Thursday, June 16, 2011

ఉగాండాలో కిలో బియ్యం కోసం 220 రూపాయలు

అక్కడ జనం రైళ్లెక్కరు

'రైల్వే వ్యవస్థను వస్తువుల చేరవేతకు మాత్రమే ఉపయోగిస్తారు. ప్రయాణాల కోసం ప్రజలందరూ వాహనాల మీదే ఆధారపడతారు. అందుకే రోడ్డు మీద ట్రాఫిక్ చాలా ఎక్కువ. ఈ రద్దీని తప్పించుకుని వేగంగా వెళ్లడానికి మోటారు సైకిల్స్ అద్దెకు దొరుకుతాయి. భారత దేశంలో ఆటోస్టాండ్‌లు ఎలా ఉంటాయో అలా ఇక్కడ మోటారు సైకిల్ స్టాండులుంటాయి' అని చెప్పారు తమరాల గిరి. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలానికి చెందిన ఈయన ఉగాండాలోని లెవెల్‌వన్ టెక్నాలజీస్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గిరి చెబుతున్న లైఫ్ అబ్రాడ్ విశేషాలు...http://www.privateguidedsafaris.com/images/Uganda-Nile-river.jpg
నైలునది ఇక్కడే మొదలవుతుంది. సాధారణంగా నీరు కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తుంది. కాని ఉగాండాలో నైలు నది తూర్పున పుట్టి కొండల వైపు పాయలుగా ప్రవహిస్తుంది. ఉగాండా, టాంజానియా, సుడాన్, ఈజిప్ట్‌లకు ఇదే ప్రధాన జలవనరు. లేక్ విక్టోరియా వీళ్లకో వరం. లేక్ విక్టోరియా నీటిలో అడుగు స్థలానికి కనీసం పది చేపలు దొరుకుతాయి. పట్టుకోవడానికి ఓపిక ఉండాలంతే. ఇక్కడి చేపల్లో 'నైలుపర్చ్', 'తిలాపియా' రకాలు ప్రసిది. ఎక్కువ మంది ఆవులను పెంచుతారు. అయితే వీటిని పాల కోసం మాత్రం వినియోగించరు.http://ivarfjeld.files.wordpress.com/2009/06/photo_lg_uganda.jpg
అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు ఇష్టపడ్డాక పిల్లల్ని కూడా కంటారు. అయినా పెళ్లిళ్లు జరగవు. ఇంకోవైపు పుట్టిన పిల్లలు తల్లి దగ్గర పెరిగి పెద్దవుతుంటారు. తండ్రి ఎప్పుడైతే స్థిరపడతాడో అప్పుడే పెళ్లి జరుగుతుంది. భార్యకు భారీగా కన్యాశుల్కం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టే ఈ ఆలస్యం. దాంతోపాటు వందల సంఖ్యలో ఆవులను కూడా ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే అతను ఆర్థికంగా బాగా స్థిరపడాలి. కొందరు నలభై ఏళ్లకు స్థిరపడితే, మరికొందరి జీవితం యాభై ఏళ్లకు గాని గాడిలోకి రాదు. అప్పుడు కన్యాశుల్కంతోపాటు, ఆవులు కూడా ఇచ్చి వివాహానికి సిద్ధమవుతారు.

'నేను ఉగాండా వచ్చి ఐదేళ్లు దాటుతోంది. ఇక్కడి ప్రజల జీవనంలో రెండు కోణాలు స్పష్టంగా కనిపించాయి. ఒకటి -అత్యంత ఆధునిక జీవన శైలి, రెండోది -ఆదిమ తెగల జీవితం. ఈ రెండూ కలిసి ఉండటమే ఉగాండా ప్రత్యేకత. మనం తిన్నట్టు టిఫిన్, లంచ్, డిన్నర్‌లకు వేర్వేరు ఆహారం ఉండదు. మూడు పూటలూ ఒకటే ఆహారం తింటారు. ఆ ఆహారం పేరు 'పోషో'. దీనిని మొక్కజొన్నతో తయారు చేస్తారు. బీఫ్, ఫిష్... ఇవి కూడా తింటున్నప్పటికీ పోషోనే ప్రధాన ఆహారం.

