Tuesday, November 16, 2010

TOP TEN OF EVERYTHING

The contents deserve to be kept on permanent record with you?

COUNTRIES













Business & Consumerism






Geography





Vacations




Automobiles




Miscellaneous




Colourful Planes

COLOURFUL PLANES

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Colourful Planes - Phani Kiran: World Informatives

Thank You !

Every House has A Beach at Dubai

Palm Jumeirah @ DUBAI

Every House Has A Beach at Dubai - Phani Kiran: World Informatives

Every House Has A Beach at Dubai - Phani Kiran: World Informatives

Every House Has A Beach at Dubai - Phani Kiran: World Informatives

Every House Has A Beach at Dubai - Phani Kiran: World Informatives

Every House Has A Beach at Dubai - Phani Kiran: World Informatives

Now see this stuff.
This is taken from world's tallest building "Burj Dubai" @ 2,620 ft / 801m!!!
What do you think guys

Every House Has A Beach at Dubai - Phani Kiran: World Informatives

Really amazing
Look at the edge (uppermost right corner) of the picture, you can almost see the turn of the earth

Every House Has A Beach at Dubai - Phani Kiran: World Informatives

The persons who are working on the upper most Girders can see the "ROTATION OF EARTH"
So terrifying..

Thank You

Sunday, November 7, 2010

ఆ దారిలో...రెండు చరిత్ర చిహ్నాలు

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి కొత్తగా తెలుసుకునేది ఏముంది అనుకోవద్దు. ఆ నిలువెత్తు విగ్రహం గురించి మీరు ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు కాని దాని దగ్గరకు వెళ్లే దారిలోని రెండు ముఖ్యమైన ప్రదేశాల గురించి మాత్రం చదివి ఉండకపోవచ్చు. ఒకటి ఎల్లీస్ దీవి- 400 ఏళ్ల క్రితం యూరప్ నుండి వలస వచ్చిన లక్షలాది మందిని అమెరికన్ గడ్డ మీదికి ఆహ్వానించిన ప్రదేశం. రెండోది 'సెంట్రల్ రైల్ రోడ్ న్యూజెర్సీ(సీఆర్ఆర్ఎన్‌జీ) టర్మినల్' అలా వచ్చిన వారిని అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చేరవేసిన స్టేషన్..

అమెరికా అనగానే వెంటనే గుర్తుకొచ్చేది 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'. ఈ విగ్రహం వద్దకు వెళ్లాలంటే ముందు 'లిబర్టీ పార్కు'కి వెళ్లాలి. అధిక జనసాంద్రత కలిగిన న్యూజెర్సీ ప్రాంతంలో అది ఒక ఒయాసిస్. అంటే ఎడారి మ«ధ్యలో ఉండే పచ్చని ప్రదేశము. ఆ పార్కు 1212 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. అందులోని 'సి.ఆర్.ఆర్.ఎన్.జె. టర్మినల్' వద్దే లిబర్టీ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు టిక్కెట్ కొనాలి. ఫెర్రీ ద్వారా లిబర్టీ ద్వీపానికి, ఎల్లీస్ ద్వీపానికి హడ్సన్ నది గుండా ప్రయాణించాలి. మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా 12 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నా, శ్రీవారి వృత్తి రీత్యా వెసులుబాటు కాక ఈ సంవత్సరము జులైలో అక్కడికి వెళ్లడం జరిగింది. మా అబ్బాయి ఉండే న్యూజెర్సీలోని చెష్టర్ ఫీల్డు ప్రాంతం నుంచి లిబర్టీ పార్కుకు ఒక గంట డ్రైవ్. లిబర్టీ పార్కులోని సి.ఆర్.ఆర్.ఎన్.జె. టెర్మినల్ నుంచి ప్రతి అరగంటకి ఫెర్రీలు ఉంటాయి. మొదటి ఫెర్రీ ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది.

