ఆదిమానవుల కాలంలో వజ్రం అంటే ఏమిటో దాని విలువ ఏమిటో ఎవ్వరికీ తెలీదు. నాగరకత పెరుగుతున్న కొద్దీ ఆభరణాల వాడకంలో వజ్రానికీ విలువ పెరిగింది. వజ్రాన్ని సానబట్టే కొద్దీ, దాని ఆకారం చిన్నదైన కొద్దీ విలువ రెండింతలవుతుంటుంది. అదీ వజ్రం గొప్పదనం.
వాస్తవానికి వజ్రానికి నిర్దిష్టమైన రంగు అంటూ ఉండదు. కాని మన కంటికి కనిపించే దానిని ఆధారం చేసుకుని అవి ఆయా రంగుల్లో ఉన్నట్లు భావిస్తాం. ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనంత విలువైన వజ్రాలు భరతమాతకు అలంకారంగా ఉండేవి. ఆంగ్లేయుల పరిపాలన కాలంలో... ప్రపంచంలోకెల్లా అతి విలువైన వజ్రాలు బ్రిటన్కు తరలివెళ్లాయి. అవన్నీ ఇప్పుడు వారికి పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. నవరత్నాలలో వజ్రానిది అగ్రస్థానం. వజ్రపుటుంగరం ధరించడమంటే అది రాజరికానికి చిహ్నం. పూర్వం రాజుల కాలంలో శత్రువుల నుంచి ఆపద కలిగే సమయంలో శత్రువుకు చిక్కడం కంటె మర ణించడమే మేలని భావించి వేలికున్న ఉంగరంలోని వజ్రాన్ని మింగేవారట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక విలువైన వజ్రాలున్నాయి. వాటిలో అత్యంత విలువైనవి ఐదు. అవి: హోప్ డైమండ్, కోహినూర్ డైమండ్, సాన్సీ డైమండ్, కలినాన్ డైమండ్, విటిల్స్బ్రాచ్-గ్రాఫ్ డైమండ్.
1. హోప్ డైమండ్: నీలిరంగులో ఉండే ‘హోప్ డైమండ్’ విలువ సుమారు 350 మిలియన్ల అమెరికన్ డాలర్లు. (సుమారు 1600 కోట్ల రూపాయలు). సీతాదేవి విగ్రహానికున్న కంటిలోనుంచి పాశ్చాత్యులు దీనిని తస్కరించినట్టు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇది వాషింగ్టన్ మ్యూజియంలో ఉంది.
2. కోహినూర్ (మౌంటైన్ ఆఫ్ లైట్): పరిమాణంలో ప్రపంచంలోకెల్లా పెద్ద వజ్రం ఇది. శ్వేతవర్ణంలో ఉంటుంది. కాకతీయుల కాలంలో గుంటూరులో లభించింది. వెల అమూల్యం. లండన్ టవర్లో ఉంది.
3. సాన్సీ డైమండ్: లేత పసుపుపచ్చ రంగులో, షీల్డ్ ఆకారంలో ఉండే శాన్సీ డైమండ్ విలువ కూడా అమూల్యమే. ప్రస్తుతం ఇది పారిస్లోని లోవర్ మ్యూజియంలో ఉంది.
4. కలినాన్ డైమండ్: శ్వేత వర్ణంలో ఉండే దక్షిణాఫ్రికాకు చెందిన కలినాన్ డైమండ్ ప్రస్తుతం బ్రిటిష్ రాజకిరీటంలో ఉంది. దీని విలువ 400 మిలియన్ల డాలర్లు. (సుమారు 1800 కోట్ల రూపాయలకు పైగా)
5. విటిల్సబ్యాచ్ - గ్రాఫ్ డైమండ్: నీలివర్ణంలో ఉండే విటిల్స్బ్యాచ్ గ్రాఫ్ డైమండ్ ఇప్పుడు వాషింగ్టన్ మ్యూజియంలో ఉంది. రెండేళ్ల క్రితం నాటికే ఈ వజ్రం విలువను 16.4 మిలియన్ పౌండ్లుగా లెక్కించారు. (సుమారు 200 కోట్లకు పైగా).
వాస్తవానికి వజ్రానికి నిర్దిష్టమైన రంగు అంటూ ఉండదు. కాని మన కంటికి కనిపించే దానిని ఆధారం చేసుకుని అవి ఆయా రంగుల్లో ఉన్నట్లు భావిస్తాం. ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనంత విలువైన వజ్రాలు భరతమాతకు అలంకారంగా ఉండేవి. ఆంగ్లేయుల పరిపాలన కాలంలో... ప్రపంచంలోకెల్లా అతి విలువైన వజ్రాలు బ్రిటన్కు తరలివెళ్లాయి. అవన్నీ ఇప్పుడు వారికి పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. నవరత్నాలలో వజ్రానిది అగ్రస్థానం. వజ్రపుటుంగరం ధరించడమంటే అది రాజరికానికి చిహ్నం. పూర్వం రాజుల కాలంలో శత్రువుల నుంచి ఆపద కలిగే సమయంలో శత్రువుకు చిక్కడం కంటె మర ణించడమే మేలని భావించి వేలికున్న ఉంగరంలోని వజ్రాన్ని మింగేవారట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక విలువైన వజ్రాలున్నాయి. వాటిలో అత్యంత విలువైనవి ఐదు. అవి: హోప్ డైమండ్, కోహినూర్ డైమండ్, సాన్సీ డైమండ్, కలినాన్ డైమండ్, విటిల్స్బ్రాచ్-గ్రాఫ్ డైమండ్.
