Showing posts with label Tsunami. Show all posts
Showing posts with label Tsunami. Show all posts

Saturday, April 23, 2011

జపాన్‌.. పడుతూ.. లేస్తూ..!! ఎదగడం.. కిందపడటం.. మళ్ళీ లేవడం.. అలవాటు చేసుకున్న దేశం.


japan

japan-5 
జపాన్‌ ఆటు పోట్లను అలవాటు చేసుకున్న దేశం. ఎదగడం.. కిందపడటం.. మళ్ళీ లేవడం.. ఈ ప్రవృత్తి వారి నిత్యదైనందిన జీవితంలోనూ ప్రతిఫలిస్తుంటుంది. జపనీయులు భవనాల మెట్లు ఎక్కడం.. దిగడం ఒక హాబీగా చేస్తారు. అందుకే అధికారిక కార్యక్రమాల్లో సైతం కొన్ని మీటింగులు ఒక ఫ్లోర్‌లో, మరికొన్ని సమావేశాలు మరో ఫ్లోర్‌లో పెట్టుకుంటారుట. లిఫ్ట్‌ వాడకుండా మెట్లు ఎక్కుతూ, దిగుతూ... ఆడుతూ, పాడుతూ విధులు నిర్వర్తిస్తుంటారని ప్రతీతి. వారి ఈ ప్రవృత్తి విధి రూపంలో వారితో ఆడుకుంటున్నదని అంటారు. అభివృద్ధిలో ఆకాశపుటంచులకు వెళ్లడం.. మానవ ప్రకోపమో.. ప్రకృతి ప్రకంపనమో.. వారిని అధఃపాతాళానికి తోసెయ్యడం.. మళ్ళీ కొండంత బలంతో పైకెదగడం.. జపాన్‌కు ఇదొక నిరంతర జీవన క్రీడగా మారిపోయింది.


japan1కనీసం అయిదు నిమిషాలకు ఒకసారి జపాన్‌లో భూమి కంపిస్తూ ఉంటుంది. అలాగే జపాన్‌ చుట్టుపక్కల కనీసం 200 అగ్ని పర్వతాలున్నాయి. ఇవి ఇరవై నాలుగ్గంటలూ కుతకుతలాడుతూ ఉంటాయి. ఇన్ని ఉపద్రవాల కుంపట్ల మీద జపాన్‌ పడుతూ లేస్తూ ప్రపంచ పరుగు పందెంలో ముందుకు సాగుతుంటుంది. పసిఫిక్‌ మహా సముద్రంలో 6,852 ద్వీపాలున్న ద్వీప సమూహం జపాన్‌. పసిఫిక్‌ మహాసముద్రంలోని సున్నితమైన ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతంలో ఉన్న జపాన్‌ భూకంపాలకు పెట్టింది పేరుగా ముద్రపడింది. అగ్నిపర్వతాల అంచున ఉంటుంది. విశేషమేమిటంటే ప్రపంచంలోనే అత్యధిక మెట్రోపాలిటన్‌ జనాభా గల ప్రాంతంగా గ్రేటర్‌ టోక్యో పేరు గాంచడం. అంతేనా, ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఆయుఃప్రమాణమే కాక అతితక్కువ శిశు మరణాలు కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన దేశం జపాన్‌. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్ధిక వ్యవస్థగా, అత్యంత కొనుగోలు శక్తి ఉన్న పౌరులు గల దేశంగా జపాన్‌ ముందుంది.

japan-3ప్రపంచం ఎగుమతులలోనూ, దిగుమతులలోనూ కూడా నాలుగవ స్థానంలో ఉన్నది. సాంకేతికంగా ఎంతో వృద్ధిని సాధించినా నిరంతరం ప్రకృతి ధాటికి భయపడుతూనే ఉంటారు జపనీయులు. ప్రపంచ పురాతన నాగరికతలలో జపాన్‌ ఒకటి. పాత రాతియుగంలోనే జపాన్‌లో మానవులు ఆవాసాలు ఏర్పరచుకున్నట్టు చారిత్రిక ఆధారాలున్నా యి. అంటే 30,000 బి.సి.లోనే అక్కడ మనుషులు ఉన్నారు. అంతటి పురాతన చరిత్ర, నాగరికత కలిగిన జపాన్‌ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్ర జాస్వామిక ఒరవడిలోకి అడుగిడేందుకు నిర్ణయించుకుని 1947లో నూతన రాజ్యాంగాన్ని ప్రకటించుకుంది. ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన రాచరికపు వ్యవస్థగా కొనసాగుతున్నది. రాజు దేశాధిపతి అయినా అలంకారప్రాయమే.. అధికారాలన్నీ డైట్‌ (పార్లమెంటు) ఎన్నుకున్న ప్రధాని చేతిలోనే ఉంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా అమెరికాలోని పెర్ల్‌ హార్బర్‌పై దాడి చేసి ఆ దేశాన్ని కూడా యుద్ధంలోకి లాగిన జపాన్‌.. హిరోషిమా, నాగసాకిపై దాడి అనంతరం యుద్ధం జోలికి వెళ్ళరాదని ఒట్టు పెట్టుకున్నది. అయినప్పటికీ అత్యంత ఆధునికమైన సైన్యాన్ని జపాన్‌ కలిగి ఉండటం విశేషం.

japan-4హిరోషిమా, నాగసాకి దాడి, పునర్నిర్మాణం: రెండవ ప్రపంచ యుద్ధ చివరి దశలో అంటే 1945 జులై 26న చేసిన పాట్స్‌ డామ్‌ ప్రకటనలో లొంగిపోవలసిందిగా జపాన్‌ను అమెరికా హెచ్చరించింది. అ యితే జపాన్‌ ప్రభుత్వం ఈ హెచ్చరికను పెడచెవిన పెట్టడంతో నాటి అమెరికా అధ్యక్షడు హారీ ఎస్‌. ట్రూమన్‌ ఉత్తర్వుల మేరకు అమెరికా దళాలే 1945 ఆగస్టు 6వ తేదీన హిరోషిమాపై ‘లిటిల్‌ బాయ్‌’ అనే అణు బాంబును వేశాయి. మూడు రోజుల అనంతరం అంటే ఆగస్టు 9వ తేదీన ‘ఫ్యాట్‌మాన్‌’ అనే అణ్వాయుధాన్ని నాగసాకిపై విడిచారు. ఈ దాడులకు ఆరు నెలల ముందు దాదాపు 67 జపాన్‌ నగరాలపై అమెరికా ఉధృతంగా బాంబు దాడులు నిర్వహించింది. హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణు బాంబు దాడులు జరిపిన మొదటి నాలుగు నెలలోనే హిరోషిమాలో 90 వేల నుంచి 1లక్ష 66వేల మంది మరణించగా, నాగసాకిలో 60వేల నుంచి 80 వేల మంది మరణించారని, ఇందులో సగానికి సగం మంది దాడులు జరిగిన తొలి రోజే మరణించారని అంచనా. ఆ రోజు మరణించిన వారిలో 60శాతం మంది బాంబు దాడుల కారణంగా చెలరేగిన మంటల బారిన పడి మృతి చెందగా, 30 శాతం మంది భవనాలు కూలిపోయి, 10 శాతం మంది ఇతర కారణాల చేత మరణించినట్టు హిరోషిమా ఆరోగ్య శాఖ తేల్చింది. తర్వాత మరణించిన వారు కాలిన గాయాలు సెప్టిక్‌ అయ్యి, రేడియేషన్‌ సిక్‌నెస్‌కు గురైనవారు.