మేము టిక్కెట్ కొని లోపలికి వెళ్లి లైనులో నిలుచున్నాము. అక్కడ మగవాళ్లంతా సాక్సు, షూస్, బెల్టు, పెన్, సెల్ మొదలైన వస్తువులు తీసి ఒక ట్రేలో పెట్టాలి. ఆడవారు సాక్సు, షూస్‌తో పాటు హెయిర్ క్లిప్స్, చేతికున్న గాజులు కూడ తీసి ట్రేలో పెట్టాలి. తరవాత మెటల్ డిటెక్టర్‌తో మగవారిని మగవారు, ఆడవారిని ఆడవారు జాగ్రత్తగా పరిశీలిస్తారు. తరవాత ట్రేలో ఉన్న వస్తువులను స్కాన్ చేసి ఇచ్చేస్తారు. ఎవరి వస్తువులు వాళ్లకి వచ్చాక ఫెర్రీ ఎక్కేందుకు మళ్లీ లైన్లో నిలుచోవాలి. ఫెర్రీలో కిందా, పైనా సీట్లు ఉంటాయి. అక్కడి నుంచి ఎల్లీస్ ద్వీపానికి పది నిమిషాల ప్రయాణం.

ఎల్లీస్ ద్వీపం

ఈ ద్వీపం హడ్సన్ నదిలో ఒక ఇసుక దిబ్బ. మన్‌హట్టన్‌కి సరిగ్గా దక్షిణ వైపు ఉంది. ఇక్కడ ఒకనాడు 'మెహెగన్ ఇండియన్‌లు' ఉండేవారు. అప్పట్లో ఇది 'కి యెష్కు ఐలాండ్'గా పిలువబడేది. యు.ఎస్.ఎ ఏర్పడ్డాక 'ఎల్లీస్ శామ్యూల్' అనే వ్యాపారవేత్త ఈ ద్వీపాన్ని కొని తన పేరు పెట్టుకున్నాడు.
ఉత్తర, పశ్చిమ యూరప్ దేశాల నుంచి జర్మనీ, ఐర్లాండ్, బ్రిటన్ దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి పెద్ద ఎత్తున వలసలు వచ్చారు. యుద్ధాల వల్ల కావచ్చు, మతవైషమ్యాల వల్ల కావచ్చు, కరువుకాటకాల వల్ల కావచ్చు... కారణము ఏదైౖనా కానీ వాళ్లందరూ ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి అట్లాంటిక్ సముద్రం దాటి తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు ఈ ద్వీపాన్ని చేరేవారు.

ఫెడరల్ ఇమిగ్రేషన్ స్టేషన్

ఎల్లీస్ ద్వీపంలో ప్రభుత్వం వారు రెండు గృహాలను నిర్మించి వాటిలో అంటువ్యాధుల వారిని, మానసిక రోగులను ఉంచేవారు. ఆరోగ్యపరంగానూ, చట్టపరంగానూ అర్హత కలిగిన వారికే వీసా ఇచ్చి అమెరికాలోకి ప్రవేశం కల్పించేవారు. ఆ విధంగా 1892లో 'ఫెడరల్ ఇమిగ్రేషన్ స్టేషన్' ప్రారంభించడం జరిగింది. వలస వచ్చిన వారు తమతో తీసుకొచ్చి వదిలేసిన తట్టలు, చెక్కసామాను, ఇనుప పెట్టెలు మొదలైన వాటిని సందర్శకుల కోసం ఒక పెద్ద హాలులో ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా 1900- 1914 మధ్యకాలంలో వలసల సంఖ్య రోజుకి 5000 నుంచి 10000 వరకు ఉండేదట.
వలసలు తగ్గుముఖం పట్టడం, వలసల సంఖ్య పరిమితం చేయడం వలన కూడా 1954లో ఇమిగ్రేషన్ స్టేషన్‌ని మూసేశారు. ఎల్లీస్ ద్వీపానికి వలస వచ్చినవారి వివరాలతో, సంతకాలతో ఒక పట్టిక అందుబాటులో ఉంది. ఇప్పటికీ అనేక మంది తమ తమ పూర్వీకుల వివరాలు తెలుసుకునేందుకు ఎల్లీస్ ద్వీపానికి వెళ్తుంటారు. 1960 ప్రాంతాల్లో ఆసియా నుంచి అమెరికాకి వలస వెళ్లిన వారి సంఖ్య మిగతా దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు అక్కడున్న ఒక పట్టిక తెలియజేస్తుంది.

