మగా ఉండాలనుకుందో ఏమో తన కొడుకుతో పాటు మరో ముగ్గురు విద్యార్థులు తన ఇంట్లో మందు తాగడానికి పర్మిషన్ ఇచ్చేసింది. అయితే ఆ టీనేజ్ స్టూడెంట్స్ పార్టీ చేసుకుని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. విద్యార్థులు ఆన్‌లైన్లో ఏయే వెధవ వేషాలేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉన్న ఆ స్కూల్ రిసోర్స్ ఆఫీసర్ ఆ ఫొటోలు చూశాడు. తన ఇంట్లో మందు తాగనిచ్చినందుకు మేరీకి 30 రోజులు జైలు శిక్షతోపాటు 500 డాలర్ల ఫైన్ వేశారు.

అన్నీ అనుకున్నట్టు జరగవుగా. ఇలాంటి సంఘటనల వలనో లేదా రోజూ గంటల కొద్దీ ఫేస్‌బుక్‌లో గడపడం వల్ల బోర్ కొట్టిందో ఏమో ఇప్పుడు దాని నుంచి బయటపడాలనుకునే వారు కూడా ఎక్కువవుతున్నారు. అందుకే గూగుల్‌లో '"how to delete Facebook account'' అనే సెర్చ్‌లు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఈ జనరేషన్ అంతే. ఏ నెట్‌వర్క్‌లోనైనా చేరడం, అంతలోనే అది నచ్చక బయటికొచ్చేయడం అన్నీ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతున్నాయి.

ఫేస్‌బుక్ జనాభా ఎంత?

యాభై కోట్లు దాటిందని ఆ మధ్య పత్రికల్లో కూడా వచ్చింది. అవును... దాన్నే గనక ఒక దేశం అనుకుంటే జనాభా పరంగా అది ప్రపంచంలోనే మూడో పెద్ద దేశమవుతుంది. ప్రపంచంలోని ప్రతి నలుగురు నెటిజన్లలో ఒకరు ఫేస్‌బుక్ యూజర్. నిజానికి దానిది స్కూల్లో చేరే వయస్సే... అంటే జస్ట్ సిక్స్ ఇయర్స్. అవును పుట్టిన ఆరేళ్లకే ఈ సోషల్ నెట్‌వర్క్ అంతగా ఎదిగి ఇంటర్నెట్ సూపర్‌పవర్స్‌లో ఒకటిగా మారింది. హార్వర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ మార్క్ జూకర్‌బర్గ్ రూపొందించిన ఈ నెట్‌వర్క్ ఇప్పుడు ప్రపంచంలోనే మరే నెట్‌వర్క్‌కి లేనంతమంది యూజర్లని సంపాదించుకుంది. దీన్ని రూపొందించినపుడు జూకర్‌బర్గ్ వయసు 21 ఏళ్లు.

మైక్రోసాఫ్ట్ మనకి కంప్యూటర్లని చేరువ చేయడమే గాక వాటిని ఉపయోగించడం సులభతరం చేసింది. కావల్సిన సమాచారాన్ని గూగుల్ ఒక సెర్చ్‌తో మన కళ్లముందు ప్రత్యక్షమయ్యేలా చేసింది. యూట్యూబ్ మనల్ని వీడియోలతో ఎంటర్టెయిన్ చేస్తూనే ఉన్నది. అయితే ఫేస్‌బుక్ అలాకాదు. మనల్ని కంప్యూటర్‌కి అతుక్కుపోయేలా చేస్తుంది. మన భావాల్ని వ్యక్తపరచడానికి, కొత్త స్నేహాల్ని ఏర్పరచుకోవడానికి, పాత స్నేహితుల్ని వెదుక్కోవడానికి అదో అవకాశంగా మారింది. అందుకే ఎప్పుడో స్కూల్లో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహాల గురించి ఆరా తీయాలన్నా ఇప్పుడు జనమంతా మరోమారు ఆలోచించకుండా ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేస్తున్నారు.

13 ఏళ్లు దాటితే చాలు

13 ఏళ్లు దాటిన వాళ్లెవరైనా ఫేస్‌బుక్‌లో చేరొచ్చనడంతో హైస్కూల్ స్టూడెంట్స్ కూడా ఫేస్‌బుక్‌లో ఎకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. విద్యార్థులేం చేస్తున్నారో ఆరా తీయడానికి టీచర్లు... పిల్లలేం చేస్తున్నారో తెలుసుకోవడానికి తల్లిదండ్రులు... ఫ్రెండ్స్ గురించి తెలుసుకోడానికి తోటి వాళ్లు... ఇలా అన్ని వయసుల వాళ్లూ ఫేస్‌బుక్‌లో చేరుతున్నారు. అందుకే ఇప్పుడు నెటిజెన్లకి అది క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. ఎవరెక్కడున్నా, ఏం చేస్తున్నా ఆ విశేషాలన్నీ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమవుతున్నాయి.

ఇతరులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి, తొంగి చూసే అలవాటు ఎంతో కొంత అందరిలోనూ సహజంగా ఉండేవే కాబట్టి అలాంటి వారందరూ ఫేస్‌బుక్‌లో ఎదుటివాళ్ల గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. ఫేస్‌బుక్ జనాభా పెరుగుతున్నట్టే దాంట్లో తమ సొంత విషయాల్ని పేర్కొనడం కూడా ఎక్కువైంది. ఇంతకు ముందు వ్యక్తిగతం అనుకున్న చాలా విషయాలు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో రాస్తున్నారు. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరి ఫేస్‌బుక్ ఎకౌంటూ ఒక్కో ఓపెన్ డైరీ. ఉద్యోగులు తమ బాస్‌ల గురించి, విద్యార్థులు లెక్చరర్ల గురించి కామెంట్లు రాయడానికి ఫేస్‌బుక్‌నే ఎంచుకొంటున్నారు.

ఈ మెయిల్‌లా కాకుండా ఫేస్‌బుక్‌లో రాసిన వాటిని ఎవరైనా చూడొచ్చు. సగటున ఒక్కొక్కరూ కనీసం గంట సేపు ఫేస్‌బుక్ వాడుతున్నారు. రోజుకి కోట్లలో మెసేజ్‌లు రాస్తున్నారు. వారానికి పదికోట్ల కొత్త ఫొటోలొచ్చి ఫేస్‌బుక్‌లో చేరుతున్నాయి. పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు దగ్గర్నుంచి వీకెండ్ పార్టీల దాకా ఏ చిన్న విశేషమైనా దాని ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టడం, వాటి సంగతుల్ని వివరించడం ఇప్పుడు నెటిజన్లకి ఫేవరైట్ పాస్‌టైం. అయితే ఒక్కోసారి ఆ ఫోటోలు, మనం రాసే రాతలే మనల్ని ఇరకాటంలో పెట్టొచ్చు. ఒక్కోసారి మనల్ని రక్షించనూ వచ్చు. అందుకే ప్రైవసీ గురించి కొత్త చర్చని లేవనెత్తింది ఫేస్‌బుక్. దాచుకోవడం నుంచి ప్రదర్శించడం వైపు ఆ చర్చ మళ్లింది.