నాగసాకిపై దాడి జరిపిన ఆరు రోజుల అనంతరం అంటే ఆగస్టు 15వ తే దీన సంకీర్ణ శక్తులకు లొంగిపోతున్నట్టుగా జపాన్‌ ప్రకటించడం ద్వారా పసిఫిక్‌ యుద్ధానికి అంతిమంగా రెండవ ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికిం ది. ఈ బాంబు దాడుల దుష్ఫలితాలను చవి చూసిన జపాన్‌ మూడు అణ్వేతర సూత్రాలను పాటించాలని నిర్ణయించుకుని, అణ్వాయుధాలను నిషేధిం చింది. ఈ బాంబు దాడి నుంచి బయటపడిన వారిని జపనీస్‌లో హిబకుష అంటారు. అంటే పేలుడుతో ప్రభావితమైన వ్యక్తులు అని అర్థం.

japan-6 2010 మార్చి 31 నాటి లెక్కల ప్రకారం 2 లక్షల 27వేల 565మంది హిబకషులు జీవిస్తున్నారని జపాన్‌ ప్రభుత్వం లెక్కలు కట్టింది, అలాగే రెండు చోట్ల బాంబు దాడులను ఎదుర్కొ ని సజీవంగా ఉన్నవారిని ‘నిజు హిబకషు’గా పేర్కొం టారు. గత సంవత్సరం మరణించిన ట్సు టుమో యమగూచి ఒక్కడే నిజ హిబకషుగా జపాన్‌ ప్రభుత్వం గుర్తించింది. అతడు హిరోషిమాపై దాడి జరిగినప్పుడు ఈ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. దాడిలో కాలిన గాయాలైన అతడు ఆ రాత్రి హిరో షిమాలో గడిపి ఆగస్టు 8 నాటికి నాగసాకి చేరుకున్నాడు. మరునాడే అక్కడ బాంబు దాడి జరిగింది. తన బంధువుల కోసం వెతుకుతూ అతడు రెసిడ్యువల్‌ రేడియేషన్‌కు గురయ్యాడు.యుద్ధానంత రం హిరోషిమా, నాగసాకి పట్టణాల వైపు కొన్ని నెలల పాటు తొంగి చూసేందుకు కూడా వీలులేనంతగా ధ్వంసమవడమే కాక రేడియో యాక్టివేషన్‌ నెలకొంది. అయితేనేం పట్టబట్టి ఐదు సంవత్సరాలలో దానిని పునర్నిర్మించారు. పారిశ్రామిక నగరంగా నేడు హిరోషిమా అలరారుతోంది. ప్రముఖ కార్ల, మోటార్‌ సైకిళ్ళ ఉత్పత్తిదారు మజ్దా ప్రధాన కేంద్రం ఇక్కడే ఉన్నది.

japan-7 భూకంపాలు, సునామీలు: ప్రపంచంలోనే భూకంపాలు అధికంగా సంభవించే ప్రాంతం జపాన్‌. అగ్నిపర్వతాలు, సముద్రపు అగడ్తలు కలిగిన ప్రాంతంలో ఉన్న జపాన్‌లో కనీసం ఐదు నిమిషాలకు ఒకసారి అయినా భూమి కంపిస్తుంది. ప్రపంచంలో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 కన్నా ఎక్కువగా నమోదయ్యే భూకంపాలలో 20 శాతం ఇక్కడే సంభవిస్తుంటాయి. కోటి ఇరవై లక్షలమంది జనాభాకు పైగా కలిగిన టోక్యో నగరం యురేసియా, ఉత్తర అమెరికా, ఫిలిప్పీన్‌, పసిఫిక్‌కి సంబంధించిన నాలుగు టెక్టోనిక్‌ ప్లేట్ల కూడలిలో ఉంది. ఈ పొరలు ఏదైనా ఒకటి ఏ మాత్రం వంగినా, కదిలినా, విరిగినా వెంటనే భూకంపం సంభవిస్తుంది. గత నెలలో జపాన్‌ ఈశాన్య ప్రాంతంలో సంభవించిన భూకం పం తదనంతర సునామీలు 1995లో సంభవించిన కోబె భూకంపం కన్నా పెద్దది కావడమే కాక నాడు సంభవించిన దానికన్నా అధిక ప్రాణ నష్టం, ధన నష్టం సంభవించాయి.

రిక్టర్‌ స్కేల్‌పై 8.9గా నమోదైన భూకంపానంతరం సంభవించిన సునామీలో 10 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడి తీరప్రాంతంలోని పట్టణాలను, నగరాలను మింగివేసాయి. జపాన్‌ ఈశాన్య తీరంమైన సెందాయ్‌ సహా అనేక నగరాలు, దాదాపు పదకొండు పట్టణాలతోపాటు అనేక గ్రామాల ప్రజలు భూకంప తాకిడికి గురయ్యారు. హకై్కడో, ఆవ్‌మొరీ, ఇవా టే, మియోగి, యమగట, ఫుకుషిమా, ఇబరకి, తొచి గి, గుమ్మ, చిబ, కనగవ పట్టణాలలో మొత్తం 13,540 మంది మరణించగా, 16,963 మంది కనుపించకుండా పోయారు. ఇందుకు తోడుగా 5,253 మంది గాయపడ్డారు. సుమారు లక్షా 38 వేల మంది వ్యక్తులు పునరావాస కేంద్రాలలో ఉన్నారు. సునామీ కారణంగా ఉవ్వెత్తున లేచిన అలల కోరలు నౌకలను, కార్లను మింగివేయగా, ప్రధాన విమానాశ్రయాలను ముంచి వేశాయి. ఈ భూకంప సునామీలో 59వేల ఇళ్ళు నేలమట్టం కాగా, 17 వేల ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

japan-8ఇవి ప్రస్తుతానికి లెక్క తేలినవే. లెక్కించవలసినవి ఇంకా మిగిలే ఉన్నాయి. విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిన్నది. ఫుకుషిమా, దాయిచీ అణు విద్యుత్‌ కేంద్రాలలో రియాక్టర్ల పేలుడు సంభవించడంతో జపాన్‌లో మరోసారి రేడియేషన్‌ భయాలు పట్టుకున్నాయి. ఆ ప్రాంతానికి 30 కి.మీ. దూరం లో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలను అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందిగా జపాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నష్టాన్ని నివారించే ప్రయత్నం చేసింది. జపాన్‌ యుద్ధానంతర 65 ఏళ్ళ చరిత్రలో ఇది అత్యంత తీవ్రమైన సంక్షోభమని ప్రధాన మంత్రి నవాటో కాన్‌ పేర్కొనడం గమనార్హం. అయితే ఈ సంక్షోభాన్ని అధిగమించగలమని ఆత్మవిశ్వాసంతో చెప్పడం ద్వారా జపనీయుల ఆత్మవిశ్వాసపు స్థాయిని ప్రదర్శించారు. జపాన్‌ ప్రజల క్రమశిక్షణ ఎటువంటిదో ఈ సందర్భంగా ప్రపంచానికి చాటిచెప్పారు. ఆహారం, మంచినీరు వంటివి రోజుల తరబడి లభ్యం కావని తెలిసి కూడా అక్కడ తోపులాటలు కానీ గొడవలు కానీ జరుగలేదు. వారు షాపులో ఉండగానే కరెంటు పోయినప్పటికీ ఒక్క వస్తువు అదృశ్యం కాలేదు. లూటీలు, గొడవలు, గందరగోళాలు మచ్చుక కూడా కానరాకపోవడం జపాన్‌ ప్రజలలో ఉన్న ఐక్యతా స్ఫూర్తికి చిహ్నంగా చెప్పుకోవచ్చు.