పట్టణాల్లో ఉండే వారు చిన్నా, పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా అందరూ బీరు సేవిస్తారు. గ్రామీణ ప్రాంతంలో దీనికి భిన్నమైన జీవనం కనిపించింది. వాళ్లకి 'వేట' ప్రధాన వృత్తి. 'కరమొజా' అనే ప్రాంతంలో ప్రజలందరికీ ఒక రాజు ఉన్నాడు. రాజుతో పాటు అందరూ వేటకు వెళతారు. అక్కడ ఏఏ జంతువులు దొరికితే వాటన్నిటినీ తీసుకొస్తారు. అలా తెచ్చిన జంతువులను చంపి వాటి రక్తాన్నంతా ఒక పాత్రలో మరిగిపూస్తారు. దాంట్లో కొంచెం ఉప్పువేసి రాజుకు ఇచ్చి మిగతా రక్తాన్ని ప్రజలు పంచుకుంటారట. కరమొజా వంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇదొక దినచర్య.
http://www.shout-africa.com/wp-content/uploads/2011/05/2-1.jpg
అల్లోపతి తక్కువ...
చాలా తక్కువ మంది మాత్రమే ఇంగ్లిష్ మందులను వాడతారిక్కడ. ఆసుపత్రులలో దాదాపు అన్నీ నార్మల్ డెలివరీలే. జ్వరం వస్తే ప్యాషన్ ఫ్రూట్‌ను తింటారు. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది తిన్నాక పచ్చిపాలు తాగుతారు. మలేరియా వంటి జ్వరానికి కూడా ప్యాషన్ ఫ్రూట్ తినడంతోనే సరిపెట్టుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది. అయితే దాన్నుంచే వాళ్లు ఉపశమనం పొందుతున్నారు మరి. పుల్ల గుమ్మడికాయలు విరివిగా దొరుకుతాయి. వీటిని నీటిలో ఉడకబెట్టి తింటారు. చిన్న చిన్న ముక్కలుగా కోసి స్నాక్స్‌గా కూడా తింటారు. ప్రజల జీవనాధారం వ్యవసాయం, వేట, ఫిషింగ్. ఎక్కువగా మొక్కజొన్న, అరటి చెట్లు, మామిడి, పనస, నేల పనస, సీమ పెండలం, చెరుకు పండిస్తారు.
http://ethnicsupplies.org/wp-content/uploads/2010/07/Uganda_Lake_Victoria.jpg
లేక్ విక్టోరియా వరం...
నైలునది ఇక్కడే మొదలవుతుంది. సాధారణంగా నీరు కొండల్లో పుట్టి దిగువకు ప్రవహిస్తుంది. కాని ఉగాండాలో నైలు నది తూర్పున పుట్టి కొండల వైపు పాయలుగా ప్రవహిస్తుంది. ఉగాండా, టాంజానియా, సుడాన్, ఈజిప్ట్‌లకు ఇదే ప్రధాన జలవనరు. లేక్ విక్టోరియా వీళ్లకో వరం. 
http://4.bp.blogspot.com/_LA7rTR4mh4w/S9oYEOTbToI/AAAAAAAABrc/kobOMi_FCLk/s1600/lake+victoria.jpg
లేక్ విక్టోరియా నీటిలో అడుగు స్థలానికి కనీసం పది చేపలు దొరుకుతాయి. పట్టుకోవడానికి ఓపిక ఉండాలంతే. ఇక్కడి చేపల్లో 'నైలుపర్చ్', 'తిలాపియా' రకాలు ప్రసిది. 
http://www.traveladventures.org/continents/africa/images/uganda-people03.jpg
ఎక్కువ మంది ఆవులను పెంచుతారు. అయితే వీటిని పాల కోసం మాత్రం వినియోగించరు. జెర్సీరకం ఆవులను పాలకోసం ఉపయోగిస్తారు. ఆవులు పెద్దయ్యాక వాటిని ప్రభుత్వ యార్డులకు అమ్మాల్సి ఉంటుంది. ప్రభుత్వమే మాంసం మార్కెటింగ్ చేస్తుంది. ఎంతవరకు అవసరమో అంతే సరఫరా చేస్తుంది. ఎవరైనా ఆవులను ప్రభుత్వానికి అమ్మకుండా, ఆహారంగా మార్చారని తెలిస్తే పెద్ద శిక్షలే పడతాయి. అదొక తీవ్రనేరంగా పరిగణిస్తారు. అందుచేత ఎవరైనా సరే అవులను ప్రభుత్వానికే అమ్మేస్తారు.http://www.ens-newswire.com/ens/may2006/20060511_longhorncattle.jpg

ఎన్నికలు నామ మాత్రమే...
http://redpepper.co.ug/welcome/wp-content/uploads/2011/05/Electoral-Commission-in-Uganda1.jpg
ఉగాండాను 'ముసవేని' పరిపాలిస్తున్నారు. ఈ మాజీ ఆర్మీ మేజర్‌ను ఇష్టపడే వారు పదిశాతం కూడా ఉండరేమో. పాతికేళ్ల క్రితం నియంత 'ఇడ్‌యామిన్'ను గద్దె దించి ముసవేని అధికారంలోకి వచ్చారు. ప్రతీ నాలుగేళ్లకూ ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. కాని ముసవేని కనుసన్నల్లో నడిచే ఆర్మీ రిగ్గింగ్‌కు పాల్పడుతుంది. చాలామందికి అసలు ఓటు వేసే అర్హతే ఉండదు. ప్రతిపక్షాలూ ఉన్నాయి. వారు దేన్నయినా ఎదిరిస్తే రక్తపాతాలు జరుగుతుంటాయి. గొడవ జరుగుతుందని ముందే పసిగట్టి ప్రభుత్వం తరువాత రోజును పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తుంది.http://www.york.ac.uk/inst/cahr/images/UgandaElection12.jpg
ఆ ఒక్క రోజులో ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని 'చక్కదిద్ది' మామూలు స్థితికి తీసుకొస్తుంది. తరువాత రోజునుంచి జీవనం గాడిలోకి వచ్చేస్తుంది. ఆఫీసులు తెరుచుకుంటాయి. ఇక్కడ ప్రతీ పోలీసుకు, సెక్యూరిటీ గార్డుకు అప్పటికప్పుడు అరెస్టు చేసే అధికారం ఉంటుంది. ఏదైనా దారిలో వెళుతుంటే 'ఈ రోడ్డులో ఎందుకు వెళుతున్నావ్? అరెస్టు చేస్తున్నాం' అంటారు. అలా రోజుకు కనీసం నాలుగు సార్లయినా అరెస్టు కావాల్సిందే. నిజానికి అరెస్టు చేసేది కేవలం డబ్బు కోసమే. 'అరెస్టు చేస్తున్నా' అనగానే 25 రూపాయలు లంచం ఇస్తే చాలు వదిలేస్తారు. కాదని ఎదిరిస్తే పై కెళ్లే కొద్దీ ఎక్కువ సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఉగాండాలో అవినీతి చాలా ఎక్కువ.http://www.bou.or.ug/bouwebsite/export/sites/default/bou/common_images/currency/issue_with_Amin.jpg
కన్యాశుల్కం తప్పనిసరి...
వివాహ వ్యవస్థ చాలా భిన్నమైనది. అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు ఇష్టపడ్డాక పిల్లల్ని కూడా కంటారు. అయినా పెళ్లిళ్లు జరగవు. ఇంకోవైపు పుట్టిన పిల్లలు తల్లి దగ్గర పెరిగి పెద్దవుతుంటారు. తండ్రి ఎప్పుడైతే స్థిరపడతాడో అప్పుడే పెళ్లి జరుగుతుంది. భార్యకు భారీగా కన్యాశుల్కం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టే ఈ ఆలస్యం. దాంతోపాటు వందల సంఖ్యలో ఆవులను కూడా ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే అతను ఆర్థికంగా బాగా స్థిరపడాలి. కొందరు నలభై ఏళ్లకు స్థిరపడితే, మరికొందరి జీవితం యాభై ఏళ్లకు గాని గాడిలోకి రాదు. అప్పుడు కన్యాశుల్కంతోపాటు, ఆవులు కూడా ఇచ్చి వివాహానికి సిద్ధమవుతారు.
http://www.parentalcareministries.org/wordpress/wp-content/uploads/2009/06/uganda-trip-one-988.jpg
ఇదంతా జరిగే సరికి వారి పిల్లలు పెద్దవాళ్లయిపోతారు. దాంతో పిల్లలే పెద్దల పెళ్లిళ్లు చేస్తుంటారు. 'ఫలానా రోజు, ఫలానా దగ్గర మా అమ్మానాన్నకు పెళ్లి. మీరంతా తప్పకుండా రావాలి' అన్న పెళ్లి పిలుపు వస్తుంటుంది. ఒక వేళ వివాహం జరిగాక భర్త నచ్చకపోతే పెళ్లికూతురు ఆయన్నుంచి విడిపోయే హక్కును కలిగిఉంటుంది. భార్య నచ్చకపోతే వదిలేసే సౌలభ్యం భర్తకు మాత్రం లేదు. అలా విడిపోయి వేరేవాళ్లని పెళ్లి చేసుకుంటారు. పిల్లలకు మాత్రం కొత్త తండ్రి, పాత తండ్రులిద్దరి దగ్గరా అవసరాల నిమిత్తం డబ్బును తీసుకునే వెసులుబాటు ఉంటుంది.http://freeuganda.files.wordpress.com/2009/06/610x-48.jpg?w=500&h=297
పరమత సహనం...అధిక దొంగతనం
ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నప్పటికీ ఇతర మతాల వారితో కలిసిపోతారు. ఆఫీసులోనూ సరదాగానే ఉంటారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆఫీసులు ఉంటాయి. రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవార్లూ డిస్కోలు, పబ్‌ల్లో ఆనందం వెతుక్కుంటారు. క్రిస్మస్, ఈస్టర్ పండగలకు పది రోజుల చొప్పున సెలవులు ప్రకటిస్తారు. ఉగాండాలో నాలుగు హిందూ దేవాలయాలు ఉన్నాయి. రెండు నెలల క్రితమే వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు. సెలవు రోజుల్లో ఇక్కడే కలుస్తుంటాం. మన దేశం నుంచి వెళ్లిన వారిలో తెలుగువాళ్లు, గుజరాతీలే ఎక్కువ. గుజరాతీలు ఏ స్థాయి అధికారంలో ఉన్నప్పటికీ నిలువునామంతో కనిపిస్తారు.
http://www.enuii.org/vulcan_foundry/photographs/locomotives/no%203578-3592%20uganda%20railway%201922%20to%201923.jpg
రైళ్లను సరుకుల కోసమే వినియోగించడంతో ప్రజలు అధికంగా మినీ బస్సులపై ఆధారపడతారు. మిగతా వారిలో యాభైశాతం మందికి సొంత కారు ఉంటుంది. ఇక్కడ దొంగతనాలు అధికం. ఏదైనా వస్తువుపోతే రికవరీ ఉండదు. ఇన్సూరెన్స్ దక్కుతుందంతే. 
http://www.usaid.gov/stories/images/fp_uganda_food.jpg
మన వంటసరుకులన్నీ దొరుకుతాయి. కాకపోతే అధిక ధరలు చెల్లించాలి. కిలో బియ్యం మన దేశంలో 30 రూపాయలు ఉంటే, ఉగాండాలో కిలో బియ్యం కోసం 220 రూపాయల వరకు చెల్లించాలి. ఉప్పు, చింతపండు, పప్పు దినుసులు, రాగిపిండి...ఇలా ఏ వంట సరుకు కావాలన్నా అధిక ధరలను భరించాల్సిందే. ఉగాది, దీపావళి, విజయదశమి పండగలను జరుపుకుంటాం'.
సేకరణ: బల్లెడ నారాయణ మూర్తి