ఎల్లీస్ ద్వీపంలో వీటిని చూసిన తరవాత మరల ఫెర్రీ ఎక్కాము. అదే టిక్కెట్‌తో ఫెర్రీలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి ప్రయాణం చేయవచ్చు. రకరకాల దేశాలవారితో, రకరకాల మనుష్యులతో ఆ ప్రయాణం భలే సరదాగా సాగిపోయింది. పదిపదిహేను నిమిషాల్లో లిబర్టీ ద్వీపము చేరాము. అక్కడ నుంచి చూస్తే విగ్రహం వెనక మన్‌హట్టన్, బ్రాక్‌లిన్ బ్రిడ్జీ కనిపిస్తాయి.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ

సంప్రదాయబద్ధమైన పొడవైన వస్త్రాన్ని నిండుగా ధరించిన స్త్రీమూర్తి విగ్రహం అది. కుడిచేతిలో పైకి ఎత్తి చూపుతున్న 42 అడుగుల పొడవున్న జ్యోతి, ఎడమ చేతిలో అమెరికాకి స్వాతంత్య్రం ప్రకటించిన 4 జూలై 1776 వ తేదీతో రాయబడిన రాతి శాసనం, మెడలో విరిగిన హారము (ఇది బానిసత్వపు వలస పరిపాలనా శృంఖలాల నుంచి విముక్తికి సూచన) తలపై మిరిమిట్లు గొలుపుతూ మొనదేలిన ఏడు కిరణాలతో (ఈ ఏడు కిరణాలు సప్త సముద్రాలకు, సప్త ఖండాలకు సూచన) మెరిసే కిరీటంతో మూర్తీభవించిన స్త్రీమూర్తి విగ్రహం అది.

నాలుగు స్టీలు స్తంభాలపై నిర్మించిన ఇనుప చట్రం, దానిపైన రాగి కవచము. ఈ విగ్రహాన్ని నిర్మించాలన్న ఆలోచన 1865లో ఫ్రెంచ్ లా ప్రొఫెసర్, రాజకీయనాయకుడైన 'డెలిబొలె'కి రాగా, శిల్పకారుడైన 'బర్తోల్టి' అతని ఆలోచనకు ఉత్తేజితుడై కార్యరూపం ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను నిర్మించిన చీఫ్ ఇంజనీరు 'గస్టవే ఈఫిల్'యే ఈ లిబర్టీ విగ్రహాన్ని కూడా నిర్మించాడు. ఫ్రాన్స్, అమెరికా దేశాల ఉమ్మడి కృషిగా తయారైంది ఇది. విగ్రహం నిలుచున్న దిమ్మ నిర్మాణం అమెరికా చేపట్టగా, విగ్రహాన్ని ఫ్రెంచివారు తయారు చేశారు. అమెరికన్ విప్లవంలో మరణించిన సైనికుల స్మృతి చిహ్నంగా ఫ్రాన్స్ ప్రజలు ఇరు దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలను పెంపొందించుకునేందుకు 1886 అక్టోబర్ 28 వ తేదీన దీన్ని అమెరికా ప్రజలకు కానుకగా ఇచ్చారు. ఈ విగ్రహాన్ని 350 భాగాలుగా 214 పెట్టెల్లో ఉంచి ఫ్రాన్స్ నుంచి న్యూయార్క్ హార్బర్‌కు నౌకలో పంపారు. న్యూయార్క్ హార్బర్‌లో ఈ విడిభాగాలను తిరిగి ఏక విగ్రహముగా అమర్చారు. దీని ఎత్తు 151 అడుగులు, విగ్రహం పెట్టిన దిమ్మె ఎత్తు 154 అడుగులు. మొత్తం కలిపి 305 అడుగులు. దిమ్మె 11 కోణాలు కలిగిన నక్షత్రం ఆకారంలో ఉండగా, గోడలు గ్రానైట్ రాతితో నిర్మించబడ్డాయి. దిమ్మె చుట్టూ ఇనుప కంచె ఉంటుంది. దిమ్మె ద్వారము నుంచి పైన కిరీటం వద్దగల అబ్జర్వేటరీ వరకు వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. పై వరకు వెళ్లాలంటే విడిగా టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