జపాన్‌లో దాదాపు 55 అణు విద్యుత్‌ రియాక్టర్లు ఉన్నాయి. 61 శాతం ఇంధనం ఈ ‚రియాక్టర్ల నుంచే ఉత్పత్తి అవుతుంది. సునామీ అనంతరం ఫుకుషిమాలోని దాయిచీ అణుకేంద్రంలో సంభవించిన ప్రమాదంతో జపాన్‌లో ఆరింటిని నిలిపివేశారు. తొలిసారి జపాన్‌లో అణు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సునామీ కారణంగా దాయిచీతో పాటుగా మరి కొన్ని రియాక్టర్లను తాత్కాలికంగా నిలిపివేయడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఒకవైపు భూకంపం కారణంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినగా మరోవైపు ఉత్పాదన లేకపోవడం వల్ల కూడా అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దాదాపు 4,50,000 గృహాలకు విద్యుత్‌ లేక అల్లాడుతున్నారు. ఒకవైపు అణు విద్యుత్‌ కేంద్రాలు సునామీకి దెబ్బతినగా విద్యుత్‌ టరె్బైన్లు మాత్రం ఏ మా త్రం చెక్కు చెదరలేదు.

japan-9 2010 చివరి నాటికి జపాన్‌ 2304 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 1746 విండ్‌ టరె్బైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ వాయు టరె్బైన్లు జాతీయ విద్యుత్‌ సరఫరాకు తోడ్పడుతున్నాయి. అణువిద్యుత్‌కన్నా విండ్‌ ఎనర్జీపై ఆధారపడడం అన్ని రకాలా శ్రేయస్కరమనే వాదనలు వినిపిస్తున్నాయి. జపాన్‌ అణు సంక్షోభం కారణంగా ప్రపంచ వ్యాప్తం గా అక్కడ గ్యాస్‌కు డిమాండ్‌ పెరుగుతుందని దీనితో సహజవాయువు ధరల రెండేళ్లలో మొదటిసారి చుక్కలనంటుతాయని నిపుణు లు ఇప్పుటికే హెచ్చరిస్తుండడంతో యుకె సహా పలు దేశాలు కలవరం చెందుతున్నాయి. సునామీ ప్రభావిత ప్రాంతంలో ఉన్న టయో టా, నిస్సాన్‌, హోండా వంటి ఆటోమొబైల్‌ కంపెనీల కేంద్రాలతో పాటు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఉత్పత్తి చేసే సోనీ సహా నిప్పన్‌, పానాసోనిక్‌, ఫుజి వంటి అనేక కంపెనీల ఉత్పత్తి కేంద్రాలు అనేకం దెబ్బతినడంతో ఆయా చోట్ల ఉత్పత్తిని నిలిపివేశాయి. జపాన్‌ ఆర్థిక వ్యవస్థకు అధికంగా దోహదం చేస్తున్న పరిశ్రమలు ఇవి.

పునర్నిర్మాణం: గత నెల 11న సంభవించిన భూకంపం తీ వ్రత దాదాపు 140 ఏళ్ళలో ఇదే తొలిసారి. 1995లో కోబె నగరంలో సంభవిం చిన భూకంప విధ్వంసం, నష్టాన్ని వందబిలియన్‌ డాలర్లుగా లెక్కకట్టారు. మొన్నటి వరకూ ప్రపం చంలో నే అతిఖరీదైన ప్రకృతి వైపరీత్యంగా దానిని అభిర్ణించారు. కానీ దానిని ఇది మించిపోయింది. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు, పునర్నిర్మాణానికి సుమారు 309 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని జపాన్‌ అంచనా వేసింది. పునర్నిర్మాణానికి, ఈ నష్టం నుండి తేరుకోవడానికి జపాన్‌కు కనీసం మరో ఐదేళ్ళు పడుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ఫుకుషిమా రియాక్టర్లలో రేడియేషన్‌ను అంచనా వేసేందుకు జపాన్‌ ప్రస్తుతం రిమోట్‌ కంట్రోల్‌ రోబోలను వాడుతున్నది.

japan-10అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం కారణంగా ఇప్పటికే జపాన్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిని ఉ న్నది. గత సంవత్సరం చివరి మూడు నెలలలో దాని ఆర్థిక వృద్ధి రేటు 1.3శాతం కుం గిన నేపథ్యంలో చైనా దానిని అధిగమించి ప్రపం చంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దెబ్బ మీద దెబ్బలా సునామీ కారణంగా ఏర్పడిన నష్టం నుంచి తేరుకోవడానికి జపాన్‌కు ఇంకా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో జపాన్‌ ప్రజలపై పన్నుల భారం తీవ్రంగానే పడనుంది. 1997 తర్వాత తొలిసారి పన్నుల పెంపు గురించి ప్ర భుత్వం ఆలోచిస్తున్నప్పటికీ 70శాతం మంది ప్రజలు పన్నులు కట్టేందుకు సిద్ధం గానే ఉ న్నారని సర్వేలు చెబుతుండడం విశేషం. సంక్షోభం వచ్చింది కనుక ప్రభుత్వమే తమ ను ఆదుకోవాలి తప్ప తామేం చే యమనే తత్వం జపాన్‌ ప్రజలలో లేకపోవడం అభినందనీయం. క్రమశిక్షణకు మారుపేరై న జపనీయులు అవసరమైతే ఎంతటి కఠిన శ్రమ కైనా ఓర్చి తమ కు వాటిల్లిన నష్టాన్ని పూడ్చుకోగలరని రెండవ ప్రపంచయుద్ధానం తరం నుంచీ రుజువు చేస్తూనే ఉన్నారు. ఈసారీ అదే జరుగుతుందని ఆశిద్దాం.

వారోత్సవాలతో ఎనలేని ఉత్సాహం
radiation-burnsజపాన్‌ చక్రవర్తి పుట్టిన రోజు ఈ నెల 29న. ప్రతి ఏడాది ఆయన జన్మ దినాన్ని జాతీయ దినోత్సవంగా అధికారికంగా జరిపేవారు. కొన్నేళ్ల క్రితం దాన్ని మార్చారు. ఏప్రిల్‌ 29 నుంచి మే నెల మూడో తేదీ దాకా స్వర్ణ వారోత్సవం (గోల్డెన్‌ వీక్‌ )గా జరుపుతున్నారు. జపాన్‌ దేశాన్ని స్వర్ణయు గంలోకి తీసుకెళ్లే ఏకైక ధ్యేయంతో ఈ వారోత్సవాలకు రూపకల్పన చేశా రు. నిత్యం భూకంపాలతో, అగ్నిపర్వతాల భయోద్వేగాలతో గడిపే జపనీ యుల్లో దేశభక్తి స్ఫోరక భావాలను నింపడం ద్వారా వారిని ఆ భయోత్పా తాలు దరి చేరకుండా ఉండేందుకే వీటిని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ 29వ తేదీని జపాన్‌ చక్రవర్తి పుట్టిన రోజు గుర్తుగా జాతీయ దినోత్సవంగా జరు పుతారు. అలాగే మే మూడో తేదీని రాజ్యాంగ పరిరక్షణ దినంగాను, నాలుగో తేదీని గ్రీనరీ డే గా జరుపుతా రు. జపాన్‌ చక్రవర్తులు ప్రకృతి ప్రేమికులన్న దానికి గుర్తింపుగా దీన్ని జరుపు తారు. ఇక అయిదో తేదీని బాలల దినోత్సవం. తల్లిదండ్రులు త మ పిల్లల భవిష్యత్తు కోసం దేవుణ్ణి ప్రార్ధిస్తారు.