1. హోప్ డైమండ్: నీలిరంగులో ఉండే ‘హోప్ డైమండ్’ విలువ సుమారు 350 మిలియన్ల అమెరికన్ డాలర్లు. (సుమారు 1600 కోట్ల రూపాయలు). సీతాదేవి విగ్రహానికున్న కంటిలోనుంచి పాశ్చాత్యులు దీనిని తస్కరించినట్టు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇది వాషింగ్టన్ మ్యూజియంలో ఉంది.2. కోహినూర్ (మౌంటైన్ ఆఫ్ లైట్): పరిమాణంలో ప్రపంచంలోకెల్లా పెద్ద వజ్రం ఇది. శ్వేతవర్ణంలో ఉంటుంది. కాకతీయుల కాలంలో గుంటూరులో లభించింది. వెల అమూల్యం. లండన్ టవర్లో ఉంది.
3. సాన్సీ డైమండ్: లేత పసుపుపచ్చ రంగులో, షీల్డ్ ఆకారంలో ఉండే శాన్సీ డైమండ్ విలువ కూడా అమూల్యమే. ప్రస్తుతం ఇది పారిస్లోని లోవర్ మ్యూజియంలో ఉంది.
4. కలినాన్ డైమండ్: శ్వేత వర్ణంలో ఉండే దక్షిణాఫ్రికాకు చెందిన కలినాన్ డైమండ్ ప్రస్తుతం బ్రిటిష్ రాజకిరీటంలో ఉంది. దీని విలువ 400 మిలియన్ల డాలర్లు. (సుమారు 1800 కోట్ల రూపాయలకు పైగా)
5. విటిల్సబ్యాచ్ - గ్రాఫ్ డైమండ్: నీలివర్ణంలో ఉండే విటిల్స్బ్యాచ్ గ్రాఫ్ డైమండ్ ఇప్పుడు వాషింగ్టన్ మ్యూజియంలో ఉంది. రెండేళ్ల క్రితం నాటికే ఈ వజ్రం విలువను 16.4 మిలియన్ పౌండ్లుగా లెక్కించారు. (సుమారు 200 కోట్లకు పైగా).
కాలిఫోర్నియాలో విద్యార్థిగా దక్షిణాఫ్రికా జాత్యాహంకారంపై ఉద్యమించిన నేను.. అప్పటి నుంచి రెండు దశాబ్దాల తర్వాత రాబిన్ ద్వీపంలో మండేలా జైలు గదిలో నిలబడ్డాను. అంతకు ముందే నేను సెనేటర్గా ఎన్నికయ్యాను. అప్పటికే- మండేలా జైలుగది త్యాగానికి ఒక చిహ్నంగా మారిపోయింది. ఆ గదిలో నిలబడి- మండేలా ఖైదీ 466-44 గా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేదా అని ఊహించుకోవటానికి ప్రయత్నించాను. ఆ సమయంలో ఆయన విజయం ఒక అనిశ్చితి మాత్రమే. చరిత్రను మార్చిన మండేలా ఆ జైలు గదిలో ఎలా ఉండేవాడో తల్చుకోవడానికి ప్రయత్నించా.''
కొన్ని ఆకర్షణీయమైన డిజైన్లు యుకె బ్రాండ్ ‘మావీ’ భారతదేశంలోనూ విడుదల చేసింది. ఇవి భారతదేశానికి ఈ సంవత్సరమే కొత్తగా దిగు మతి అయ్యాయి. ప్రస్తుతం ఇవే యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. జ్యూయెలరీకి సరికొత్త దారులు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి స్టన్నింగ్ జ్యూయెలరీ ఎస్ఎస్11 రేంజ్లో దొరుకుతోంది. అందులో కొన్ని డిజైన్లు టూటీ ఫ్రూటీ సింగిల్ క్లా-సెట్, ముత్యాతలతో తయారైన రింగ్ నెక్లేస్ మరికొన్ని డిజైన్లు వున్నాయి. డైనమేట్ పెండెంట్తో తయారైన లేయర్ చెయిన్ మరింత అందంగా తయారైంది. పార్టీలో వేసుకునేందుకు వైల్డ్ లుక్గల ఆభరణాల తయారీలోనూ వీరు ఎంతో ముందున్నారు. మిగిలిన కలెక్షన్లలో గ్రిసోగానో, మటాస్సా గోల్డ్ ఆభర ణాలు వున్నాయి. 