- 1912లో ఫ్రెడరిక్ అనే అతను విగ్రహం జ్యోతి వద్ద గల అబ్జర్వేటరీ ఫ్లాట్‌ఫామ్ నుంచి 75 అడుగుల పొడవున్న పారాచ్యూట్ ద్వారా దిగ్విజయంగా క్రిందికి దూకాడు.
- 1929లో రాల్ఫ్ గ్లేసన్ అనే వ్యక్తి విగ్రహం కిరీటం వద్దనున్న కిటికీలోంచి బయటకు చూసి తిరిగి వస్తున్నప్పుడు కాలుజారి కిందపడి మరణించాడు.
- 1982లో ఒక గర్భవతి విగ్రహం పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా పురిటినొప్పులు వచ్చి అక్కడే ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇలా విగ్రహానికి సంబంధించి సంతోషకరమైన, విచారించదగ్గ సంఘటనలు చాలా ఉన్నాయట. ఈ విగ్రహాన్ని చూసిన తరవాత లిబర్టీ హౌస్ రెస్టారెంట్‌కి వెళ్లాము. ఆ దేశంలో ఏదైనా ముఖ్యమైన ప్రదర్శనా స్థలానికి వెళ్లినప్పుడు బయటికి వచ్చే మార్గంలో గిఫ్టు షాపింగ్ ఉంటుంది. అది వారి సంప్రదాయ. రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న వారికి లిబర్టీ బొమ్మల కొనుగోలులో కొంత రాయితీ ఇస్తారు. ఇవన్నీ వ్యాపార మెళకువలు.
దారిలో బర్తోల్టి, ఈఫిల్, పులిట్జర్, కొలంబస్, జెఫర్‌సన్, జార్జి వాషింగ్టన్ మొదలైన ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.

డబ్ల్యుటిసి చూడలేకపోయాం

ఫెర్రీ ఎక్కేందుకు రెండు క్యూలు ఉన్నాయి. ఒకటి న్యూయార్క్ వైపు వెళ్లేందుకు, రెండోది న్యూజెర్సీ వైపు వెళ్లేందుకు. మేము న్యూజెర్సీ వైపు వెళ్లే ఫెర్రీ ఎక్కాము. అమెరికాలో మే, జూన్, జులై నెలల్లో విపరీతమైన ఎండలు. 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. వేడి, చురుకుదనం ఎక్కువగా ఉండడం వల్ల కొత్త వారికి తప్పకుండా తలనొప్పి వస్తుంది. లిబర్టీ ద్వీపమంతా ఎండలో తిరిగిన కారణంగా, ఫెర్రీ బయలుదేరగానే హడ్సన్ నది నుంచి వచ్చే చల్లటిగాలి తనువును తాకి సేదతీరినట్టయింది. హడ్సన్ నది పరవళ్లు, ఫెర్రీ శబ్దం రెండూ కలిసి విచిత్రంగా అనిపించింది. సహజంగానే పిల్లలకి నీళ్లంటే ఇష్టం కదా. ఆ సమయంలో మా మనవడి సంతోషానికి అవధులు లేవు.