సునామీ తర్వాత ఇప్పుడి ప్పుడే కోలుకుంటున్న జపాన్‌ ఈ స్వర్ణ వారోత్సవాలను జాతి పునర్నిర్మా ణానికి సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. సునామీకి దారు ణంగా దెబ్బతిన్నామని దీనంగా దైన్యం గా కూర్చోకుండా ఈ ఉత్సవాల ద్వారా రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చుకుని, పని చేయాలని జపాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా జాతి జనులనుసమాయత్తపరుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అతిపెద్ద భూకంపాలు, సునామీలు
2001 జూన్‌: పెరూ దక్షిణ ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 8.4 తీవ్రత కలిగిన భూకంపం కారణంగా వచ్చిన సునామీలో వందల మిలియన్‌ డాలర్ల మేరకు నష్టం సంభవించింది.
2004 డిసెంబర్‌ 26: సుమాత్రా దీవులలో సంభవించిన భూకంపం అనంతర సునామీల కారణంగా భారత్‌తో సహా పలు దేశాలలో వేలాది మంది మరణించారు. తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 9.0గా నమోదైంది.
2006, జులై: ఇండొనేషియాలోని పడమర జావాలో సంభవించిన భూకంపం తదనంతర సునామీలో 668 మంది మృతిచెందగా, 74వేల మంది నిర్వాసితులయ్యారు.
2007, జనవరి: జపాన్‌లోని ఉత్తర ప్రాంతంలోనూ, రష్యాలోని కురిల్‌ ద్వీపంలోనూ సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా సునామీ వస్తుందనే భయంతో వేలాది మంది ఆ ప్రాంతాలను విడిచి పారిపోయారు. నాటి భూకంప తీవ్రత 8.3.
2007, ఏప్రిల్‌: సాలమన్‌ ద్వీపంలో సంభవించిన భూకంపం అనంతర సునామీలో 50మంది మరణించగా, వేలాదిమంది నిర్వాసితులయ్యారు. భూకంప తీవ్రత 8.0.
2009, సెప్టెంబర్‌: పసిఫిక్‌ ద్వీపమైన సుమోవాలో భూకంపం కారణంగా సంభవించిన సునామీలో 184మంది మరణించారు. భూకంప తీవ్రత 8.0.
2010, జనవరి: సాలమన్‌ ద్వీపంలోని పశ్చిమ ప్రాంతంలో సంభవించిన బలమైన భూకంపాల కారణంగా సునామీ సంభవించిన వెయ్యిమంది నిర్వాసితులయ్యారు. భూకంపాలు రిక్టర్‌ స్కేల్‌పై 6.5, 7.2లుగా నమోదయ్యాయి.
2010, ఫిబ్రవరి: చిలీలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా పసిఫిక్‌ తీర ప్రాంతాలలో హెచ్చరికలు జారీ అయ్యాయి.
2010, అక్టోబర్‌: సుమాత్రా దీవులలో సంభవించిన భూకంపం అనంతర సునామీలలో 509మంది మృతి చెందగా వేలాది మంది నిర్వాసితులయ్యారు. భూకంప తీవ్రత 7.2గా నమోదైంది.

జపాన్‌కు సంబంధించి కొన్ని విశేషాలు
- గుర్రం పచ్చి మాంసాన్ని జపాన్‌లో ఇష్టంగా తింటారు. దీనిని వండకుండా పచ్చిగానే తింటారు. దీనిని బసాషీ అని పిలుస్తారు.

-జపాన్‌ భూభాగంలో 70 శాతం కొండలు, పర్వతాలు ఉంటాయి. అంతేకాదు దేశంలో సుమారు 200 అగ్నిపర్వతాలు ఉన్నాయి.

-జపాన్‌లో అక్షరాస్యతా రేటు దాదాపు 100శాతం

-అక్కడ బీర్‌ కోసం ప్రత్యేకంగా వెండింగ్‌ మెషిన్లు ఉంటాయి.

-క్షమాపణను తెలిపేందుకు కొందరు పురుషులు గుండు గీసుకుంటారు.

-జపాన్‌ నుంచి 15మంది నోబెల్‌ గ్రహీతలు (కెమిస్ట్రీ, మెడిసిన్‌, ఫిజిక్స్‌), ముగ్గురు ఫీల్‌‌డ్స మెడల్‌ పొందిన వారు ఉన్నారు.

-జపాన్‌కు చెందిన సినీ నిర్మాత, దర్శకుడు తకహి మీకె తన కెరీర్‌ ఉచ్ఛదశలో దశాబ్దకాలంలో 50 సినిమాలు తీశాడు.

-ప్రపంచంలో యానిమేషన్‌కి సంబంధించిన వినోద చిత్రాలలో 60శాతం జపాన్‌ నుంచ వచ్చినవే.

- జపాన్‌లో 21శాతం జనాభా వృద్ధులే. ప్రపంచంలో ఇది అత్యధిక శాతం
1900 సం నుంచి జపాన్‌లో సంభవించిన భూకంపాలు- సునామీ
సంవత్సరం నగరం మృతుల సంఖ్య తీవ్రత సునామీ
 1995 కోబె  5,502   6.9 సునామీ
 1948 పుకుయి 3769  7.3  సునామీ
 1948 నంకైదో 1362  8.3 సునామీ
 1945 మికావా 1961  7.1 సునామీ
 1944 తొనంకాయ్‌ 998  8.1 సునామీ
 1943 టిట్టోరి 1,190  7.7 సునామీ
 1933 సన్‌రికు 3000  8.4 సునామీ
 1927 టాంగో 3020 7.6 సునామీ
 1926 కాంటో 1,42,800 7.9 సునామీ

-జి.పాంచజన్య

Wednesday, March 16, 2011

Japan Earthquake & Tsunami 2011

BBC flash news: Japan government confirms radiation leak at Fukushima nuclear plants. Asian countries should take necessary precautions. If rain comes, remain indoors first 24hours, close doors n windows, swab neck skin with beta-dine where thyroid area is, radiation hits thyroid first. Take extra precautions, radiation may hit Philippines starting 4pm (Pinas time) today! PLEASE PASS...

---News From BBC..

Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Japan Before and After a Disaster Sendai
Pictures from space showing the extent of the devastation in Japan.
1
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
2
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
3
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
4
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
5
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
6
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
7
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
8
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
9
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
10
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
11
Before
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives
After
Japan Earthquake & Tsunami 2011 - Phani Kiran: World Informatives

Received this from Roshan, Srilanka
-------------------

NUCLEAR RADIATION AND EFFECTS AT INDIA

IN THIS CONNECTION I RECALL OUR FATHER" S REMEMBERANCE OF 1945 NUCLEAR RADIATION OF THE TWO ATOMIC BOMBS DROPPED IN HIROSHIMA AND NAGASAKI. OUR COUNTRY ESPECIALLY SOUTH INDIA IS AFFECTED BY SUDDEN FEVER AND COUGHING BY ONE AND ALL. SKIN DISEASES LIKE ITCHING WAS PREVALENT IN MOST OF THE CHILDREN OF THAT YEARS AND HIGHER AGES.
WHAT IS THE REMEDY FOR THE SKIN DISEASES? ANY BODY KNEW CAN SEND THEIR REMEDIES PREFERABLY HERBAL METHOD.
I KNOW THE HERBAL MEDICINE BUT I WANT TO CREAT THE AWARES OF SUCH A MEDICINE IS AVAILABLE IN TAMIL NADU.
IN THIS CONNECTION I WANT TO SHARE ONE ANOTHER IMPORTANT EFFECT OF NUCLEAR RADIATION WHICH MOST OF OUR SCIENTISTS ARE AWARE BUT SUPPRESSED THE FACT.
AFTER OUR NUCLEAR TEST AT RAJASTHAN THE FOLLOWING SIDEEFFECTS HAPPENED
1.BOMBAY RESIDENTS WERE HAVING SUDDEN FEVER AND HEAD ACHE/
2.KARNATAKA RESIDENTS HAS HEAD ACHE AND VOMITTING
3. WE PEOPLE OF TAMIL NADU HAS ONE PECULIAR PROBLEM GUESS WHAT? YES WE HAD MADRAS

EYE PREVALENT FOR MORE THAN 3 YEARS AND CAN YOU NOW SEE ANY PEOPLE WITH MADRAS EYE. THEY MAY HAVE EYE PROBLEMS BUT THEY IMMEDIATELY BRAND IT AS MADRAS EYE.
SO FRIENDS BE READY TO FACE SKIN DISEASES AND EYE PROBLEM.
* SOUNDARA MUTHUKUMARAN, Chennai

Friday, March 11, 2011

జలవిలయం * పసిఫిక్ మహాసముద్రం అడుగున అత్యంత శక్తిమంతమైన భూకంపం కారణంగా పుట్టిన సునామీ జపాన్ ఈశాన్య తీరాన్ని కబళించింది