Tuesday, June 14, 2011

వీడ్కోలు * టీవీ తెరపై తిరుగులేని తార ఓప్రా విన్‌ఫ్రే



తానెంతగానో అభిమానించి ఆరాధించే టీవీ యాంకర్‌ని చూడడానికి శ్రియ పిల్గోంకర్ అనే ఇరవైరెండేళ్ల యువతి ముంబయి నుంచి అమెరికా వెళ్లింది. ఆ యాం కర్ నిర్వహించే టీవీ షో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చునే అవకాశం దొరికినపుడు ఆమె పడిన సంతోషం అంతా ఇంతా కాదు. సినీ తారలు, పాప్ సింగర్లంటే పడిచచ్చేవాళ్లని చూశాం కాని టీవీ యాంకర్లకి కూడా అభిమానులుంటారా అని ఆశ్చర్యపోతున్నారా. ఆ టీవీ యాంకర్ అంటే ప్రపంచానికున్న అభిమానం మరే తారకీ లేదు. ఆమే పాతికేళ్లపాటు టీవీషో నిర్వహించి ప్రపంచ టెలివిజన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా అమెరికాని 'ఓప్రాఫికేషన్' చేసిన ఒక నల్లజాతి అమెరికన్ మహిళ.. ఓప్రా విన్‌ఫ్రే.

25, మే 2011.. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఒక అధ్యాయానికి తెరపడింది. 1986 మొదలై 145కి పైగా దేశాల్లో ప్రసారమవుతూ వస్తున్న 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' ఆ రోజుతో ముగిసింది. పాతికేళ్లుగా అమెరికాలో ఇంటిల్లిపాదికీ సుపరిచితమైన ఓప్రా విన్‌ఫ్రే చివరిసారి టీవీలో కనిపించే ఎపిసోడ్‌ని ఆ దేశంలో సినిమా థియేటర్లలో కూడా లైవ్‌గా ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా బార్లు, పబ్‌లలో ఓప్రా అభిమానులు చేరి టీవీషో చూస్తూ వీడ్కోల పండుగ జరుపుకున్నారు. ఆమెరికా ఆమెని అంతగా ఆరాధించడానికి కారణమేమిటి? ఓప్రా విన్‌ఫ్రే కేవలం టీవీ యాంకర్ మాత్రమే కావచ్చు. అమెరికన్ సంస్కృతిని పాతికేళ్లుగా మరెవరూ చేయలేనంతగా ప్రభావితం చేసిందని సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపించాయి.
అమెరికాలోనే కాదు, ఆమె షో ప్రసారమైన అన్ని దేశాల్లోనూ ఆమెకి అభిమానులున్నారు. అలాగని ఓప్రా టీవీషో నిర్వహించిన మొదటి వ్యక్తేమీ కాదు. ఆమె రాకకి ముందునుంచే టీవీ టాక్‌షోలు నడుస్తున్నాయి. అయితే ఆమె మాట్లాడే విధానం, ఎదుటి వ్యక్తులనుంచి సమాధానాలు రాబట్టే నేర్పరితనంతో తనదైన శైలిలో యాంకరింగ్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందామె. అందుకు ఆమె వ్యక్తిత్వంతోపాటు జీవితం నేర్పిన పాఠాలూ దోహదపడ్డాయి. ఒక్క టీవీషో ద్వారా అమెరికన్ జీవితాల్లోకి అన్ని కోణాలనుంచి చొచ్చుకుపోగలిగింది. టాక్‌షోలలో సెలబ్రిటీలపై వచ్చే గాసిప్‌లను, బ్యూరోక్రాటిక్‌గా సాగే చర్చలను కాదని సామాన్య ప్రజల జీవితాలే కేంద్రంగా టీవీషో కొనసాగించింది. జనం బయటకు చెప్పుకోలేని ఎన్నో విషయాల గురించి తన షోలో చర్చిస్తూ వాటిని అమెరికన్ సమాజమంతా బహిరంగంగా చర్చించుకునేలా చేసింది ఓప్రా. అందుకే అమెరికన్లకి ఆమె అంటే అంత అభిమానం.