నదిలో ప్రయాణించే ఆ ఇరవై నిమిషాలూ ప్రకృతి దృశ్యాలను చూస్తూ మంత్రముగ్దులయిపోతాము. అలా వెళ్తుంటే న్యూయార్కు వైపు మన్‌హటన్‌లోని పెద్దపెద్ద భవనాలు ఆకాశహర్మ్యాలను తలపింపజేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంత ఎత్తైన భవన సముదాయాల మధ్యే 2001 సెప్టెంబర్ 11న ముష్కరుల చేతిలో ధ్వంసమైన 'వరల్డ్ ట్రేడ్ సెంటర్' ఉండేది గదా, దాన్ని చూడలేకపోయామే అని ఒకింత నిరాశ కలిగింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలన్న ఆతృతలో సి.ఆర్.ఆర్.ఎన్.జె. అంటే ఏమిటనిగానీ, అక్కడ రైలు పట్టాలు ముళ్లపొదలతో, పిచ్చి మొ క్కలతో నిండివుండడం గాని గమనించలేదు. 'ఈ రైలు పట్టాలు ఏమిటని' తిరిగి వచ్చేటప్పుడు మా అబ్బాయిని అడిగాను.

"ఇది 'సెంట్రల్ రైల్ రోడ్డు న్యూజెర్సీ టెర్మినల్'. 1600 సంవత్సరంలో యూరప్ దేశాల నుంచి మూకుమ్మడిగా వలసలు వచ్చిన తరుణంలో దీని కార్యకలాపాలు అధికంగా ఉండేవి. న్యూయార్క్ హార్బరు ప్రధాన రవాణా కేంద్రంగా ముఖ్య భూమిక వహించింది. క్రమంగా ఇతర దేశాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామిక విప్లవం ఉధృతం కావడం, నగరాల్లో రోడ్డు మార్గాలు, ఆనకట్టలు అభివృద్ధి చెందడం మూలంగా 1950 నాటికి సి.ఆర్.ఆర్.యన్.జె. టెర్మినల్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టి 1967 నాటికి పూర్తిగా ఆగిపోయాయి. ఎంతో చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌ను గత చరిత్ర స్మృతి చిహ్నంగా ఉంచేందుకు 1968లో జెర్సీసిటీ 156 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. 1976 జూన్ 14న న్యూజెర్సీ ప్రభుత్వం లిబర్టీ పార్కుని ద్విశతాబ్ది కానుకగా జాతికి అంకితమిచ్చింది'' అని చెప్పుకొచ్చాడు.

న్యూయార్క్ హార్బరు లిబర్టీ పార్కుకి ఉత్తర దిశగా ఉంది. అప్పటి సేవలకు గుర్తుగా ఒక రైలు ఇంజను, కొన్ని పెట్టెలు లిబర్టీ పార్కులో పర్యాటకుల సందర్శనార్థం ఉంచారు.
ఎంతోమంది దేశవిదేశీయులను ఆకర్షిస్తూ ప్రపంచంలోని వింతలలో ఒకటైన లిబర్టీ విగ్రహాన్ని దర్శించడం గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయింది నా మనస్సులో శాశ్వతంగా.

- అవ్వా విజయలక్ష్మి, బచ్చుపేట, మచిలీపట్నం

Wednesday, November 3, 2010

ప్రకృతి వైపరీత్యాలతో రాటుదేలిన దేశమే ఇండోనేషియా.

సునామీ మినహా  అంతా సుఖమే

బంగారుగనులను దాచుకున్న ఆ నేలే ఇంకోవైపు అగ్నిపర్వతాలనూ మోస్తోంది. భూకంపాల్నీ, సునామీలను కూడా భరిస్తోంది. తరచూ సంభవించే ఈ వైపరీత్యాలతో రాటుదేలిన దేశమే ఇండోనేషియా. ప్రకృతి బీభత్సాలు భయాన్ని సృష్టిస్తున్నా ఇక్కడున్న ఉపాధి అవకాశాల వల్ల ప్రవాసీయుల తాకిడీ దీనికి ఎక్కువే.

ఎనిమిదేళ్ల క్రితం ఈ దేశానికి వచ్చిన ప్రవాసాం«ద్రుడు సబ్బవరపు హరి 'పేరులోనే కాదు కొన్ని ఆహారపు అలవాట్లలోనూ ఇండోనేషియా ఇండియాను కొంచెం పోలి ఉంటుంది' అంటారు. ఇక్కడి 'బిసానా అపెరల్ గ్రూప్' గార్మెంట్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన చెప్పిన విశేషాలు..