జపాన్‌పై పెను భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ
360 మంది మృతి.. 500 మంది గల్లంతు..
రిక్టర్ స్కేల్‌పై 8.9 తీవ్రతతో పసిఫిక్‌లో భూకంపం.. సెందాయ్ నగరాన్ని కబళించిన రాకాసి అలలు... కొట్టుకుపోయిన ఓడ, జాడతెలియని రైలు
టోక్యో సహా అన్ని నగరాలూ గజగజ.. విమానాశ్రయాలు, సబ్‌వేలు, రైళ్లు బంద్..
అణు అత్యవసర పరిస్థితి ప్రకటించిన జపాన్ ప్రధాని..
అమెరికా, రష్యా తీరాలు సహా 20 దేశాలకు సునామీ హెచ్చరికలు
భారత్‌కు సునామీ భయం లేదని కేంద్ర సర్కారు ప్రకటన


జపాన్‌పై పెను సునామీ పడగ విసిరింది. పసిఫిక్ మహాసముద్రం అడుగున అత్యంత శక్తిమంతమైన భూకంపం కారణంగా పుట్టిన సునామీ జపాన్ ఈశాన్య తీరాన్ని కబళించింది. దాదాపు 33 అడుగుల ఎత్తుకు ఎగసిన రాకాసి అలలు తీరంలోని మియాగి, ఫుకుషిమా రాష్ట్రాలను ముంచెత్తాయి. ఇళ్లు, రోడ్లు, పొలాలను ఏకం చేశాయి. అలల ధాటికి ఫ్లైఓవర్లు సైతం కుప్పకూలాయి. బోట్లు, కార్లతో పాటు పెద్దపెద్ద ఇళ్లు కూడా సునామీలో అగ్గిపెట్టెల్లా కొట్టుకుపోయాయి. సెందాయ్ నగరం నీటమునిగింది. రాజధాని టోక్యోతో సహా ప్రధాన నగరాలన్నింటిలో రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి, సరఫరా ఆగిపోయింది. సగం దేశం అంధకారంలో మునిగిపోయింది.



ఈ భూకంపం, సునామీల కారణంగా ఇప్పటివరకూ 360 మంది చనిపోయారని, మరో 500 మంది జాడ తెలియటం లేదని జపాన్ అధికారులు తెలిపారు. మరో 627మ మంది గాయపడ్డారు. సెందాయ్ నగరంలో దాదాపు 200 నుంచి 300 మృతదేహాలు లభ్యమయ్యాయి.


ఇవాటె రాష్ట్రంలో 60 మంది చని పోయారు. జపాన్ ఈశాన్య తీరంలో 100 మందితో ప్రయాణిస్తున్న ఓడ ఒకటి రాకాసి అలల్లో కొట్టుకుపోయింది. దాని జాడ ఇంకా తెలియరాలేదు. సెందాయ్-ఇషినోమాకి మధ్య ప్రయాణిస్తున్న ఒక పాసింజర్ రైలు జాడ కూడా తెలియటం లేదని, అందులో ఎందరు ప్రయాణికులు ఉన్నారన్న విషయమూ తెలియదని అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య 1000 వరకూ పెరిగే అవకాశముందని చెప్తున్నారు. 





మరోవైపు పసిఫిక్ తీరంలో అమెరికా, రష్యాలు సహా మరో 20 దేశాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్‌కు సునామీ ప్రమాదం లేదని హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ స్పష్టంచేసింది.


టోక్యో: నిత్యం భూకంపాలను చవిచూసే జపాన్ చరిత్రలో శుక్రవారం 8.9 రిక్టర్ స్కేలు తీవ్రతతో అతి పెద్ద భూకంపం సంభవించింది. ఆ దేశ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.46 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 11.16 గంటలకు) పసిఫిక్ మహాసముద్రంలో ఈ పెను భూకంపం సంభవించింది. జపాన్‌లోని హోన్షు దీవి తూర్పు తీరంలో గల సెందాయ్ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున 24 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రకం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం.. 1923లో టోక్యో పరిసర ప్రాంతాల్లో 1.40 లక్షల మందిని బలిగొన్న గ్రేట్ కాంటో భూకంపంకన్నా తీవ్రమైనది. నాటి భూకంపం 7.9 తీవ్రతతో జపాన్ ఆధునిక చరిత్రలో అతిపెద్ద భూకంపంగా రికార్డయింది. తాజా భూకంపం ధాటికి.. భూకంప కేంద్రానికి 373 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ రాజధాని టోక్యో కూడా కంపించిపోయింది. పెద్ద పెద్ద భవంతులు సైతం గడ్డిపోచల్లా వణికిపోవటం టీవీ చానళ్లలో ప్రసారమైంది. ప్రభుత్వం సైరన్లు మోగించటంతో ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వేలాది మంది టెర్మినళ్లలో చిక్కుకుపోయారు. లోకల్ రైళ్లు, సబ్‌వే వ్యవస్థలను నిలిపివేయటంతో లక్షలాది మంది ఇళ్లకు దూరంగా ఉండిపోయారు.


పెను భూకంపం వెంటనే మరిన్ని బలమైన ప్రకంపనలు కూడా సంభవించాయి. భారీ సునామీ ప్రమాదం గురించి నిపుణులు, ప్రభుత్వం ప్రజలను హెచ్చరించారు. జపాన్ తీరాన్ని మరో 15 నిమిషాల్లో సునామీ తాకుతుందన్న హెచ్చరికలు జారీచేసి, సైరన్లు మోగించటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోవటం వల్ల భారీగా ప్రాణనష్టం జరగలేదు. రాకాసి అలలు తమ దారిలో అడ్డొచ్చిన ప్రతిదాన్నీ తుడిచిపెట్టుకుంటూ ముందుకు సాగాయి. మియాగిలో నటోరి నది సమీపంలో ఒక జనావాస ప్రాంతాన్ని సునామీ ఎలా కబళిస్తోందో జపాన్ అధికారిక మీడియా సంస్థ ఎన్‌మెచ్‌కె ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచ ప్రజలకు చూపించింది. దాదాపు 10 లక్షల మంది నివసించే సెందాయ్ నగరాన్ని కూడా సునామీ కబళించింది. ఒక పాఠశాల భవంతి పైభాగంలో దాదాపు 600 మంది విద్యార్థులు చిక్కుకుపోయి కనిపించారు. టోక్యో టవర్ కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. ఇక్కడి చమురు శుద్ధి కర్మాగారం, ఉక్కు కర్మాగారాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భూకంపం, సునామీల నేపథ్యంలో మియాగి, ఫుకుషిమాల్లో అణు విద్యుదుత్పత్తి ప్లాంట్లు మూతపడ్డాయి.


ప్రభుత్వం అణు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అణు విద్యుత్ ప్లాంట్ల సమీపంలో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఒక అణు విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ.. అణుధార్మికత లీకవ్వటం వంటి అసాధారణ పరిస్థితులేవీ తలెత్తలేదని అధికారులు పేర్కొన్నారు. భూకంపం చాలా ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించినప్పటికీ అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని జపాన్ ప్రధానమంత్రి నవోటో కాన్ ప్రకటించారు. భూకంపం వల్ల నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.

 
ప్రపంచయుద్ధాన్ని తట్టుకున్నా సునామీ మింగేసింది

సెందాయ్ గాథ ఇదీ..


ఈశాన్య జపాన్ తీరంలోని సువిశాల సుందర నగరం సెందాయ్.... క్రీ.శ 1600లో మసామునే అనే భూస్వామ్యప్రభువు ఈ నగరాన్ని తన రాజధానిగా నిర్మించాడని చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇది మిత్రపక్షాల బాంబుదాడులను తట్టుకుని నిలిచింది. పాక్షికంగా దెబ్బతిన్న ఈ నగరాన్ని ఆ తర్వాత పునర్నిర్మించారు. అయితే ఇపుడు సునామీ సృష్టించిన విలయంలో ఈ నగరం సర్వనాశనమైపోయింది. భూకంప కేంద్రానికి అతి సమీపంలో ఉన్న సెందాయ్‌పై సునామీ ప్రభావం ఎక్కువగా ఉంది. పది లక్షల జనాభా ఉన్న సెందాయ్ నగరం ఈ ప్రాంతంలో ప్రధానమైన వాణిజ్య కేంద్రంగా ఉంది. జపాన్ రాజధాని టోక్యోకు ఈ నగరం దాదాపు 300 కి.మీ.దూరంలో ఉంది. నానాకిటా, హిరోస్ గవా నదుల మధ్య ఉన్న సెందాయ్ నగరం భౌగోళికంగా చాలా విలక్షణంగా కనిపిస్తుంది. ఈ నగరం తూర్పున విశాలమైన మైదాన ప్రాంతం ఉండగా పశ్చిమాన పర్వతశ్రేణులున్నాయి. వీటిలో ఎతె్తైన పర్వతం ఫునాగటా ఎత్తు 1500 మీటర్లు. సెందాయ్ నగరం ఈ ప్రాంతంలో కీలకమైన వాణిజ్య కేంద్రమే కాక రవాణాకు కూడా అతి ముఖ్యమైన నగరం. అంతేకాదు ఇది జపాన్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా ఉంది. ఇక్కడ అతిపెద్దదైన తొహుకు యూనివర్సిటీ సహా అనేక వర్సిటీలున్నాయి.