తల్లి పిల్లలతో మాట్లాడినట్లే..
తల్లి తన పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతూ తనషోకి వచ్చిన అతిథుల మదిలోయల్లోకి చొచ్చుకుపోతుంది ఓప్రా. అందుకేనేమో ఆమె అడిగితే చాలు ఎంతటి వారైనా తమ మనసులో ఉన్నదాన్నంతా బయట పెట్టేవాళ్లు. ఒక్కోసారి భోరున ఏడ్చేసేవాళ్లు, ఒక్కోసారి పట్టలేని సంతోషంతో పిచ్చిగంతులేసేవారు... ఆత్మన్యూనతని పక్కన పెట్టి సగర్వంగా తమ గురించి చెప్పుకునేవాళ్లు. ఎవరి గురించి వాళ్లు చెబుతూ ఉంటే తన జీవితంలో జరిగిన సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటర్వ్యూలని పరిపూర్ణం చేసేది ఆమె. అందుకే వారం వారం ప్రసారమయ్యే ఆమె షో కోసం అమెరికా పడిగాపులు కాసేది. ఆ అభిమానమే ఆమెని 20వ శతాబ్దంలో అత్యంత ధనవంతురాలైన నల్లజాతి వ్యక్తిగా నిలిపింది. కడుపేదరికంలో పుట్టిన ఓప్రా అంత అభిమానాన్ని ఆస్తిపాస్తుల్ని సంపాదించే దిశగా చేసిన పయనంలో ఎన్నో కష్టనషాల్ని చవిచూసింది.


పేదరికం నుంచి..
ఓప్రా విన్‌ఫ్రే 1954 జనవరి 29న మిసిసిపీలో ఒక టీనేజి పెళ్లికాని అమ్మాయికి జన్మించింది. ఆమె తల్లి ఇళ్లల్లో పనిచేసేది. ఓప్రా అసలు పేరు ఓర్పా గెయిల్ విన్‌ఫ్రే. ఓర్పా కాస్తా వాడుకలో ఓప్రా అయిపోయింది. తొమ్మిదేళ్ల వయసులో అత్యాచారానికి గురయ్యానని ఒకసారి తన షోలో చెప్పింది ఓప్రా. ఏళ్లపాటు అత్యాచారానికి గురైన ఆమె 13 ఏళ్లవయసులో ఇల్లొదిలి పారిపోయింది. పద్నాలుగేళ్ల వయసులో మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అప్పట్నించి నేటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో వక్తృత్వపోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించింది. ఆ పోటీల్లో గెలుపుతో యూనివర్శిటీ చదువుకి ఫెలోషిప్ సంపాదించి నల్లజాతి విద్యార్థులకు పెట్టింది పేరైన టెన్నెస్ స్టేట్ యూనివర్శిటీలో చేరింది.

ఓ పక్క చదువుకుంటూనే స్థానిక రేడియో స్టేషన్లో వార్తలు కూడా చదివిన ఆమె ఆ రేడియోలో పనిచేసిన పిన్నవయస్కురాలే కాదు, మొట్టమొదటి నల్లజాతి యాంకర్ కూడా ఆమే. రేడియో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న ఓప్రా 1983లో టెన్నెస్ నుంచి చికాగోకి మకాం మార్చింది. ఓ రేడియో స్టేషన్‌లో ఉదయం వార్తా కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. ఓప్రా రంగ ప్రవేశంతో కొన్ని నెలల్లోనే రేటింగ్‌లో ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉన్న ఆ కార్యక్రమం మొట్టమొదటి స్థానానికి ఎగబాకింది. ఓప్రా ఇంటర్వ్యూ చేసే తీరు, ఆమె నైపుణ్యాన్ని గమనించిన సినీ విమర్శకుడొకరు ఆమెని టెలివిజన్ షో చెయ్యమని సలహా ఇచ్చాడు. కార్యక్రమాన్ని దేశమంతటా టీవీ చానళ్లకు అమ్మవచ్చని, ఖచ్చితంగా జనాన్ని ఆకర్షించగలుగుతుందని చెప్పాడు. ఆయన సలహాతోటే 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' అనే పేరుతో ఆమె సొంతగా టెలివిజన్ షో నిర్మించే పనిలో పడింది.

ది ఓప్రా విన్‌ఫ్రే షో
1986, సెప్టెంబర్ 8న దేశవ్యాప్తంగా ఓప్రా విన్‌ఫ్రే షో ప్రసారమైంది. అప్పటికి నెంబర్‌వన్ స్థానంలో ఉన్న షోని కొన్ని వారాల్లోనే పక్కకి నెట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. టీవీ షోలలో తెల్లజాతి మగవాళ్ల హవా నడుస్తున్న సమయంలో ఒక నల్లజాతి స్త్రీ వాళ్లని వెనక్కి నెట్టి తిరుగులేని యాంకర్‌గా వార్తల్లోకెక్కింది. క్రమంగా శాటిలైట్ టెలివిజన్ అంతర్జాతీయంగా విస్తరించడంతో ఆమె షో కూడా ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పటికీ ఆ షోకి పోటీ వచ్చిన షో మరోటి లేదంటే ఆమె ఎంచుకున్న అంశాలు అలాంటివి. స్థానిక సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల దాకా, గుండెజబ్బు నుంచి ఎయిడ్స్ దాకా, స్వలింగ సంపర్కులపై వివక్ష నుంచి ఆధ్యాత్మిక చింతన దాకా ఆమె స్పృశించని అంశం లేదు. 1993లో ఓప్రా విన్‌ఫ్రే మైకెల్ జాక్సన్‌ని తన షోకి ఆహ్వానించింది.