నేను ఇండోనేషియా వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది, నేనుండేది బోగోర్ అనే ఊళ్లో. జకార్తాకి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, ఇక్కడ 365 రోజులూ వర్షం పడుతుంది. అందుకే దీన్ని రెయిన్ సిటీ అంటారు. గొడుగు, రెయిన్ కోట్ లేకుండా ఎవరూ బయటకు వెళ్లరు. అంత అవసరం అవి.

ఈ మధ్యే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షాలు కొంచెం తగ్గినా.. రోజూ పడడం మాత్రం మానలేదు. అలవాటుపడేదాకా కొత్తగా వచ్చిన ఫారినర్స్‌కి, టూరిస్టులకు ఈ వర్షం ఇబ్బందినే కలిగిస్తుంది. ఇబ్బంది పడుతూనే ఎంజాయ్ చేస్తారు కూడా. నేను పనిచేసే గార్మెంట్ కంపెనీ ఎప్పుడో వందేళ్ల క్రితం ఇండోనేషియాలో స్థిరపడిన తమిళులది. మా కంపెనీలో 1800 మంది పనిచేస్తారు. అందులో ఏడుగురం మాత్రమే భారతీయులం. మిగిలిన అందరూ ఇండోనేషియన్లే.
టూ వీలర్ టాక్సీలు ఎక్కువ మా ఇంటికీ... ఫ్యాక్టరీకి పన్నెండు కిలోమీటర్ల దూరం. మాకు పనిమనిషి ఉంది. ఇంట్లో వంటతో సహా పనంతా చేస్తుంది. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలి. సర్వెంట్ మెయిడ్స్‌ను కూడా ఇక్కడ ఉద్యోగుల్లాగే చూస్తారు. ఇళ్లల్లో వంటమనుషులుగా పనిచేసే ఇండోనేషియన్లందరికీ భారతీయ వంటలు వచ్చు.

టిఫిన్ చేసి నేను ఏడింటికల్లా ఆఫీస్‌కి బయలుదేరుతాను. మెట్రొలు, బస్‌లు, ఆటోలు(లాంటివి) ఇక్కడి ప్రధాన రవాణా సౌకర్యాలు. టూవీలర్ టాక్సీలు కూడా ఎక్కువే. వీటివల్లే రోడ్లు రద్దీగా ఉంటాయి. ఏ కార్నర్‌లో చూసినా ఐదారుగురు హెల్మెట్లు పెట్టుకుని( హెల్మెట్ తప్పనిసరి) వెహికిల్స్‌తో నిలబడి ఉంటారు. అదీగాక చాలామంది బాగోర్( బాగోర్ ప్రాంతం చల్లగా, ప్రశాంతంగా చాలా బాగుంటుంది కాబట్టి)నుంచి జకార్తాకి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. దీనివల్ల కూడా ఆఫీస్ వేళల్లో మహారద్దీగా ఉంటాయి రోడ్లు. అయితే ఎవరూ ట్రాఫిక్ నియమాలను ఉలంఘించరు. పాదచారులకు ప్రాధాన్యం ఎక్కువ

.
చివరి మూడు రోజులూ బిజీ
అన్ని వ్యాపారాల్లోకీ గార్మెంట్ బిజినెసే టాప్ ఇక్కడ. ప్రతి ఫ్యాక్టరీలో కార్మికులకు భోజన, వైద్య సదుపాయాలు తప్పనిసరిగా ఉంటాయి. నా పనికొస్తే... భోజన సమయానికి ముందు ఎక్కువగా స్టాఫ్ మీటింగ్‌లు ఉంటాయి.అప్పటికప్పుడు చేయాల్సిన కొన్ని అత్యవసరమైన పనులూ ఉంటాయి.. ఒంటి గంటకు లంచ్.