మన్మోహన్, ఒబామా సానుభూతి

భూకంపం, సునామీల్లో ఆప్తులను కోల్పోయిన జపాన్ ప్రజలకు భారతదేశం తరఫున ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సానుభూతి తెలిపారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొంటూ జపాన్ ప్రధానికి లేఖ రాశారు. జపాన్‌లో నివసిస్తున్న 25 వేల మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు జపాన్ ప్రజలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఇలాంటి కష్ట కాలంలో జపాన్‌కు సహాయ హస్తం అందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని చెప్పారు.




పసిఫిక్ దేశాలకు హెచ్చరికలు...

జపాన్ భూకంపం నేపథ్యంలో పసిఫిక్ సముద్రం చుట్టూతా రష్యా, దక్షిణ అమెరికా, అమెరికా పశ్చిమ తీరం, కెనడా, అలాస్కాల వరకూ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, తైవాన్, ఇండోనేసియాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఇండోనేషియా ఉత్తర తీరం నుంచి వేలాది మంది జనం ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అయితే.. ఉత్తర మాలుకు దీవులను కేవలం 10 సెంటీమీటర్ల ఎత్తున్న చిన్న అల మాత్రమే తాకిందని, దానివల్ల పెద్ద నష్టం సంభవించినట్లు వార్తలు రాలేదని అధికారులు తెలిపారు. కానీ.. దీని వెనుక మరింత పెద్ద అలలు వచ్చే ప్రమాదం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. హవాయ్ దీవుల్లోని వాయ్‌కికి తీరాన్ని కూడా చిన్నపాటి సునామీ అలలు తాకాయి.










చరిత్రలో విలయాలు..

1900 నుంచి ఇప్పటిదాకా ప్రపంచంలో సంభవించిన పెను భూకంపాలు, సునామీలు ఇవీ..
1906, జనవరి 31: ఈక్వెడార్, కొలంబియా తీరాల్లో 8.8 తీవ్రతతో భూకంపం. వెయ్యి మంది మృతి.
1923, సెప్టెంబరు 1: టోక్యోలో 7.9 తీవ్రతగల భారీ భూకంపం. 1.45 లక్షల మంది మృతి.
1950 ఆగస్టు: అసోం, టిబెట్ ప్రాంతంలో 8.6 తీవ్రత భూకంపం. 780 మంది మృతి.
1960, మే 21: చిలీలో 9.5 తీవ్రతతో అతి భారీ భూకంపం. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత తీవ్రతగల భూకంపం. ఈ విలయం 1,655 మందిని పొట్టనబెట్టుకుంది.
1964, మార్చి 27: అమెరికాలోని అలస్కాలో 8.4 తీవ్రతతో సముద్రగర్భంలో భూకంపం. సునామీలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం.

1976, ఆగస్టు: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో, సులు దీవుల్లో 8 తీవ్రత భూకంపం. 5 వేల మంది మృత్యువాత.
2004, డిసెంబరు 26: ఇండోనేిసియాలోని సుమత్రా దీవుల్లో 8.9 తీవ్రతతో భూకంపం. విరుచుకుపడ్డ సునామీ. ఇండోనేసియా, భారత్, తదితర దేశాల్లో 2 లక్షల 20వేల మందికిపైగా మృత్యువాత.
2005, మార్చి 28: ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో 8.5 తీవ్రతతో మళ్లీ భూకంపం. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం.
2008, మే 12: చైనా నైరుతిభాగంలోని వెంచుయాన్ కౌంటీలో 8.0 తీవ్రత భూకంపం. సుమారు 70 వేల మంది మృతి.
2010, ఫిబ్రవరి 27: దక్షిణ చిలీ ప్రాంతంలో సముద్రగర్భంలో 8.8 తీవ్రతతో భూకంపం. 300 మంది మృతి.





జపాన్‌కు ‘అణు’భయం
ఫుకుషిమా అణువిద్యుత్ ప్లాంటులో పేలుడు
 
పెను భూకంపం, సునామీ కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న జపాన్ మరో పెను విపత్తును ఎదుర్కొంటోంది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటులో పేలుడు సంభవించటంతో రేడియేషన్ విడుదలవుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే అణు రియాక్టర్ ఉన్న కంటైనర్‌కు ఎలాంటి ముప్పూ వాటిల్లలేదని ప్రభుత్వం చెప్తోంది. అయితే ప్లాంటు పరిసరాల నుంచి వేలాది మందిని ఖాళీ చేయించటం.. ప్లాంటు సమీపం నుంచి రక్షించిన ముగ్గురికి రేడియేషన్ సోకినట్లు నిర్ధారణ కావటం ప్రజల ఆందోళనను రెట్టింపు చేస్తోంది. మరోవైపు శుక్రవారం సంభవించిన భూకంపం, దానివెంట విరుచుకుపడిన సునామీల్లో మరణించిన వారి సంఖ్య 1,700కు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. మియాగి రాష్ట్రంలోని మినామిసాన్రికు పట్టణంలో దాదాపు 10,000 మంది గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. మరో నాలుగు రైళ్ల జాడ కూడా తెలియటం లేదు. సునామీతో దెబ్బతిన్న ప్రాంతాలకు సహాయ బృందాలు చేరుకోవటం కష్టమవుతుండటంతో నష్టం తీవ్రతను అంచనా వేయలేకపోతున్నారు.

టోక్యో: భూకంపం, సునామీలు సృష్టించిన విధ్వంసంకన్నా.. అణుధార్మికత విడుదలపై తలెత్తిన ఆందోళన జపాన్ ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటులో శనివారం భారీ పేలుడు సంభవించింది. అయితే.. ప్లాంటులో అణు రియాక్టర్‌కు ప్రమాదం జరగలేదని, రియాక్టర్‌ను ఉంచిన లోహపు గది చుట్టూ ఉన్న కట్టడం మాత్రమే పేలిపోయిందని అధికారులు చెప్తున్నారు. పేలుడు తర్వాత అణు రియాక్టర్ నుంచి విడుదలయ్యే అణు ధార్మికత (రేడియేషన్) స్థాయి పెరగకపోగా.. అంతకుముందు విడుదలవుతున్న స్థాయికన్నా తగ్గిందని కూడా వారు చెప్తున్నారు. కానీ.. అణు రియాక్టర్‌ను చల్లబరిచే వ్యవస్థ పనిచేయకపోవటం వల్ల అది వేడెక్కి కరిగిపోయే ప్రమాదముందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే అత్యంత ప్రమాదకరమైన అణుధార్మికత లీకై తీవ్ర నష్టానికి దారితీస్తుందని చెప్తున్నారు.