ఇద్దరు నల్లజాతి తారల్ని ఓ చోట చేర్చిన ఆ కార్యక్రమం అమెరికన్ టెలివిజన్ చరిత్రలోనే అతి ఎక్కువమంది వీక్షించినదిగా రికార్డులకెక్కింది. నోబెల్ గ్రహీత, అమెరికన్ నల్లజాతి రచయిత్రి టోని మారిసన్ రచించిన 'బిలవెడ్'ని వెండితెరపై నిర్మించి నటించింది. మరో నల్లజాతి రచయిత్రి ఆలిస్ వాకర్ రచించిన 'ది కలర్ పర్పుల్'ని స్టీవెన్ స్పీల్‌బర్గ్ నిర్మిస్తే, దాన్లో నటించి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ నామినేషన్ కూడా సాధించింది. ఒక విజయం మరిన్ని విజయాలకు బాట వేస్తుందనేది ఓప్రా విషయంలో ముమ్మాటికీ నిజమైంది.


2000 సంవత్సరంలో ఆమె ప్రారంభించిన 'ఒ-ది ఓప్రా మ్యాగజైన్' మాసపత్రిక 27 లక్షల కాపీల సర్క్యులేషన్‌తో నడుస్తోంది. ఆ మ్యాగజైన్ దక్షిణాఫ్రికా ఎడిషన్ కూడా అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఓప్రాకి ఉన్న ఆదరణని గమనించిన డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థ ఆమెతో సంయుక్తంగా ఒక చానల్ నడపడానికి ముందుకొచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో 'ఓప్రా విన్‌ఫ్రే నెట్‌వర్క్' పేరుతో ఆ టీవీ చానల్ మొదలైంది.


పుస్తక ప్రచురణపై ఓప్రా మార్కు
ఓప్రా విన్‌ఫ్రే ఐదు పుస్తకాలకు సహరచయిత కూడా. 2005లో ఆమె తన వ్యక్తిగత ట్రెయినర్ బాబ్ గ్రీన్‌తో కలిసి బరువు తగ్గడంపై పుస్తకం రాసింది. ఆ పుస్తకానికి వచ్చిన పారితోషకం కూడా ఒక రికార్డే. ప్రపంచంలో ఏ రచయితకీ చెల్లించనంత ఎక్కువ మొత్తాన్ని ఆమెకి చెల్లించారని వార్తలొచ్చాయి. అప్పటి దాకా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జీవితచరిత్రకి లభించిందే అతి ఎక్కువ మొత్తం. పుస్తకాలు రాయడమే కాదు ఓప్రా తన షోలో పుస్తకాల గురించి కూడా చర్చించేది. దానికి ఓప్రా బుక్ క్లబ్ అనే పేరు పెట్టిందామె. ఏదైనా పుస్తకం ఆ క్లబ్‌లో స్థానం సంపాదించడమంటే ఒక పెద్ద అంతర్జాతీయ అవార్డు రావడంతో సమానం.
బుక్ క్లబ్‌లో చేరిన పుస్తకాల అమ్మకాలు అమాంతం పెరిగిపోయేవి. ఒక్క రోజులోనే లక్షల కాపీలు అమ్ముడు పోయేవి. లైబ్రరీలన్నీ ఆ పుస్తకాలు తప్పక తెప్పించి పెట్టేవి. ఓప్రా క్లబ్‌లో చేరిన పుస్తకాల సెక్షన్లు షాపుల్లో ప్రత్యేకంగా ఉండేవి. ఓప్రాఫికేషన్ అనే కొత్త పదం ఇంగ్లీషు డిక్షనరీలో చేరింది. బహిరంగంగా నిజాన్ని ఒప్పుకునే అలవాటు అమెరికన్లలో పెంపొందడానికి ఓప్రా షోయే కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ కొనియాడింది. ఆమె ప్రభావంతో పాశ్చాత్య ప్రపంచంలో మెమోయిర్‌లు రాయడం పెరిగింది కూడా ఓప్రాఫికేషన్ వల్లే.

అంత్యంత ప్రభావశీల మహిళ
సిఎన్ఎన్, టైమ్ మ్యాగజైన్ రెండూ ఓప్రాని ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల మహిళగా పేర్కొన్నాయి. అలాంటి మరెన్నో జాబితాల్లో ప్రభావశీలమైన వ్యక్తిగా ఎన్నికవ్వడం ఆమెకి సర్వసాధారణమైపోయింది. చివరికి బరాక్ ఒబామా కూడా ఓప్రా 'ఓప్రా అమెరికాలో అత్యంత ప్రభావశీల వ్యక్తి కావచ్చేమో' అని పేర్కొన్నాడు. నిజమే.. ఆడతనమంటే అది ఓప్రాలా ఉండాలని అమెరికన్ అమ్మాయిలన్నారంటే ఆమెపై వారికున్న అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

కాలిఫోర్నియాలోని 'ది ప్రామిస్డ్ ల్యాండ్' అనే 42 ఎకరాల సువిశాల ఎస్టేట్‌లో ఉన్న విలాస భవనం ఆమె ప్రస్తుత నివాసం. ఇంకా చాలా నగరాల్లో ఆమెకి ఇళ్లున్నాయి. ప్రఖ్యాత నల్లజాతి అమెరికన్ రచయిత్రి మాయా ఎంజెలూ అంటే ఓప్రాకి ఎనలేని ప్రేమ, గౌరవం. 'ఆమే నాకు అక్క, తల్లి, స్నేహితురాలు' అని పేర్కొన్నదోసారి. పేదరికంలో పుట్టి పెరిగిన ఓప్రా 32 ఏళ్లకే మిలియనీరైంది. 41 ఏళ్లు వచ్చేనాటికి ఫోర్బ్స్ 400 మంది ధనవంతుల జాబితాలో ఉన్న ఏకైక నల్లజాతి వ్యక్తి అయింది. ఆమె ఆస్తి అప్పటికి 340 మిలియన్ డాలర్లు. 20వ శతాబ్దానికి గాను అత్యంత ధనవంతురాలైన ఆఫ్రికన్ అమెరికన్ ఆవిడే.