తర్వాత మాన్యుఫాక్చరింగ్‌కి సంబంధించిన పనులు చూసుకుంటాను. ప్రతి రెండున్నర గంటలకు టీ బ్రేక్ ఉంటుంది. నాలుగు నుంచి మెల్లమెల్లగా ఆఫీస్ ఖాళీ అవుతుంటుంది. మాకు పని సమయం ఎనిమిది గంటలు. నిజానికి నాకు పనివేళలు ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు దాకా. ఓవర్ టైమ్ చేయాల్సి వస్తే ఓ రెండుగంటలు ఎక్కువుంటాం . అయితే వారం మొత్తం ఇలాగే ఉండదు

. అమెరికా, యూరప్ దేశాలకు చేయాల్సిన ఎగుమతులుంటాయి. ఎగుమతులను తీసుకెళ్లే షిప్‌లన్నీ శనివారం బయలుదేరుతాయి. ఆ రోజుకల్లా డెలివరీ ఇచ్చేయాలి కాబట్టి గురు, శుక్ర, శని వారాలు చాలా బిజీగా ఉంటాం.ఆ రోజుల్లో ఇంటికి తిరిగొచ్చే టైమ్ మా చేతుల్లో ఉండదు. మామూలు రోజుల్లో ఆరున్నర కల్లా ఇంటికి వచ్చేస్తాను. ఏడున్నరకి డిన్నర్ చేసి కాసేపు నెట్‌లో చాటింగ్, ఏదైనా చదువుకోవడం, ఇండియలో ఉన్న ఫ్రెండ్స్, బంధువులతో మాట్లాడ్డం లాంటివి చేస్తాను. అయితే మా దగ్గర టెలిఫోన్ లైన్స్ చాలా వీక్.

షారూఖ్ అంటే బాగా ఇష్టం

ఇక్కడ వారానికి ఆరు రోజుల పనిదినాలు. ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం ఒక్క పూటే ఉంటుంది. ఆదివారం రోజు జాలీగానే గడుపుతారంతా. మేమైతే ( మా కుటుంబం) ప్రతి ఆదివారం జకార్తాకి వెళ్తాం. అక్కడున్న ఇండియన్ స్టోర్స్‌లో కావల్సినవి కొనుక్కొంటాం. ఇండియన్ రెస్టారెంట్లలో లంచ్ చేసి సినిమాకి వెళ్తాం. పెద్ద పెద్ద హీరోల హిందీ సినిమాలన్నీ వస్తాయి.

ఇప్పుడు రోబో నడుస్తోంది. ఇక్కడి వాళ్లకు షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లంటే చాలా ఇష్టం. షారూఖ్ కుఛ్ కుఛ్ హోతా హై సినిమా అంటే పడి చస్తారు. ఆ సినిమా పాటలు అందరికీ వచ్చు. ఇండియన్స్ ఎవరు కనిపించినా...మీది షారూఖ్ ఖాన్ ఊరా? అని అడుగుతుంటారు. ఆహారం విషయానికి వస్తే...దొండకాయ తప్ప అన్నీ దొరుకుతాయి. వీళ్ల వంటలు కొన్ని మన వంటల్నే పోలి ఉంటాయి. అలాంటి వాటిని పడంగ్ ఫుడ్ అంటారు. సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. బాగా ఇష్టపడతారు కూడా . ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే... ఇండోనేషియన్లు ఇంట్లో వంట చేసుకోవడం చాలా తక్కువ.

హోటల్స్‌లోనే తింటారెక్కువగా. అందుకే ఇక్కడ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. భారతీయులు 35 వేల మంది దాకా ఉండొచ్చు. తమిళ్, పంజాబి అసోసియేషన్స్ ఉన్నాయి. తెలుగు కుటుంబాలు మాత్రం ఇరవై కన్నా ఎక్కువ లేవు. నెలకు ఒకసారి కలుసుకుంటాం. అందరం కలిసి దీపావళి గ్రాండ్‌గా చేసుకుంటాం. మన దేవాలయాలు చాలా ఉన్నాయి. పండగలకు, బర్త్‌డేలకు అక్కడికి వెళ్తుంటాం.

ఆడవాళ్లే ఎక్కువ...