ఈ పరిస్థితుల నేపథ్యంలో జపాన్ అంతటా అణు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పేలుడు సంభవించిన ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటు చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న దాదాపు 45 వేల మంది ప్రజలను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. స్థానికులు నల్లాల్లో నీటిని వాడవద్దని, బయటకు వచ్చేటపుడు చర్మానికి గాలి తగలకుండా దుస్తులు కప్పుకోవాలని, ముఖానికి మాస్కులు ధరించాలని సూచనలు జారీచేశారు. శుక్రవారం సంభవించిన 8.9 తీవ్రత గల భూకంపం, దానివల్ల పుట్టిన పెను సునామీలు జపాన్‌ను చిన్నాభిన్నం చేసిన విషయం తెలిసిందే. భూకంపం ధాటికి.. జపాన్‌లోని 54 వాణిజ్య అణు రియాక్టర్లలో 10 రియాక్టర్లు మూతపడ్డాయి. అయితే.. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటు-1కి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దానివల్ల అణురియాక్టర్ శీతలీకరణ వ్యవస్థ పనిచేయటం మానేసింది.

ఫలితంగా వేడిమి పెరిగిపోయి రియాక్టర్ వెలుపలి గది శనివారం మధ్యాహ్నం పేలిపోయిందని ప్రభుత్వ ప్రతినిధి యుకియో ఎడానో పేర్కొన్నారు. ఈ పేలుడులో నలుగురు గాయపడగా వారిని అస్పత్రికి తరలించినట్లు చెప్పారు. పేలుడు సంభవించటానికి ముందు జపాన్ ప్రధాని నవాటో కాన్ ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఇతర సునామీ ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పేలుడు తర్వాత ప్లాంటు పరిసరాల్లోని వాతావరణంలో రేడియేషన్ స్థాయి పెరగలేదని, పైగా కొంతమేర తగ్గిందని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే.. అలా ఎందుకు జరిగిందనేది ఆయన చెప్పలేదు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో రేడియేషన్ స్థాయి ఎంత ఉందనేది కూడా నిర్దిష్టంగా చెప్పలేదు.


అయితే.. విస్ఫోటనానికి ముందు ఈ ప్లాంటు నుంచి ప్రతి గంటలో విడుదలవుతున్న రేడియేషన్.. ఒక వ్యక్తి ఒక సంవత్సరం మొత్తంలో వాతావరణం నుంచి స్వీకరించే రేడియేషన్‌తో సమానంగా ఉందని మాత్రం చెప్పారు. పేలుడు తర్వాత ప్లాంటులో ఒత్తిడి కూడా తగ్గుతోందన్నారు. అణు విద్యుత్ ప్లాంటులో పేలుడుకు ముందు తెల్లగా సన్నని పొగలు పైకి లేచాయి. అవి అంతకంతకూ దట్టంగా మారి ప్లాంటు మొత్తం అలుముకున్నాయి. అణు రియాక్టర్లు ఉన్న కంటైనర్‌లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్లాంటు ఆపరేటర్ ఒకరు.. కంటైనర్ వాల్వును తెరిచారని, దానివల్ల కొంత మొత్తం అణుధార్మిక వాయువు విడుదలైందని కూడా చెప్తున్నారు. పేలుడు కారణంగా భవనం గోడలు కుప్పకూలాయని ప్లాంటును నిర్వహిస్తున్న టోక్యో పవర్ ఎలక్ట్రిక్ కంపెనీ (టెప్కో) పేర్కొంది.



శీతలీకరణకు ఉపయోగించే నీరు శనివారం ఆవిరై తగ్గిపోవటంతో అణు ఇంధన కడ్డీలకు పాక్షికంగా గాలిసోకిందని, దీంతో రియాక్టర్‌లోకి ఫైరింజన్ ద్వారా నీటిని పంప్ చేస్తున్నారని జిజి ప్రెస్ అనే వార్తా సంస్థ పేర్కొంది. నీటి స్థాయి పెరుగుతోందని టెప్కో తెలిపినట్లు వెల్లడించింది. మరోవైపు.. ప్లాంటులో యురేనియం ఇంధనం ఉన్న లోహపు ట్యూబులు కరిగివుంటాయని జపాన్ అణు, పారిశ్రామిక భద్రతా సంస్థ ఆందోళన వ్యక్తం చేసినట్లు జపాన్ అధికార వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే తెలిపింది. అణు ఇంధనంలో కొంత భాగం కరిగివుండొచ్చు కానీ, రియాక్టర్ మాత్రం పనిచేయటం ఆగిపోయిందని, దానిని చల్లబరుస్తున్నారని టోక్యో యూనివర్సిటీ ప్రొఫెసర్ నవాటో సెకిమురా పేర్కొన్నట్లు వివరించింది.

ప్లాంటు పరిసరాల్లో అణుధార్మిక పదార్థాలైన సీసియం, ఐయోడైన్‌లను గుర్తించినట్లు అణు, పారిశ్రామిక భద్రతా సంస్థ తెలిపింది. రసాయన విపత్తుల కోసం శిక్షణ పొందిన సహాయదళాలు, ఫైర్ ఫైటింగ్ సిబ్బందిని ఈ ప్లాంటు వద్దకు తరలించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఫుకుషిమా ప్లాంటు-1కి సమీపంలోని మరో అణు విద్యుత్ ప్లాంటు నుంచి కూడా సాధారణంగా విడుదలయ్యే రేడియేషన్‌కన్నా 1,000 రెట్లు ఎక్కువగా రేడియేషన్ విడుదలవుతోందని పోలీసులు చెప్తున్నారు. దీని పరిసరాల నుంచి కూడా వేలాది మందిని ఖాళీ చేయించారు.


ముగ్గురికి రేడియేషన్ నిర్ధారణ!...: ఫుకుషిమా ప్లాంటుకు సమీపంలోని ఫుతాబా మాచి అనే పట్టణంలో గల ఒక ఆస్పత్రి నుంచి తరలించిన 90 మంది రోగుల్లో ముగ్గురికి అణు ధార్మికత సోకినట్లు గుర్తించారు. సునామీ ధాటికి ఆస్పత్రి మునిగిపోవటంతో ఈ రోగులంతా సమీపంలోని స్కూలుపైకి వెళ్లి సహాయం కోసం గంటల తరబడి వేచివున్నారు. వీరిని హెలికాప్టర్ల ద్వారా రక్షించి ముగ్గురిపై పరీక్షలు నిర్వహించారు. ఆ ముగ్గురికీ అణుధార్మికత సోకినట్లు వెల్లడికావటం ఆందోళనను తీవ్రం చేసింది.



చల్లబడే మార్గంలేకే...
రెండో ప్రపంచ యుద్ధకాలంలో హిరోషిమా, నాగసాకిలపై అమెరికా పేల్చిన అణుబాంబులు సృష్టించిన విధ్వంసాన్ని జపాన్ ఎన్నటికీ మరువలేదు. అందుకే అణు విద్యుత్ ప్లాంట్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎప్పుడూ భూకంపాలతో సహజీవనం చేసే జపాన్.. భూకంపాలు సంభవించినపుడు వాటికవే మూతబడేలా అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తారు. శుక్రవారం భూకంపం సంభవించినపుడు కూడా అణు రియాక్టర్లు పనిచేయటం ఆటోమేటిక్‌గా ఆగిపోయినప్పటికీ.. వాటిని చల్లబరిచే వ్యవస్థలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం వివరించింది.