కేవలం సంపాదించడమే కాదు, దాన్నెలా ఖర్చు చేయాలో కూడా తెలుసు ఓప్రాకి. అందుకే 1998లో ఓప్రాస్ ఏంజెల్స్ నెట్‌వర్క్ పేరుతో ఒక సేవాసంస్థను స్థాపించి ఎనిమిది కోట్ల డాలర్లు విరాళాలు సేకరించి సేవాకార్యక్రమాలు నిర్వహించింది. అమెరికాలో మరే ఇతర సెలబ్రిటీ దానం చేయనంత డబ్బుని దానం చేసింది. ఒక్క 2007లోనే 303 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చిన ఆమె దక్షిణాఫ్రికాలో వీధి బాలల కోసం స్కూల్ కూడా నడుపుతోంది.

Tuesday, May 17, 2011

Pensioner Accidentally Became a Millionaire.


Pensioner Accidentally Became a Millionaire

The remarkable story of random luck and the incredible discovery. One man from New York, became a pensioner. He decided to use their savings for retirement to purchase land and houses in Portugal.
Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives


A modest house and farm, which he bought vacant for 15 years. Former owner and his wife died, and the house was sold at auction to pay taxes. For the economy looked a few people, but nobody opened the door of the old barn.
Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Before purchasing no one looked at the barn, as interested in the house and land, and the barn was sold into the bargain. A man from New York bought the property for half price. After moving with his wife, they searched his possessions and decided to saw sealed door to the barn.


What do you think? What are they found?
Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

That's the usual retiree won a very valuable collection of vintage cars, and if it decides to sell it, it will become the owner of a large fortune.

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Pensioner Accidentally Became a Millionaire - Phani Kiran: World Informatives

Thank You !
Received this from Mr.Roshan, Srilanka

Monday, May 2, 2011

నెత్తుటి త్యాగానికి నూట పాతికేళ్లు * శ్రామిక జనావళిలో స్ఫూర్తిని రగిల్చిన ఆ రోజు మేడే (కార్మిక దినోత్సవం)

ప్రపంచ కార్మికోద్యమంలోని చారిత్రక మలుపులెన్నింటికో మే నెల ఒకటో తారీకు ఓ మైలురాయి. మే1, 1886న అమెరికాలో కార్మికులు చేపట్టిన సమ్మె కార్మిక ఐక్యతకు సంకేతంగా, ప్రపంచ కార్మికులకు ఒక సందేశంగా నిలిచింది. శ్రామిక జనావళిలో స్ఫూర్తిని రగిల్చిన ఆ రోజు మేడే (కార్మిక దినోత్సవం)గా చరితార్థమైంది. ఆ మహత్తర ఉద్యమానికి నేటికి నూట పాతికేళ్లు.

ఆ రోజుల్లో అమెరికాలో కేవలం కడుపు నింపుకోవడానికే కార్మికులు రోజుకి 14 నుంచి 20 గంటలు పనిచేయాల్సి వచ్చేది. ఆ వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందేందుకు ఫిలడెల్ఫియా రాష్ట్రంలోని చర్మకారులు సమ్మె (1806) చేస్తే వారిపై కుట్ర కేసు పెట్టి విచారించారు. ఆ విచారణలో చర్మకారులు రోజుకు 19 నుంచి 20 గంటలు పనిచేస్తున్నట్లు బయటపడింది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరిదీ ఇదే పరిస్థితి. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే సంఘటితమవ్వాలనే ఆలోచన కార్మికుల్లో బలపడింది. పని గంటలు తగ్గించాలనే డిమాండ్‌తో 1820 నుంచి సుమారు రెండు దశాబ్దాలపాటు సమ్మెల పరంపరం కొనసాగింది.

ఫలితంగా 1837లో అమెరికా అధ్యక్షుడు మార్టిన్ వాన్ బురెన్ ప్రభుత్వ రంగంలో పనిదినాన్ని10 గంటలకు కుదిస్తూ డిక్రీ విడుదల చేశాడు. కొన్ని ప్రైవేటు ఫ్యాక్టరీలు కూడా ఆ నిర్ణయాన్ని ఆహ్వానించడంతో కార్మికులకు కాస్త ఊరట లభించినా ఆ ఆనందం ఎక్కువ రోజులు మిగల్లేదు. 1837-41 మధ్య కాలంలో వచ్చిన మహా మాంద్యం సాకుతో 12-14 గంటలు పనిచేయాలని యాజమానులు ఒత్తిడి పెంచారు. మాంద్యం నుంచి కోలుకున్నాక మళ్లీ సమ్మెలు రాజుకున్నాయి. చివరికి చేసేదిలేక కొన్ని రాష్ట్రాలు పది గంటల పని దినాన్ని అమలు చేయాలని చట్టం చేసినా ఆ ప్రభుత్వాలు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరించి, అమలు చేయకుండా కార్మిక ద్రోహానికి పాల్పడ్డాయి.

ఎనిమిది గంటల పోరాటం


అమెరికాలో అంతర్యుద్ధ (1861- 65) కాలంలో అనేక కార్మిక సంఘాలు కనుమరుగయ్యాయి. కాని కార్మికుల్లోని అసంతృప్తి, చైతన్యం వల్ల కొన్నాళ్లకు దేశవ్యాప్తంగా మళ్లీ కార్మిక సంఘాలు పుట్టుకొచ్చాయి. ఆ సంఘాలన్నీ బార్టిమోర్ నగరంలో 1866 ఆగస్టులో సమావేశమై 'జాతీయ కార్మిక సంస్థ'గా ఏర్పడ్డాయి. దీని నిర్మాణంలో సిల్విస్ క్రియాశీలపాత్ర పోషించాడు. ఈ సమావేశంలో 'కార్మికులను పెట్టుబడిదారీ బానిసత్వం నుంచి స్వేచ్ఛ పొందేలా చేయడ మే ప్రథమ కర్తవ్యం. 8 గంటల పనిదినం న్యాయ శాసనాన్ని సాధించేందుకు సర్వ శక్తులొడ్డుదాం' అని ఆ సంస్థ తీర్మానించింది. దాని రాజకీయ కార్యచరణ, ఆందోళనల ఫలితంగా 1868లో ఆరు రాష్ట్రాలు ఎనిమిది గంటల పనిదినాన్ని (పబ్లిక్ వర్క్స్) అమలు చేయాలని చట్టాలు చేశాయి.
1873లో మరోసారి ఆర్థికమాంద్యం చుట్టుముట్టడంతో యాజమాన్యాలు పని గంటల్ని పెంచాయి. ఆదివారాల్లోను, పండగ సెలవుల్లోను పనిచేయించేవి. దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమాలు నిర్వహించినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ఒకరికి దెబ్బ తగిలితే