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాలలో ఇండోనేషియా నాలుగవది. ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం. చాలా భాషలున్నా అధికార భాష మాత్రం బహాసా దీరా(bahasa deearh). భారతీయుల్ని చాలా ఇష్టపడతారు, గౌరవిస్తారు. ఫ్రెండ్లీగా ఉంటారు. ముస్లిం దేశమే అయినా ఆడవాళ్లు స్వేచ్ఛగానే ఉంటారు. నిజానికి పనిచేసేది ఎక్కువగా వాళ్లే. ఫ్యాక్టరిల్లో, ఆఫీసుల్లో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ కనిపిస్తారు.

భారతీయుల తర్వాత ఈ దేశంలో కనిపించేది కొరియన్లు, చైనీయులు. బాలిలో యురోపియన్లు, ఆస్ట్రేలియన్లు ఎక్కువుంటారు. సాఫ్ట్‌వేర్ సంగతేమో కాని గార్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకు మాత్రం ఇబ్బడిముబ్బడి అవకాశాలున్నాయిక్కడ. కంపెనీ స్టాండర్డ్‌ను బట్టి వేతనాలుంటాయి. గోల్డ్‌మైన్స్‌లో కూడా మంచి అవకాశాలే ఉన్నాయి.

ఓవైపు సునామీ..ఇంకోవైపు అగ్నిపర్వతాలు

ఇక్కడ భయపెట్టేవల్లా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు. ఇవన్నీ మధ్య ఇండోనేషియాలోని జావా అనే ప్రాంతంలో ఎక్కువ. కొన్ని అగ్నిపర్వతాలయితే నిరంతరం రగులుతూనే ఉంటాయి. అయినా ఆ ప్రాంతాల్లో కూడా జనజీవనం సాగుతోంది. ఓ వైపు అగ్నిపర్వతాల్లోంచి పొగ వస్తూంటుంది..మరోవైపు దాని పరిసరాల్లోనే ప్రజలు తమ పనుల్లో మునిగి ఉంటారు.

ఆశ్చర్యమేస్తుంది ఆ దృశ్యం చూస్తే. నిజానికి అగ్నిపర్వతాలు ఎగజిమ్మే నిప్పుకణికల వల్ల ఇక్కడ మరణాల రేటు రోజురోజుకీ ఎక్కువవుతోంది. దట్టమైన పొగలో చిక్కుకుని కనిపించకుండా పోయే జనాల సంఖ్యా తక్కువేమీ లేదు. మా ఫ్యాక్టరీలోని ఓ వర్కర్ తల్లితండ్రులు ఇలాగే గల్లంతయ్యారు. ఇలాంటి వాళ్ల ఆచూకి తీయడం కోసం ప్రత్యేక బలగాలు పనిచేస్తూనే ఉంటాయి.

సునామీ...అయితే భయంక రమైన అనుభవం. 2004 నాటి సునామీలో ఊళ్లకు ఊళ్లే తుడుచిపెట్టుకుపోయాయి. అందులోంచి ఇంకా చాలామంది తేరుకోనే లేదు.. మొన్నటికిమొన్న వచ్చిన సునామీ కూడా మమ్మల్ని వణికించిందనే చెప్పాలి. ఇక్కడ అంత ప్రభావం చూపకపోయినా సునామీ వార్తతోనే అందరూ భయపడ్డారు. ఇళ్లు ఖాళీ చేసేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు ఇంకా స్వస్థలాలకు చేరుకోనేలేదు భయంతో. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇక్కడ ఎక్కువనే చెప్పాలి. ఓ రకంగా దైనందిన జీవితాన్ని చాలా డిస్ట్రర్బ్ చేస్తాయి.

ఇండోనేషియాలో భయపెట్టేవల్లా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు. ఇవన్నీ మధ్య ఇండోనేషియాలోని జావా అనే ప్రాంతంలో ఎక్కువ. కొన్ని అగ్నిపర్వతాలయితే నిరంతరం రగులుతూనే ఉంటాయి. అయినా ఆ ప్రాంతాల్లో కూడా జనజీవనం సాగుతోంది.  
సరస్వతి రమ