రియాక్టర్లు ఆగిపోయిన వెంటనే శీతలీకరణ వ్యవస్థలు వెంటనే పనిచేయటం ప్రారంభించాల్సి ఉండగా అలా జరగలేదు. సాధారణంగా ఈ వ్యవస్థలు బాహ్య విద్యుత్ గ్రిడ్ల ద్వారా కానీ, బ్యాకప్ జనరేటర్ల ద్వారా కానీ, బ్యాటరీల ద్వారా కానీ పనిచేస్తాయి. అవి పనిచేయకపోతే రియాక్టర్లలోని అణు ఇంధన కడ్డీలు విపరీతంగా వేడెక్కి అణు ధార్మికతను విడుదల చేస్తాయి. ఫలితంగా అణుపదార్థం కరిగిపోయి గాలిలోకి ప్రమాదకరమైన స్థాయిలో అణుధార్మికత వ్యాపిస్తుంది. ఇది సోకిన వారికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

 



విషాద సాగరం * మృతులు 1700 పైనే మినామిసాన్రికులో 10,000 మంది గల్లంతు?
భూకంపం, సునామీల కారణంగా జపాన్‌లో మృతుల సంఖ్య 1,700 దాటినట్లు వార్తలు వెలువడుతున్నాయి. రాకాసి అలలు జపాన్ ఈశాన్యంలో 2,100 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని కబళించాయి. పెద్ద సంఖ్యలో పల్లెలు, పట్టణాలు, నగరాలను సునామీ తుడిచిపెట్టింది. దాదాపు 23 అడుగుల ఎతె్తైన రాకాసి అలలు కొన్ని ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల మేర భూమిపైకి చొచ్చుకువచ్చాయి. బోట్లు, కార్లు, ఇళ్లు, భవనాలను మింగేశాయి. అధికారికంగా 574 మంది చనిపోయినట్లు నిర్ధారించారు. మరో 586 మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిగాక సెందాయ్ తీరంలో దాదాపు 300 మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇదిలావుంటే మియాగి రాష్ట్రంలోని మినామిసాన్రికు పట్టణంలో దాదాపు 10,000 మంది గల్లంతైనట్లు ఫుజీ టీవీ చెప్తోంది.

ఒఫునాటో, సెన్సెకి, కెసెన్నుమా లైన్లలో నాలుగు రైళ్లు గల్లంతయ్యాయి. వాటిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నదీ తెలియదు. అంతకుముందు సెన్సెకి లైన్ మీద ఒక రైలు పడిపోయివుండగా గుర్తించారు. అందులో నుంచి మియాగి పోలీసులు హెలికాప్టర్ ద్వారా తొమ్మిది మందిని రక్షించారు. సునామీలో కొట్టుకుపోయి పేరుకున్నచెత్తలో, భూకంపం కారణంగా కూలిన భవనాల కింద మరిన్ని మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నారు. భూకంపం, సునామీల దెబ్బకు మొత్తం 3,400 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 181 సంక్షేమ భవనాలు, నర్సింగ్‌హోమ్‌లు దెబ్బతిన్నాయి. భూకంపం తాకిన ప్రాంతాల్లో 55.7 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆరు లక్షల ఇళ్లకు తాగునీటి సరఫరా తెగిపోయింది.



టోక్యో నగరంలో లోకల్ రవాణా వ్యవస్థ స్తంభించిపోవటంతో శుక్రవారం రాత్రి 1.20 లక్షల మంది ఇళ్లకు చేరుకోలేక వీధుల్లోనే కాలం వెళ్లబుచ్చాల్సి వచ్చింది. సునామీతో దెబ్బతిన్న ప్రాంతాలన్నింటికీ సహాయ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. దీంతో మొత్తం నష్టం తీవ్రత ఎంతగా ఉందన్నది ఇంకా అంచనాలకు అందటం లేదు. సహాయ చర్యల కోసం 20,000 మంది సైనికులు, 200 హెలికాప్టర్లు, విమానాలు, 25 బోట్లు రంగంలోకి దిగాయి. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల నుంచి సహాయ బృందాలు జపాన్‌కు చేరుకుంటున్నాయి. దాదాపు 50 దేశాలు సహాయం ప్రకటించాయి.


మరోవైపు.. శుక్రవారం 8.9 తీవ్రత గల భూకంపంతో అతలాకుతలమైన జపాన్‌ను దానితర్వాత వరుస వెంట భూ ప్రకంపనలు వణికిస్తూనే ఉన్నాయి. శనివారం మరో 14 ప్రకంపనలు పుట్టాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 నుంచి 6.8 వరకూ ఉన్నట్లు నమోదైంది. 


సునామీ ధాటికి తీరానికి వచ్చిపడ్డ చేపలు 
అకాపల్కో (మెక్సికో): జపాన్‌లో సంభవించిన సునామీ ధాటికి కుప్పలు తెప్పలుగా చేపలు మెక్సికో తీరానికి వచ్చిపడ్డాయి. మెక్సికోలోని అకాపల్కో తీరం వద్దకు వివిధ జాతులకు చెందిన చేపలు పెద్దసంఖ్యలో కొట్టుకు వచ్చాయి. దీంతో మత్స్యకారులు వలలు, రాడ్లు వదిలేసి మరీ మోటారు బోట్లతో అక్కడకు చేరుకున్నారు. ఎవరికి దొరికిన చేపలను వారు దోసిళ్లతో పట్టుకుని బకెట్లలో నింపుకుని తిరిగి వెళ్లారు. సునామీ వల్ల ఏర్పడ్డ సుడిగుండాలకు ఇవి కొట్టుకుని వచ్చి ఇక్కడకు చేరి ఉంటాయని భావిస్తున్నారు.  

జపాన్.. మరో చెర్నోబిల్?
ప్రమాదం అంచున మరిన్ని అణు రియాక్టర్లు

ఒకటి పేలిన 24 గంటల్లోనే ఆందోళనకరంగా మరో నాలుగు
అణు ఎమర్జన్సీ విధింపు
రెండు లక్షల మంది తలింపు
మరో మూల అగ్ని పర్వత విస్పోటం
'సూర్యుడు ఉదయించే భూమి'లో మొత్తం నిరాశ్రయులు 25 లక్షలు 
Allu Arjun Marriage photo Gallery
భూకంపం మిగిల్చిన వినాశనం.. వేలాదిగా ప్రజలు దుర్మరణం.. అంతలోనే 'మరో చెర్నోబిల్'ను తలపిస్తూ విరుచుకుపడిన అణుభూతం. దీంతో సునామీ సృష్టించిన బీభత్సం కారణంగా అణు విద్యుత్కేంద్రాలు 'కరిగి' పోతున్నాయా? అనే భయం జపాన్‌లో నెలకొంది. అణు ఇంధనం కరిగిపోతే వెలువడే అణు ధార్మికత ఇంకెంత మంది ప్రజలను మింగేస్తుందోనన్న వేదనతో దేశంలో ప్రభుత్వం అణు ఎమర్జెన్సీ విధించింది. Allu Arjun Marriage photo Gallery
సునామీ దెబ్బకు దారితప్పిన అణు రియాక్టర్లు అణు బాంబులుగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియక.. సాంకేతికతకే మారుపేరుగా నిలిచిన జపాన్ గజగజ వణుకుతోంది. సూర్యుడు ఉదయించే దేశంలో మరోసారి అణుప్రమాద భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఒక రియాక్టర్ పేలిపోగా, మరో రియాక్టర్ పేలుడు అంచున ఉంది. ఫుకోషిమాలో పరిస్థితి ఇలా ఉండగా.. ఒనగావాలోని మూడు రియాక్టర్లు కూడా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఫుకోషిమా రియాక్టర్ల భయానికి దాదాపు రెండు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.



దీంతో రెండో ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత క్లిష్ట పరిస్థితిని జపాన్ ఎదుర్కొంటోందని ఆ దేశ ప్రధాని నవోటో కన్ వాపోయారు. ఆనాటి అణుబాంబును తలుచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? అనిపిస్తోంది. అంతలోనే 10,000 మందిని పొట్టన పెట్టుకుందని భావిస్తున్న భూకంపం మిగిల్చిన విషాదం కూడా తక్కువేమీ కాదని తలంపుకొస్తోంది. అత్యంత విలాసవంతంగా జీవించిన అక్కడి ప్రజలు బురదలోనూ, మురుగలోనూ కాలం వెళ్లదీస్తున్నారు.

విద్యుత్ లేక నిముషమైనా మనలేని జనం ఆ సౌకర్యం లేక చీకట్లోనే మగ్గుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగువుతుందో ఒక అంచనాకు రాకముందే.. కష్టాలకు అంతులేదా? అన్నట్లు దేశంలో మరో మూల అగ్నిపర్వతం విస్ఫోటం చెందింది. మొత్తానికి ఆర్థిక మాంద్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశానికి గడ్డురోజులొచ్చాయా? అని ఆ దేశ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
 
Allu Arjun Marriage photo Gallery