సిల్విస్ మరణంతో జాతీయ కార్మిక సంస్థ బలహీనపడింది. కార్మికుల్లో ప్రభుత్వంపై, ఫ్యాక్టరీ యజమానులపై రోజు రోజుకి అసంతృప్తి పెరిగిపోయింది. ఆ కాలంలోనే 'నైట్స్ ఆఫ్ లేబర్(కార్మిక యోధులు)' అనే సంస్థ ఆవిర్భవించి అది లేనిలోటును పూరించింది. 1872లో అది ఒక నిబంధనావళిని విడుదల చేసింది. 'కార్మికులు ఆనందంగా గడపడానికి, ఇతర ఆలోచనలతో మేధాశక్తిని పెంచుకోవడానికి కొంత విశ్రాంతి కావాలి. అందుకు పని దినాన్ని ఎనిమిది గంటలకు తగ్గించాలి.' అని ఆ నిబంధనావళిలో రాసుకుంది. అంతేకాకుండా 'ఒకరికి దెబ్బ తగిలితే అందరూ స్పందిచాల్సిందే' అని కార్మికులకు పిలుపునిచ్చింది. 1881లో మేలో కానీ సెప్టెంబరులో కానీ మొదటి సోమవారం నాడు కార్మికులు ఎనిమిది గంటల పని దినం కోసం యజమానుల్ని డిమాండ్ చేయాలని నిర్ణయించినా సాధించలేకపోయింది.

పోరుబాట


పిట్స్‌బర్గ్‌లో 1881లో సమావేశమైన వృత్తికారుల సంఘాల, నైట్స్ ఆఫ్ లేబర్ ప్రతినిధులు; ఆరుగురు మార్క్సిస్టులు 'ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా' అనే సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంఘ సభ్యుల్లో ఎనిమిది గంటల పనిదినం కావాలనేవారే ఎక్కువ. అక్టోబరు 7, 1884లో ఈ ఫెడరేషన్ నాలుగో సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మే 1, 1886 నుంచి చట్టబద్దమైన ఎనిమిది గంటల పనిదినం ఉండాలని ఓ తీర్మానం చేసింది. దాన్ని సాధించేందుకు కార్మిక పోరాటమే మార్గం' అని ఎలుగెత్తి చాటింది.

సమర సన్నాహాలు


పోరుబాట ఎంచుకున్న ఫెడరేషన్‌లో సభ్యుల సంఖ్య యాభైవేలు మాత్రమే. మే 1, 1886 సమ్మెకు కార్మిక సంఘాల, కార్మికుల మద్దతు కూడగట్టేందుకు '8 గంటల పనిదినపు సమితి' అనే కమిటీలను నియమించింది. ఈ కమిటీలు యజమానులతో సంప్రదింపులు జరపడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కొన్ని ప్రతిపాదనల్ని కూడా రూపొందించాయి. సమ్మెకంటే ముందే ప్రదర్శనలు, సభలు, సర్క్యులర్ల ద్వారా ప్రచార ఆందోళనలు నిర్వహించాయి. ఈ ప్రచారం కార్మికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాదు. వారిలో విశ్వాసాన్ని పెంపొందించింది. ఫెడరేషన్ సమ్మె పిలుపుకు కార్మికుల మద్దతు పెరిగింది. ఈ సమ్మె పిలుపు కార్మిక యోధుల్లో అంతర్గత సంఘర్షణకు తెరతీసింది.

చివరికది సమ్మెకు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలింది. అనుకూల వర్గం ఈ సమ్మెకు మద్దతుగా నిలవడంతో సమ్మె సన్నాహాలు విస్తృతంగా జరిగాయి. ఫలితంగా ఈ రెండు సంఘాల సభ్యత్వం గణనీయంగా పెరిగింది. ఈ సమ్మెకు సోషలిస్టు లేబర్ పార్టీ నుంచి వేరుపడిన వారంతా 'సోషల్ రివల్యూషనరీ క్లబ్' పేరుతో సంఘటితమై దీనికి మద్దతు పలికారు. వీరిని అనార్కిస్టులు (అరాచకవాదులు) అని కూడా పిలిచేవారు. ఈ అనార్కిస్టులు 1883లో ఇంటర్నేషనల్ వర్కింగ్ పీపుల్స్ అసోషియేషన్‌ను ఏర్పరిచారు. ఈ సమ్మెకు వామపక్ష కేంద్ర కార్మిక సంఘం కూడా మద్దతు ప్రకటించింది. మొత్తానికి సమ్మెకు అనుకూలంగా కార్మికుల మద్దతు కూడగట్టడంలో 8 గంటల పనిదినపు సన్నాహక సమితులు విజయం సాధించాయి.
ఫెడరేషన్ కార్మికులకు జారీచేసిన సర్క్యులర్‌లో ఇలా ఉంది.
"పీడించబడుతున్న కార్మికుల్లారా మేల్కొనండి. మే1,1886 నాడు పనిముట్లను కిందపడెయ్యండి. పరిశ్రమల్ని, గనుల్ని మూయించండి. ఆ రోజు విశ్రాంతి కోసం కాదు తిరుగబాటు కోసం. ఆ రోజు 8 గంటల పనికోసం, 8 గంటల విశ్రాంతి కోసం, 8 గంటలు మనకిష్టమైన పనుల కోసం ఆ రోజే జీవితాన్ని అనుభవించడం మొదలయ్యే రోజు.''

చికాగో, మే 1 (శనివారం)


మే1న జరిగిన సమ్మెలో దేశవ్యాప్తంగా సుమారు అయిదు లక్షల మంది పాల్గొని ప్రదర్శనలు, సభ్యులు జరిపారు. అసంఘటితంగా ఉన్న కార్మికులు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. చికాగో వామపక్ష కార్మికోద్యమాలకు కేంద్రం కావడంతో సమ్మె మహోధృతంగా సాగింది. ఇందులో అనార్కిస్టులు క్రియాశీలకంగా పనిచేశారు. కార్ఖానాల్ని వదిలిపెట్టిన కార్మికులతో చికాగో వీధులు కిటకిటలాడాయి. 1886 మే 1న మొదలైన ఈ సమ్మె చికాగో నగరంలో పరాకాష్టకు చేరింది. అయితే ఆ పరిణామాలను పెట్టుబడిదారులు చూస్తూ కూర్చుండిపోలేదు. ఈ ఉద్యమాన్ని ఎలాగయినా దెబ్బతీయాలని... ఇది 'సామాజిక యుద్ధం', 'పెట్టుబడి పట్ల అసహ్యం' అని విషప్రచారం చేశారు. దీన్ని అణిచివేయాలని కిరాయి హంతక ఏజెన్సీలతో, ప్రభుత్వ బలగాలతో చేయి కలిపారు.

చికాగో, మే 3 (సోమవారం)


'మెక్ కోర్మిక్ రీపడ్ వర్క్స్'కు చెందిన కార్మికులంతా ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ సభ జరుగుతోంది. ఈ సభపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. కార్మికులపై అమానుషం గా విరుచుకుపడ్డారు. ఈ పాశవికదాడిలో ఆరుగురు కార్మికులు చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు.

చికాగో, మే 4 (మంగళవారం)


సోమవారం నాటి దాడిని ఖండిస్తూ హే(గడ్డి) మార్కెట్ చౌక్ వద్ద నిరసన సభ నిర్వహించాలని సమ్మె కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఈ సభకు రావాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశాయి. అనుకున్నట్లుగానే రాత్రి ఏడు గంటలకు వేలాది మంది కార్మికులు సభాస్థలికి చేరుకున్నారు. సభలో కార్మిక నేత ఆగస్ట్ స్పైస్ ప్రసంగిస్తున్నాడు. ఈ లోగా కార్మిక నేతలు అల్బర్ట్ పార్సన్, శామ్యూల్ ఫీల్డెన్ కూడా సభావేదికకు చేరుకున్నారు. పార్సన్ ఉపన్యాసం ముగిసింది. చివరి ఉపన్యాసకుడు ఫీల్డెన్ మాట్లాడుతున్నాడు. ఆకాశంలో ఉరుములు, మెరుపులు. వర్షం వచ్చే సూచన.. సభలో జనం పలుచబడ్డారు. సుమారు రెండు వందల మంది ఉండుంటారు. సమయం పదిన్నర గంటలవుతోంది. ఫీల్డెన్ ఉపన్యాసం మరికాసేపయితే ముగుస్తుందనగా... సుమారు రెండొందల మంది పోలీసులు ఆ సభా స్థలిని హఠాత్తుగా చుట్టుముట్టారు.

ఈ సభను నిలిపివేయాలని పోలీసు అధికారి ఆదేశించాడు. 'ప్రశాంతంగానే జరుగుతోందిగా' అని ఫీల్డెన్ బదులిచ్చాడు. ముందేవేసుకున్న పథకం ప్రకారం... ఎవరో అనామకుడు ఆ సభలో బాంబు విసిరాడు. ఒక పోలీసు చనిపోయాడు. వెంటనే పోలీసులు రెచ్చిపోయారు. కార్మికులపై తుపాకీ గుళ్ల వర ్షం కురిపించారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఈ గాయాల వల్ల ఆరుగురు పోలీసులు, నలుగురు కార్మికులు చనిపోయారు. (ఈ ఘటన కు బా«ధ్యుల్ని చేస్తూ ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారిచారు. వీరిపై ఉన్న నేరారోపణలు నిరూపణ కానప్పటికీ కోర్టు అన్యాయంగా ఏడుగురికి మరణ శిక్షను, ఒకరికి15 సంవత్సరాల జైలుశిక్ష విధించింది.)

చికాగో, మే 5 (బుధవారం)


మిలేవేకి, హే మార్కెట్ ఘాతుకాలకు నిరసనగా కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పోలిష్ కార్మికులు ఎక్కువమంది పాల్గొన్నారు. గవర్నరు ఆదేశాలతో పోలీసులు భారీగా మొహరించారు. పోలీసులు ఈ ప్రదర్శనపై నేరుగా కాల్పులు జరపడంతో తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు. పైగా 50 మంది కార్మికులపై నే రం మోపి, విచారించి కొంత మందికి శిక్షలు వేశారు.
ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని నిర్వహించడం సాధ్యం కాలేదు. సమ్మెలు విఫలమయ్యాయి. పోలీసు హింసాకాండ, యాజమాన్యాల కుట్రల వల్ల మే నెల మధ్యలోనే ఈ ఉద్యమం ఆగిపోయింది. కాని దేశం మొత్తం మీద 2 లక్షల మంది కార్మికులు పని గంటల్ని తగ్గించుకోగలిగారు. శనివారం అర్థ పనిదినంగా యాజమాన్యాలు అంగీకరించాయి. కాని వాటి అమలు అంతంతమాత్రమే. చల్లారిపోయిందనుకున్న కార్మికోద్యమం మళ్లీ వేడెక్కింది. మే1, 1890 నుంచి ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చింది.

ఆ ఉద్యమానికి ఐరోపా దేశాల కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. జూలై 14-20, 1889లో అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ జరిగింది. ఈ సమావేశంలోనే రెండవ ఇంటర్నేషనల్ ఏర్పడింది. ఈ సదస్సు చికాగో కార్మికోద్యమ త్యాగాల్ని, ప్రాధాన్యతను గుర్తిస్తూ మే 1వ తేదీని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరపాలని పిలుపునిచ్చింది. అప్పటినుంచి అంటే మే1,1890 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మేడేని వాడ వాడలా నిర్వహిస్తున్నారు. ఆనాటి చికాగో వీరుల త్యాగమే నేటికీ కార్మికోద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.